Nalgonda

News September 8, 2024

నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి

image

రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం నల్గొండ జిల్లాకి రానున్నారు. ఉదయం 9:30 గంటలకు మంత్రి పట్టణానికి చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నల్గొండ పట్టణంలోని వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

News September 7, 2024

సూర్యాపేట: క్వారీలో చిక్కుకుని వ్యక్తి మృతి

image

ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారం గ్రామ శివారులో క్వారీలో చిక్కుకుని వ్యక్తి మృతి చెందాడు. కూడలికి చెందిన బానోతు హీరా వాటర్ మోటర్ తీయబోయి నీళ్లలో చిక్కుకుని మరణించాడు. గతంలో అదే క్వారీలో మిడతనంపల్లికి చెందిన ముగ్గురి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. హీరా మృతితో విషాదం అలుముకుంది. 

News September 7, 2024

దేశంలోనే సెకండ్ ప్లేస్.. నల్గొండకు రూ.25లక్షలు

image

నల్గొండ మున్సిపాలిటీ స్వచ్ఛ, వాయు సర్వేక్షన్‌లో 2024లో రెండో స్థానం సాధించడంతో రూ.25 లక్షల ప్రోత్సాహకం లభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రాజస్థాన్ సీఎం బజానా చేతుల మీదుగా ఈరోజు నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ అందుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ… నల్గొండ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.

News September 7, 2024

NLG: మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు!

image

జిల్లాలో గతంలో మాదిరి ఈసారి కూడా పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు జరుపనున్నారు. ఇందుకు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు ఇప్పటికే సమకూర్చారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు సిబ్బందిని తీసుకుంటున్నారు. ప్రభుత్వ శాఖల నుంచి ఎన్నికల విధులకు అధికారులను, సిబ్బందిని ఎంపిక చేసేందుకు ఆయా శాఖల నుంచి ఉద్యోగుల, అధికారుల వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభించారు

News September 7, 2024

26 నుంచి MGU MED, BED సెమిస్టర్ పరీక్షలు

image

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఎంఈడి, బీఈడీ కళాశాలలో చదివే విద్యార్థులకు సెమిస్టర్ 2 రెగ్యులర్ పరీక్షలను ఈనెల 26 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించనున్నట్లు సిఓఈ ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల షెడ్యూళ్లను ఆయన విడుదల చేశారు. వర్సిటీ వెబ్సైట్లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

News September 7, 2024

NLG: ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి నిర్వహించుకోవాలి: జిల్లా కలెక్టర్

image

వినాయక చవితి సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి నల్గొండ జిల్లా ప్రజలకు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఆది దేవుడైన వినాయకుడు సర్వవిఘ్నాలను తొలగించి జిల్లా ప్రజలకు మంచి చేకూర్చాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకొని ప్రజలందరూ మట్టి గణపతులను పూజించాలని, భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలను నిర్వహించుకోవాలని తెలిపారు.

News September 6, 2024

నాగార్జున సాగర్ 4 గేట్లు ఎత్తివేత 

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. 4 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 32 వేల 276 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో: 1,55,845 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో : 72,845 క్యూసెక్కులుంది. పూర్తి స్థాయి నీటి మట్టం: 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం: 589.70 అడుగులుంది.  పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312 టీఎంసీలుండగా ప్రస్తుత 311.1486 టీఎంసీల నీరుంది. 

News September 6, 2024

మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి బాల్యం విశేషాలు

image

జిట్టా బాలకృష్ణారెడ్డి 14 డిసెంబర్ 1972న యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 1987లో బీబీనగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. 1993లో ఎల్‌బీ నగర్‌లోని డీవీఎం డిగ్రీ & పీజీ కళాశాల గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు.

News September 6, 2024

జిట్టా బాలకృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..

image

జిట్టా బాలకృష్ణారెడ్డి టీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2009లో భువనగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత జగన్ నాయకత్వంలో వైసీపీలో చేరారు. కొంతకాలానికి సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఇటీవలే దాన్ని బీజేపీలో విలీనం చేశారు. కొన్ని రోజులకు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

News September 6, 2024

జిట్టా కోరిక ఇదే..

image

తన ఫామ్ హౌస్‌లోనే కన్నుమూయాలనేదే జిట్టా బాలకృష్ణారెడ్డి చివరి కోరిక అని ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుంచి వెంటిలేటర్ మీద ఉంచి భువనగిరికి తరలిస్తున్నట్లు సమాచారం. కాగా జిట్టా మృతికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిట్టా అంత్యక్రియలు జరగనున్నాయి.