India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఎలక్ట్రిసిటీ ఈఈ రామారావును సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. దేవస్థానం విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న 12 మంది ఒప్పంద ఉద్యోగులు వ్యక్తిగత కారణాలతో జాబ్ మానేశారని.. వారి స్థానాల్లో కొత్తవారిని తప్పు దోవలో ఉద్యోగాల్లో చేర్పించారని విచారణలో తేలడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. ఇన్ఛార్జ్ ఈఈగా దయాకర్ రెడ్డిని నియమిస్తున్నట్లు తెలిపారు.
చదువుకున్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకుగాను NLGలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నల్గొండలోని తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న మున్సిపల్ పార్కులో న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 30 మంది మహిళలకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన నడ్డి గోపాలకృష్ణ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2018 డిసెంబర్లో పంచాయతీ కార్యదర్శి, 2019 నవంబర్లో రైల్వేలో గ్రూప్-డీ ఉద్యోగం, 2020లో సివిల్ కానిస్టేబుల్గా ఎంపికై ప్రస్తుతం భువనగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా ప్రకటించిన టీజీపీఎస్సీ ఫలితాల్లో ఏఈఈ సివిల్ ఇంజినీర్ (గెజిటెడ్) ఉద్యోగం సాధించాడు.
భువనగిరిలోని ప్రభుత్వ హైస్కూల్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. పాఠశాల ఆవరణలో మూత్రశాలల పక్కనే భోజనశాల ఏర్పాటు చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 500 మంది విద్యార్థులకు అరకొర మూత్రశాలలతో పాఠశాల అంతా కంపు కొడుతోంది. విద్యార్థులు రోగాల బారిన పడాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున జరిగింది. శేషమ్మ గూడెం గ్రామానికి చెందిన బొల్లెద్దు చందు (20) నల్గొండ ఎన్జీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన చందు దుప్పలపల్లి సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
రీజనల్ రింగ్ రోడ్డుపై భారీ ఇంటర్ చేంజ్ కూడళ్లను నిర్మించబోతున్నారు. HYD-పుణె హైవేని క్రాస్ చేసే సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద.. HYD-VJD హైవేని క్రాస్ చేసే CPL వద్ద ఈ కూడళ్లు ఉంటాయి. వీటికోసం ఢిల్లీ ఔటర్ రింగురోడ్డుపై నిర్మించిన ‘ఎక్స్టెండెడ్ డంబెల్’డిజైన్ ను ఎంపిక చేశారు. 8 వరసల (తొలి దశలో 4 వరసలు)తో రీజనల్ రింగు రోడ్డును నిర్మిస్తున్న నేపథ్యంలో ఇంటర్ చేంజ్ లను విశాలంగా రూపొందిస్తున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు మొట్టమొదటిసారి నీటిని విడుదల చేసి నేటితో 57ఏళ్లు నిండాయి. 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 1955 డిసెంబర్ 10న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
సాగర్ నీటి విడుదల నేపథ్యంలో ఈ సీజన్లో జిల్లాకు అదనంగా 4,400 మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయిస్తామని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్రావు హామీ ఇచ్చారని డీఏఓ శ్రవణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచన మేరకు నెల వారి కోటా కంటే అదనంగా కేటాయించారని పేర్కొన్నారు. ఆ ఎరువులు వారం రోజుల్లో జిల్లాకు రానున్నాయని ఆయన పేర్కొన్నారు.
శాలిగౌరారం మండలం అంబారిపేటలో మిత్రులు మానవత్వం చాటుకున్నారు. వివరాలిలా.. గ్రామానికి చెందిన భూపతి నరేష్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ HYDలో చికిత్స పొందుతున్నాడు. 2000-2001 ప్రాథమిక పాఠశాలలో చదివిన విద్యార్థులు తమ దోస్త్ నరేశ్ను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. మిత్రులు వెంకన్న, శ్రావణ్ కుమార్, లింగాల వెంకన్న, యాదయ్య ఆర్థిక సహాయంగా రూ.25వేలు అందించి ఆదర్శంగా నిలిచి స్నేహాన్ని చాటుకున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు వరిలో సన్న రకాల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్లో సన్న రకం బియ్యానికి మంచి ధర పలుకుతోంది. అంతేకాకుండా ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. ఈసారి వర్షాలు అనుకూలించకపోయినప్పటికీ చాలా మంది రైతులు సన్నరకాల నారు పోశారు. నీటి వసతులు ఉన్నచోట నాట్లు సైతం వేశారు. సాగర్ కూడా నిండుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.