Nalgonda

News August 4, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం

image

నాగార్జున సాగర్ ప్రాజెక్టు తాజా సమాచారంఇన్ ఫ్లో :4,58,393 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 40,560క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం: 571.40 అడుగులుపూర్తి నీటి నిల్వ సామర్థ్యం: 312.5050 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 260.0858 టీఎంసీలు

News August 4, 2024

నల్గొండలో దోస్తానా అంటే ప్రాణం!

image

దోస్తానా అంటే నల్గొండ వాసులు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ ఇక్కడ కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ‌‌ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్‌‌ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్‌వెల్‌ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day

News August 4, 2024

రైతులకు నల్గొండ కలెక్టర్ సూచన

image

నాగార్జునసాగర్ నీటితో జిల్లాలోని అన్ని చెరువులు నింపనున్న దృష్ట్యా రైతులెవరు సాగునీటిని మళ్ళించుకోకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. శనివారం ఆయన నాగార్జునసాగర్ నీటి వినియోగంపై రెవెన్యూ, పోలీస్,ఇరిగేషన్, మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా రాష్ట్ర మంత్రులు శుక్రవారం సాగునీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.

News August 3, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం

image

నాగార్జున సాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ విధంగా ఉంది.
ఇన్ ఫ్లో :4,17,147క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 35,953 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం: 561.50అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం: 312.5050 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 235.9395టీఎంసీలు

News August 3, 2024

బీబీనగర్ పెద్ద చెరువులో మృతదేహం లభ్యం

image

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో గుర్తుతెలియని మృతదేహం శనివారం ఉదయం లభ్యమైంది. పోలీసులు చెరువు వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటకి తీశారు. మృతుడు హైదరాబాద్‌లోని వారసిగూడకు చెందిన సాయి కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News August 3, 2024

NLG: ప్రియుడి వేధింపులకు వివాహిత ఆత్మహత్య

image

నకిరేకల్ మండలం నోములకి
చెందిన వెల్మకంటి అనిత(28) అనే వివాహిత, ప్రియుడి వేధింపులు తాళలేక ఉరివేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన టేకుల రాజేశ్‌తో అనితకు కొంతకాలం క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది. తనతోనే ఉండాలన్న రాజేశ్ వేధిస్తుండడంతో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 3, 2024

NLG: ఆరేళ్లుగా నిరీక్షణ.. పెండింగ్ దరఖాస్తులకు మోక్షం ఏది?

image

ఆహారభద్రతా కార్డుల్లో రెండో బిడ్డ వివరాలను చేర్పించే అవకాశం లేకుండా పోయింది. కనీసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా వీలు లేదు. దీంతో వేలాది మంది బాధితులు వారి బిడ్డల వివరాలు కార్డుల్లో లేకపోవడంతో మదనపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 10.07 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. 29.84 లక్షల మంది సభ్యులు (యూనిట్లు) ఉన్నారు. సుమారు 50 వేల మందికి పైగా మీ-సేవా కేంద్రాల్లో ఆరేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు.

News August 3, 2024

ఉమ్మడి జిల్లాలో ఐటీ హబ్‌ల మనుగడ ప్రశ్నార్థకం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటుచేసిన ఐటీ హబ్‌ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు, ఇంజనీరింగ్ పట్టభద్రులకు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉపాధినిచ్చే దిశగా గత ప్రభుత్వం సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఐటి హబ్లు ఏర్పాటు చేసింది. ప్రారంభంలో అట్టహాసంగా ముందుకొచ్చిన పలు కంపెనీలు ఏడాది గడవకముందే.. సదరు కంపెనీలు లేకపోవడంతో హబ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారాయి.

News August 3, 2024

సూర్యాపేట: తెల్లవారుజామున మహిళ దారుణ హత్య 

image

సూర్యాపేట మండలంలో జాటోత్ తండాలో తెల్లవారుజామున దారుణం జరిగింది. తండాకు చెందిన దరావత్ రమణను దారుణంగా హత్య చేశారు.  ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News August 3, 2024

SRPT: కుటుంబ కలహాలతో యువకుడి బలవన్మరణం

image

పురుగు మందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన గిరిబాబు (22)కు తిరుమలగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన యువతితో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది గిరిబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదైంది.