India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లా పెద్ద అడిశర్ల పల్లి మండలం చింతల్ తండాకు చెందిన రామావత్ రాందాస్ 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. ఎస్ఎస్సీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2020, 2021లో, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ 2022, 2023లో అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్ కేంద్ర హోం శాఖలో ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ బెంగుళూరులో అకౌంటెంట్గా పని చేస్తున్నాడు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కుటుంబ వినియోగ వ్యయ పూర్తి కావచ్చింది. పట్టణ ప్రజల జీవన విధానాలు, జీవనశైలి, ఆదాయం ఖర్చు తదితర అంశాలపై ఉమ్మడి జిల్లాలో జాతీయ గణాంక పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరానికి చేపట్టిన కుటుంబ సర్వే ఆగస్టుతో ముగియనున్నది. ఒక్కో కుటుంబాన్ని సర్వే చేసేందుకు అధికారులు సుమారు గంట సమయం తీసుకుంటున్నారు..
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పాతదొనబండ తండా వాసి భూక్యా మౌనిక ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. పేద కుటుంబానికి చెందిన ఆమె HYD దిల్సుఖ్నగర్లో ఉంటూ స్థానికంగా ఉండే పిల్లలకు హోమ్ ట్యూషన్లు చెబుతూ ఆమె చదువుకుంది. ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్-4 ఆరో ర్యాంకు, TGPSC ఫలితాల్లో పంచాయతీరాజ్ AEE, 2023లో రైల్వేలో క్యారేజ్ అండ్ వ్యాగన్, లెవల్-3లో కమర్షియల్ కం టికెట్ క్లర్క్ జాబ్స్ సాధించింది.
మత్స్యకారులకు చేప పిల్లల బదులు నగదు బదిలీ చేయాలని ఉమ్మడి జిల్లాలోని మత్స్యకార కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీలో కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి తమను మోసం చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. లెక్కింపు సమయంలోనే కాంట్రాక్టర్లు తమను మాయం చేస్తున్నట్లు తాము అనేకసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
కుమారుడు చేసిన అప్పుల వల్ల తల్లి సూసైడ్ చేసుకుంది.. ఈ ఘటన సూర్యాపేటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కలమ్మ సూర్యాపేటలో నివసిస్తోంది. ఆమె కుమారుడు జల్సాలకు అలపాడుపడ్డాడు. ఎంత చెప్పినా వినకుండా అప్పులు చేశాడు. అప్పు ఇచ్చినవారు రోజూ ఇంటికి వచ్చి అడగడంతో ఆమె మనస్తాపానికి గురైంది. నల్ల చెరువు సమీపంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతోన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడమే కేసుల పెరుగుదలకు కారణమవుతోంది. ఫాగింగ్ చర్యలు చేపట్టకపోవడంతో దోమల బెడద తప్పడం లేదు. మే నుంచి ఇప్పటికి వరకు మూడు నెలల్లోనే సూర్యాపేట జిల్లాలో 155 డెంగీ కేసులు నమోదయ్యాయి. మలేరియా, టైఫాయిడ్ లాంటి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై గురువారం ఆయన జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కృష్ణా బేసిన్, నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ నిర్లక్ష్యానికి గత ప్రభుత్వమే కారణమని తెలిపారు. గత ప్రభుత్వం కాళేశ్వరంపై చూపిన శ్రద్ధ కృష్ణా బేసీన్ పై చూపలేదన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు మంచి పరిణామమని సుంకిశాల అవసరం లేని సాగునీటి పథకం అన్నారు.
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కృష్ణా బేసిన్, నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ నిర్లక్ష్యానికి గత ప్రభుత్వమే కారణమని తెలిపారు. గత ప్రభుత్వం కాళేశ్వరంపై చూపిన శ్రద్ధ కృష్ణా బేసీన్ పై చూపలేదన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు మంచి పరిణామమని సుంకిశాల అవసరం లేని సాగునీటి పథకం అన్నారు.
నల్లగొండ రాజకీయాలు మళ్లీ హీటెక్కిస్తున్నాయి. NLG నడిబొడ్డున బీఆర్ఎస్ నిర్మించిన జిల్లా పార్టీ ఆఫీసుపై రాజకీయ దుమారం రేగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పార్టీ ఆఫీసును కూల్చివేయాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారమే నిర్మించామని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ అంశం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
Sorry, no posts matched your criteria.