Nalgonda

News April 9, 2024

NLG: ఇక రంగంలోకి అగ్రనేతలు..

image

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారానికి ఆ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగబోతున్నారు. ఈ నెల 11 నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టబోతోంది . NLG, BNG పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకులు ప్రచారంలో పాల్గొననున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు.

News April 9, 2024

NLG: ఓటర్లకు ‘స్మార్ట్’ కార్డులు..!

image

ఓటర్లకు ఎన్నికల సంఘం స్మార్ట్ కార్డు తరహాలో ఫొటో గుర్తింపు కార్డులను అందిస్తోంది. జిల్లాలో కొత్తగా ఓటరు నమోదు చేసుకున్న వారితో పాటు అడ్రస్, పేర్లలో మార్పులు, చేర్పులు చేసుకున్న వారికి కూడా ఈ కొత్త ఎపిక్ కార్డులను పంపిణీ చేయనున్నారు. జిల్లాకు 1.12 లక్షలు కొత్త ఫొటో గుర్తింపు కార్డులు వచ్చాయి. వాటన్నింటిని ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

News April 9, 2024

యాదాద్రి ఆలయంలోకి సెల్ఫోన్స్ నిషేధం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఆలయంలోకి సెల్ ఫోన్లు నిషేధిస్తూ ఏప్రిల్ 8న ఉత్తర్వులు జారీచేసింది. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే మినిస్టీరియల్ సిబ్బంది, మతపర సిబ్బంది, నాల్గో తరగతి సిబ్బంది, ఎస్పీఎఫ్, హోంగార్డ్స్, అవుట్ సోర్సింగ్, సిబ్బంది వారి సెల్ ఫోన్లు ఆలయంలోకి‌ తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

News April 8, 2024

NLG: ముగ్గురి మృతికి కారణమైన వ్యక్తికి కఠిన కారాగార శిక్ష

image

మద్యం మత్తులో డీసీఎం వాహనం నడిపి ముగ్గురి మృతికి కారణమైన మహమ్మద్ అప్సర్ పాషాకు పది సంవత్సరాల క కఠిన కారాగార శిక్ష రూ. 2 వేలు జరిమాన విధిస్తూ భువనగిరి జిల్లా మొదటి అదనపు కోర్టు తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. 2022లో భువనగిరి శివార్లలో టేకులసోమారం గ్రామస్థులు నర్సింహ్మ, రాజ్యలక్ష్మి, జంగమ్మ అనే ముగ్గురు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మృతి కేసులో అప్సర్ పాషాకు జైలు శిక్ష విధించారు.

News April 8, 2024

నల్గొండ జిల్లా ప్రజలకు SP కీలక సూచన

image

విద్యార్థినులు, మహిళలు ఫేస్ బుక్, వాట్స్‌అప్, ఇన్‌స్టాగ్రామ్‌ల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని జిల్లా SP చందన దీప్తి సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, మహిళా రక్షణ కోసం పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పోలీస్ శాఖ మహిళా భద్రతకు పటిష్ఠమైన నిఘా పెట్టిందన్నారు.

News April 8, 2024

GOOD NEWS.. KMM: ఇంటి నుంచే ఓటు వేయండి

image

పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఓటు హక్కు ప్రాధాన్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు సాక్ష్యం యాప్ ద్వారా, అలాగే ఫారం 12-డిలో హోమ్ ఓటింగ్‌కి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 8, 2024

‘సీతారాముల కళ్యాణ తలంబ్రాలు భక్తుల ఇండ్లకు అందిస్తాం’

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలను RTC కార్గో ద్వారా రూ.151 చెల్లిస్తే భక్తుల ఇండ్ల వద్దకు చేరుస్తామని ఉమ్మడి నల్లగొండ రీజినల్ మేనేజర్ ఎస్. శ్రీదేవి తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ.. ప్రజలు తమ దగ్గరలో వున్న టీఎస్ RTC లాజిస్టిక్స్ లో రూ. 151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులకు క్రోధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

News April 8, 2024

ఎండల ఎఫెక్ట్… జిల్లాలో తగ్గుతున్న కూరగాయల సాగు

image

ఓ వైపు సాగు నీటి కొరత.. మరో వైపు దంచికొడుతున్న ఎండలు కూరగాయలు సాగు చేసే రైతుల పాలిట శాపంగా మారాయి. ఒకప్పుడు కూరగాయల సాగుకు నిలయాలుగా ఉన్న పల్లెలు ప్రస్తుతం సాగుకు దూరమయ్యాయి. గత వేసవి కంటే ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటంతో పాటు నీటి వనరులు ఎండిపోవడంతో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గింది. బోరుబావులపై ఆధారపడి కూరగాయల సాగు ప్రారంభించినా ఎండ తీవ్రతతో నీరు అందక మధ్యలోనే పంటలను వదిలేస్తున్నారు.

News April 8, 2024

NLG: KCRను భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదు: BRS MLA

image

వందరోజుల కాంగ్రెస్ పాలనలో 2014కి ముందు ఉన్న దుర్భర పరిస్థితులు వచ్చాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ఎక్కడ చూసినా కరవు తాండవిస్తుందని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఇంతవరకు స్పందన లేదన్నారు. కేసీఆర్‌ను భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదన్నారు.

News April 8, 2024

సూర్యాపేట: బ్రెయిన్ డెడ్.. పదేళ్ల బాలుడి మృతి 

image

తిరుమలగిరి మండలం జేత్యా తండాకు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఎర్రం శెట్టి యాదగిరి కుమారుడు అవినీవేశ్ (10) బ్రెయిన్ డెడ్‌తో మృతిచెందాడు. మండల విద్యాధికారి శాంతయ్య, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలుడు మృతి చెందడం బాధాకరమన్నారు.