Nalgonda

News April 7, 2024

బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు: కోమటిరెడ్డి 

image

తుంగతుర్తి నియోజకవర్గం పర్యటనలో కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఫామ్ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ ఇప్పుడు ప్రజలనుమోసం చేసేందుకు పొలంబాటతో వస్తున్నారని విమర్శించారు. శవాల మీద పేలాలు ఏరుకునే కేసీఆర్ కుటుంబ సభ్యుల మాటలు ప్రజలు నమ్మేస్థితిలో లేరని, ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని అన్నారు.

News April 7, 2024

NLG: జేబు దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన: MLA

image

ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని BRS ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. HYD తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వేదికగా కాంగ్రెస్‌ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నీటి మూటలని తేలిపోయిందన్నారు. మంత్రులకు IPL చూడటానికి ఉన్న ప్రాధాన్యం.. రైతులపై లేదని అన్నారు. జేబు దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన ఉందన్నారు.

News April 7, 2024

రామన్నపేట: నామినేషన్‌కు పెన్షన్ డబ్బులు విరాళం

image

రామన్నపేట మండలం మునిపంపుల తన సొంత గ్రామంలో భువనగిరి సీపీఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఓ వృద్ధురాలు తన పెన్షన్ డబ్బులను పోటీలో నిలిచేందుకు నామినేషన్ వేయడానికి తన పెన్షన్ డబ్బులను విరాళంగా అందజేశారు. పార్టీలకు అతీతంగా సీపీఎం పార్టీకి ఓటు వేసి గెలిపించుకుంటామని గ్రామస్తులు ధీమా వ్యక్తం చేశారు.

News April 7, 2024

సాగర్ ప్రాజెక్ట్ సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయ నీటి మట్టం రోజురోజుకూ తగ్గుతోంది. ఆదివారం ఉదయం నాగార్జునసాగర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 511.20 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలకు గాను 133.7164 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 1,350 క్యూసెక్కులుగా ఉంది.

News April 7, 2024

NLG: లోక్ సభ ఎన్నికల ప్రక్రియ వేగవంతం

image

ఈ నెల 18న రాష్ట్రంలోని అన్ని లోక్ సభ స్థానాల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో NLG, BNG, SRPT జిల్లాల అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. మే 13న నిర్వహించే పోలింగ్, జూన్ 3న కొనసాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను పటిష్ఠంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక పీవో, ఒక అసిస్టెంట్ పీవో, ఇద్దరు సహాయ ప్రిసైడింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

News April 7, 2024

చికిత్స పొందుతూ ఉపాధ్యాయురాలు మృతి

image

సూర్యాపేట శివార్లలో మూడు రోజుల క్రితం ఆగి ఉన్న లారీని ఆటో ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఘటనా స్థలిలోనే ఓ టీచర్ మృతి చెందిగా.. మరో ఇద్దరు టీచర్లు గాయపడ్డారు.  కాగా కలకోట్ల లావణ్య అనే ఉపాధ్యాయురాలు చికిత్స పొందుతూ హైదరాబాదులో మృతి చెందారు. ఈ ఘటనతో తోటి ఉపాధ్యాయులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News April 7, 2024

NLG: మద్యం ద్వారా దండిగా ఆదాయం!

image

ఉమ్మడి జిల్లాలో మందు బాబుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అనుకున్న దానికంటే అధికంగా వస్తుంది. గతేడాది 26,94,304 కాటన్ల మద్యం, 37,83,834 కాటన్ల బీర్ల అమ్మకాలు జరుగగా రూ.2,669.70 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఈ ఏడాదిలో 27,97,133 కాటన్ల మద్యం, 44,32,099 కాటన్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.2,797.80 కోట్ల ఆదాయం సమకూరింది.

News April 7, 2024

నల్గొండ: పదో తరగతి విద్యార్థిని మిస్సింగ్

image

తిప్పర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైనట్లు తిప్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల నల్గొండలో పదో తరగతి పరీక్షలు రాసిన ఆ విద్యార్థిని ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తిప్పర్తి పోలీసులు తెలిపారు.

News April 7, 2024

NLG: ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించేనా?

image

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పట్టుకుంది. టెట్ పాసైతేనే పదోన్నతులకు అర్హులని ఎస్ఈఆర్టీ నిబంధనలు విధించింది. ఎప్పుడో ఉద్యోగాలు పొందిన తాము ప్రస్తుతం పదోన్నతులు పొందేందుకు టెట్ తప్పనిసరి పాస్ కావాలనే నిబంధన పెట్టడం ఏమిటని ఉపాధ్యాయులు అసంతృప్తి చెందుతున్నారు. ప్రస్తుతం టెట్ అర్హత సాధించడం సాధ్యమయ్యే పని కాదని, మా కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

News April 7, 2024

NLG: భానుడు @ 44.5 డిగ్రీలు…!

image

ఉమ్మడి జిల్లాలో రోజురోజుకీ ఎండలు పెరుగుతున్నాయి. ఉదయం వేళల్లో సైతం ఎండల ధాటికి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఎండ వేడిమి తగ్గకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. శనివారం నాంపల్లి, పెన్‌పహాడ్ ఉష్ణోగ్రత 44.5 డిగ్రీలకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేసవి నుంచి రక్షించుకునే చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.