Nalgonda

News April 10, 2024

సూర్యాపేట: బీ అలర్ట్: కలెక్టర్ హరిచందన

image

SRPT కలెక్టరేట్లో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి SRPT కలెక్టర్ ఎస్. వెంకటరావుతో కలిసి NLG, SRPT జిల్లాలకు చెందిన ఎస్పీలు, అదనపు కలెక్టర్లు,SRPT జిల్లా ఏఆర్వోలు, నోడల్ ఆఫీసర్స్, సెక్టోరియల్ ఆఫీసర్స్ తో NLG పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా ఉండాలన్నారు.

News April 10, 2024

భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌పై సీఎం రేవంత్ సమీక్ష

image

భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. హైదరబాద్‌లోనిఎమ్మేల్యే రాజ్‌గోపాల్ రెడ్డి నివాసంలో చర్చించారు. ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మేల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్, సామెల్, మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.

News April 10, 2024

NLG: నాగార్జునసాగర్ జలాశయం సమాచారం

image

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. బుధవారం ఉదయం సమాచారం మేరకు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 510.30 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 132.8618 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక గత సంవత్సరం ఇదే సమయంలో 528.00 అడుగులు, 164.2680 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ లో 6,846 క్యూసెక్కులు ఉంది.

News April 10, 2024

నల్గొండ: రెండు తలల గొర్రె పిల్ల జననం 

image

తిప్పర్తి మండలంలోనీ అనిశెట్టి దుప్పలపల్లికి చెందిన కన్నెబోయిన చెన్నయ్య గొర్రెల మందలోని ఓ గొర్రె మంగళవారం సాయంత్రం రెండు తలలతో గొర్రె పిల్లకి జన్మనిచ్చింది. వింత ఆకారంలో జన్మించిన గొర్రె పిల్లను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చాారు. జన్యుపరమైన లోపంతో ఇలా జరుగుతుందని పశువైద్యులు చెబుతున్నారు. 

News April 10, 2024

రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లనున్న సీఎం రేవంత్

image

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. భువనగిరి పార్లమెంట్ స్థానం ఎన్నికపై సమీక్ష చేయనున్నారు. భువనగిరి పార్లమెంట్ ఇన్ ఛార్జీగా రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.

News April 10, 2024

సూర్యాపేట: ఒకే కొమ్మకు 55 మామిడి కాయలు

image

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 55 మామిడి కాయలు ఒకే చోట కాశాయి. అది కూడా విరిగిపోయి ఎండినదనుకున్న కొమ్మకు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన మోదాల గంగయ్య పొలంలో విరిగిపోయి ఎండిపోయిందనుకున్న మామిడి చెట్టు కొమ్మ చిగురించింది. ఆ చిగురే మామిడి కాయల రూపంలో ప్రతిఫలిచింది. ఏకంగా 55 ఒకే చోట కాసి చూపరులను ఆకట్టుకుంటోంది.

News April 10, 2024

నల్గొండ: నాలుగేళ్ల చిన్నారి నాలెడ్జ్ అదుర్స్

image

చిట్యాలకు చెందిన నాలుగున్నరేళ్ల గంజి తక్ష్వి తన ప్రతిభలో మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారి ఏమాత్రం తడుముకోకుండా రాష్ట్ర రాజధానుల పేర్లు చెబుతోంది. రెండు రోజుల్లోనే నేర్చుకుందన్నారు. రానున్న కాలంలో ముఖ్యమంత్రులు, జాతీయ పక్షులు, జంతువుల పేర్లు నేర్పించాలని సంకల్పంగా పెట్టుకున్నామన్నాని పాప తల్లిదండ్రులు చెబుతున్నారు.

News April 10, 2024

NLG: గ్రామాల్లో ప్ర’జల’ కష్టాలు..!?

image

ఉమ్మడి జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. అసలే కరువు, ఆపై ఎండలు ముదిరిపోవడంతో భూగర్భ జలాలు మరింత లోతుల్లోకి వెళ్లాయి. దీంతో గ్రామ పంచాయతీల్లో బోర్లు ఎండిపోయాయి. మరోవైపు ఎప్పుడు వస్తాయో తెలవని భగీరథ నీళ్ల కోసం జనాలు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సివస్తోంది. భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లో నీటి కొరత లేకుండా చూడాలన్నారు.

News April 10, 2024

నల్గొండ: సూపర్బ్.. 40 ఏళ్లుగా దాహార్తిని తీరుస్తున్న బావి

image

నల్గొండ జిల్లా కనగల్ మండలం పొనుగోడులోని మేడిబావి 40ఏళ్లుగా ప్రజల దాహార్తిని తీరుస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయి మోటార్లు పనిచేయకపోయినా ఈ బావిలో మాత్రం సమృద్ధిగా నీరు లభిస్తుండటంతో గ్రామంలో పలు కాలనీలకు వేసవిలో నీటి ఎద్దడి తప్పింది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచి నాంపల్లి రాములు 50ఏళ్ల క్రితం తన వ్యవసాయ అవసరాల నిమిత్తం తన భూమిలో బావిని తవ్వించారు.

News April 10, 2024

నల్గొండ: కొండెక్కిన చికెన్ ధరలు

image

రోజురోజుకూ కోడిమాంసం వెల కొండెక్కుతోంది. మొన్నటి వరకు కిలో రూ.200 పలికిన చికెన్‌ ధర నేడు రూ.294కు చేరింది. దీంతో దుకాణానికి వెళ్లిన వారు ధర అడిగి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కిలో తీసుకునే వారు ఇప్పుడు ధరను చూసి అరకిలో తోనే పరిమితమవుతున్నారు. మున్ముందు చికెన్ ధరలు రూ.300పైగా చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు.