India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్( తాత్కాలిక) పద్ధతిలో 100 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రొఫెసర్-7, అసోసియేట్ ప్రొఫెసర్ -17,అసిస్టెంట్ ప్రొఫెసర్ -43, సీనియర్ రెసిడెంట్- 33 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 17న కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు.
మేఘా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సుంకిశాల ప్రాజెక్టు సందర్శించిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దవూర మండలం సుంకిశాల ప్రాజెక్ట్ ను బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించి మాట్లాడారు. హైదరాబాద్కు తాగునీరు అందించడం కోసం ఏర్పాటు అవుతున్న ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేపడుతున్న నిర్మాణ దశలోనే దృశ్యాలు వైరల్ అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు అంతర్ రాష్ట్ర దొంగలను నల్గొండ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి దాదాపు 23.53 లక్షల విలువ గల 31 తులాల బంగారం, కేజీ వెండి ఆభరణాలు, రూ.28 వేల నగదు, హోండా యాక్టీవా స్కూటీ, ఇనుప రాడ్డు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
వ్యాపార సముదాయ యాజమాన్యాలు, దుకాణదారులు ఉపయోగించే సింగిల్ యూజ్ కవర్లపై నిషేధం విధించినట్లు చండూరు మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తే రూ.10వేల జరిమానా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అరుణా కుమారి, శానిటరీ ఇన్స్పెక్టర్ సాయి, అరవింద్ పాల్గొన్నారు.
హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించిన డబ్ల్యుపీఎల్ సెలక్షన్స్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారిణి చిట్టి భవాని ఎంపికైనట్లు కోచ్ షేక్ సిద్దిఖ్ తెలిపారు. ఆగస్టు 14 నుంచి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో భవాని పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు భవానీని అభినందించారు.
వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దవూర మండలం చింతపల్లి తండాలో జరిగింది. గ్రామానికి చెందిన జటావత్ కృష్ణ పది ఎకరాల్లో బత్తాయి తోటలో నీటి కోసం బోర్లు వేయించగా బోర్లలో నీరు పడకపోవడంతో పంట ఎండి పోవడానికి వచ్చింది. దీంతో అప్పులు పెరిగిపోయాయి. మనస్థాపంతో కృష్ణ పురుగుల మందు తాగి మృతి ఆత్మహత్య చేసుకున్నాడు.
కృష్ణానది పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు కృష్ణా జలాశయాలు నిండు కుండలా మారాయి. వరద భారీగా రావడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా వారం రోజుల్లో 120టీఎంసీల నీరు దిగువకు వెళ్లింది. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తగా 12న మధ్యాహ్నం గేట్లు మూసివేశారు.
సెప్టెంబర్ 1 నుంచి జిల్లా మొదలుకొని గ్రామపంచాయతీ వరకు ఉద్యోగులకు అటెండెన్స్ యాప్ను నిర్వహించనున్నామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారులు సమ్మిళిత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా సమయానుకూలంగా పనిచేయాలని కోరారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ.పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ పాల్గొన్నారు.
యాదాద్రి: చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-డీసీఎం ఢీకొని ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలిపేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం అన్ని గేట్లను మూసి వేశారు. నాగార్జునసాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 588.80 అడుగులుగా ఉంది. అదే విధంగా గరిష్ఠ నీటినిల్వ 312.50 టీఎంసీలు కాగా, ఇప్పుడు 305.46 టీఎంసీలు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.