Nalgonda

News April 16, 2024

బాలికపై లైంగికదాడి.. దోషికి యావజీవ కారాగార శిక్ష

image

ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ BNG మండల పరిధిలోని చందుపట్లకు చెందిన నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు, రూ.25 వేలు జరిమానా విధిస్తూ.. RR జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంకే పద్మావతి సోమవారం తీర్పునిచ్చారు. బాధిత బాలికకు రూ.పది లక్షల పరిహారం ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సిఫార్సు చేసింది. 2017లో బాలికను అపహరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

News April 16, 2024

NLG: ముగిసిన ఓటరు నమోదు గడువు తేదీ!

image

ఉమ్మడి జిల్లాలో ఓటర్ నమోదు గడువు తేదీ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా.. ఫిబ్రవరి 8న ఓటరు తుది జాబితాను విడుదల చేసిన విషయం విధితమే. ఈ జాబితాలో ఉమ్మడి జిల్లాలో 3533 పోలింగ్ కేంద్రాల్లో 29,20,119 మంది ఓటర్లు ఉన్నారు. తుది జాబితా వెలువడిన నాటి నుంచి ఈనెల 15 వరకు ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

News April 16, 2024

NLG: రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

image

లోక సభ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు పూర్తి సహకారం అందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జే .శ్రీనివాస్ కోరారు. సోమవారం అయన కలెక్టరేట్లో నామినేషన్ల ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 18 నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అంశాలపై చర్చించారు.

News April 15, 2024

NLG: గ్రామీణ మహిళలకు గుడ్ న్యూస్

image

స్టేట్ బ్యాంకు ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ గ్రామీణ మహిళలకు బ్యూటీ పార్లర్ లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు SBI-RSETI డైరెక్టర్ రఘుపతి తెలిపారు. భోజన వసతి కల్పించడం జరుగుతుందన్నారు. 19 నుండి 45 ఏళ్ల మధ్య వుండి 10వ తరగతి పాసైన నిరుద్యోగ గ్రామీణ మహిళలు ఈనెల 18 లోపు SBI, ఆర్సెటి రాంనగర్, నల్గొండలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 15, 2024

NLG: గ్రామాల్లో నిరుపయోగంగా నీటి తొట్లు!

image

ఉమ్మడి జిల్లాలో ఎండాకాలంలో పశువుల దాహం తీర్చడానికి ఉపాధిహామీ నిధులతో నిర్మించిన నీటి తొట్లు నిరుపయోగంగా మారాయి. కొన్ని గ్రామాల్లో నీళ్లతో ఉండాల్సిన తొట్లలో చెత్తాచెదారం పేరుకుపోయాయి. NLG, SRPT, యాదాద్రి BNG జిల్లాలోని అనేక గ్రామాల్లో మూడేళ్లక్రితం గ్రామానికి రెండు చొప్పున పశువుల నీటి తొట్లు నిర్మించారు. కానీ ఎక్కడా తొట్లలో నీళ్లు నింపి పశువులకు దప్పిక తీరుస్తున్న దాఖలాలు లేవని రైతులు తెలిపారు.

News April 15, 2024

NLG: జిల్లాలో రూ.9 కోట్లపైనే పట్టుబడిన నగదు, వస్తువులు

image

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు జరిపిన తనిఖీలలో తగిన పత్రాలు లేని 9.17 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, బంగారం ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. అంతరాష్ట్ర సరిహద్దు వెంట నిఘా ఉంచామని వాడపల్లి, అడవిదేవులపల్లి టెయిల్పాండ్, నాగార్జునసాగర్ వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణా అడ్డుకుంటున్నట్లు వివరించారు.

News April 15, 2024

యాదాద్రి ఆలయ వార్షిక ఆదాయ వ్యయాలు

image

యాదగిరి శ్రీవారి దేవస్థాన 2023- 24 ఆర్థిక సంవత్సర ఆదాయం వ్యయాలు ఆలయ ఈవో వెల్లడించారు. అందులో వసతి గృహాలు, హుండీలు, వ్రతాలు,VIP& బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, తలనీలాలు, ప్రసాదాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ. 224,25,87,229 ఆదాయం వచ్చింది. సిబ్బంది వేతనాలు, పెన్షన్లు, ప్రసాదాల సరుకులు, ప్రభుత్వ పన్నులు, సేవలు, ఎలక్ట్రానిక్ & వాటర్, భక్తుల వసతులు తదితర విభాగాల కలిపి రూ. 214,55,85,249 వ్యయం.

News April 15, 2024

NLG: ఉమ్మడి జిల్లాపై ప్రధాన పార్టీల ఫోకస్

image

ఉమ్మడి జిల్లాపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెంచాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలతో క్షేత్రస్థాయిలో జోరు పెంచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఉమ్మడి జిల్లాలోని NLG, BNG పార్లమెంటు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుండటంతో పోటీ ఆసక్తి రేకెత్తిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఈసారి బిజెపి రెండు స్థానాల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నది.

News April 15, 2024

నల్గొండ, భువనగిరి ఓట్ల లెక్కింపు ఇక్కడే..!

image

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఉన్నతాధికారులు ఓట్లను లెక్కించే ప్రాంతాలను గుర్తించి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపు దుప్పల్లి వేర్‌హౌజింగ్‌ కార్పొరేషన్‌ గోదాములో చేపడతారు. భువనగిరి ఓట్ల లెక్కింపు రాయగిరి అరోరా ఇంజినీరింగ్‌ కళాశాలలో చేపడతారు. భువనగిరి స్థానం 2009లో ఏర్పడినప్పటి నుంచి ఇక్కడే ఓట్లు లెక్కిస్తున్నారు.

News April 15, 2024

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్

image

నల్గొండలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సోమశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెంలోని నూకల వెంకట్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి ఫార్మసీ అనుమతి కోసం 20,000 డిమాండ్ చేశాడు. భాదితుడు సోమశేఖర్‌కు రూ. 18 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు.