Nalgonda

News April 8, 2024

చిట్యాల: పేలుడు ఘటనలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

image

చిట్యాలలో శనివారం జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సమీపంలోని ఓ ఇంటిలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. గుంటూరుకు చెందిన బాణసంచా తయారీ కేంద్రం నిర్వహకుడు కోటేశ్వరరావు పేలుడులో తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంగతి తెలిసిందే.

News April 8, 2024

నల్గొండ: ఫోన్ ట్యాపింగ్ .. మహిళలకు లైంగిక వేధింపులు

image

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. నల్గొండలోని హైదరాబాద్ రోడ్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేసి మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వాహకుల కాల్ డేటా సేకరించి వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. అంతేకాకుండా.. దాదాపు 40 మంది మహిళల వ్యక్తిగత సంభాషణలు విని వారిని బ్లాక్ మెయిల్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు వెల్లడైంది.

News April 8, 2024

సాగర్ ఎడమ కాలువకు నీరు నిలిపివేత

image

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఆదివారం నీటిని నిలిపివేశారు. ఈనెల 1వ తేదీ నుంచి వారం రోజులపాటు కాలువకు నీటిని విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయకట్టు పరిధిలోని తాగునీటి కోసం పెద్దదేవులపల్లి చెరువుతోపాటు ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం నింపేందుకు వారం రోజుల్లో 2.23 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు డ్యామ్ అధికారులు తెలిపారు.

News April 8, 2024

NLG: 15 నుంచి వార్షిక పరీక్షలు షురూ

image

ఉమ్మడి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు 1-9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు (సమ్మేటివ్-2) జరగనున్నాయి. వాస్తవానికి ఈ నెల 8 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. వివిధ సంఘాల, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు పరీక్షలను 15 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఈ నెల 4న ఉత్తర్వులు జారీ చేసింది.

News April 8, 2024

అలంకారప్రాయంగా నల్గొండ ఐటీ హబ్!

image

నల్గొండలో గత ప్రభుత్వం రూ.74 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ టవర్ అలంకారప్రాయంగా మారింది. ఐటీ హబ్ నిర్మాణంతో నిరుద్యోగులు సంబర పడిపోయారు. మహానగరాలకు వెళ్లకుండానే స్థానికంగా సాఫ్ట్‌వేర్ కొలువులు లభించనున్నాయని సంతోషపడ్డారు. కానీ.. నేడు కంపెనీలు ముందుకు రాక, ఉద్యోగుల సందడిలేక హబ్‌ వెలవెలబోతోంది. గతంలో 360 మంది అభ్యర్థులను ఎంపిక చేసుకుని ప్లేస్‌మెంటు ప్రకటన కాగితాలకే
పరిమితమైంది. 

News April 8, 2024

NLG: ఐరిస్‌తో దళారులకు అడ్డుకట్ట.!

image

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారీ వ్యవస్థను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ఈ సారి కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. పౌరసరఫరాల శాఖ ఐరిస్ విధానం తీసుకొచ్చారు. గతంలో ఆధార్ అనుసంధానం, ఓటీపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేసే వారు. తాజాగా ఓటీపీతో పాటు ఐరిస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ధాన్యం విక్రయించే రైతు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రానికి రావాల్సి ఉంది.

News April 8, 2024

NLG: దొంగతనాల నివారణకు పటిష్ట నిఘా

image

జిల్లాలో దొంగతనాల నివారణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య కూడళ్లు, నివాసాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వేసవి సెలవుల్లో వేరే ప్రాంతాలకు వెళ్లే వారు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిం చారు. విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలన్నారు.

News April 8, 2024

గ్రీవెన్స్ డే రద్దు: SP చందనా దీప్తి

image

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు ముగిసేవారు వరకు గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరగదని తెలిపారు.

News April 8, 2024

NLG: 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

image

జిల్లాలో భానుడు ప్రతాపం తగ్గడం లేదు. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం జిల్లాలో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిడమనూరు మండలంలో 44.5 డిగ్రీలు, అత్యల్పంగా చింతపల్లి మండలంలో వడకొండ గ్రామంలో 40.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు మండుతుండడంతో ఇంట్లో నుంచి బయటికి వచ్చేందుకు జనం జంకుతున్నారు.

News April 8, 2024

నల్గొండ ఎంపీగా హ్యాట్రిక్ కొడుతుందా..?

image

తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ (2014,2019) MP స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2014లో గుత్తా సుఖేందర్ రెడ్డి హస్తం పార్టీ నుంచి గెలిచి తర్వాత కారెక్కారు. 2019లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా గెలిచి కాంగ్రెస్ హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి. కాగా ఇక్కడ కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డి, BJPనుంచి సైదిరెడ్డి, BRS నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు.