India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్, గుడిపల్లిలను మండల ప్రజాపరిషత్లుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది . కొత్తగా ఈ మండలాలకు ప్రజాపరిషత్ ఆఫీసులు ఏర్పాటు అవుతాయి. త్వరలోనే ఎంపీడీవో, ఎంపీవో, ఇతర సిబ్బంది నియామకం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే జడ్పిటిసి, ఎంపీటీసీ, ఎంపీపీలు రానున్నారు.

మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. నల్గొండ రీజీయన్లో 102 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT

జాతీయ రహదారుల పురోగతిపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో NH, AI, మోర్త్ అధికారులు శివశంకర్, కృష్ణ ప్రసాద్, రాష్ట్ర R&B శాఖ స్పెషల్ సెక్రెటరీ, ఆర్ఆర్ఆర్ పిడి దాసరి హరిచందన, ఈఎన్సీ మధుసూదన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

చండూరుకి చెందిన పాంపాటి భాస్కర్ శోభ దంపతుల మొదటి కుమారుడు ఉద్యోగరీత్యా 2017లో వియత్నం వెళ్లారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ.. అక్కడే హోటల్స్ స్థాపించి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వంలో యూత్ మినిస్ట్రీ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నీనా పరిచయం కావడం అది కాస్తా ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నారు. చండూరులో వారి పెళ్లి జరిగింది.

చండూరుకి చెందిన పాంపాటి భాస్కర్ శోభ దంపతుల మొదటి కుమారుడు ఉద్యోగరీత్యా 2017లో వియత్నం వెళ్లారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ.. అక్కడే హోటల్స్ స్థాపించి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వంలో యూత్ మినిస్ట్రీ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నీనా పరిచయం కావడం పరిచయం కాస్త ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నారు. చండూరులో వారి పెళ్లి జరిగింది.

రేపు (మంగళవారం) జరగవలసిన డిగ్రీ పరీక్షను వాయిదా వేసినట్లు మహాత్మాగాంధీ యూనివర్సిటీ సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను డిసెంబర్ 12న నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ సందర్శించాలని కోరారు.

నల్గొండ జిల్లాలో చలి పంజా విసురుతుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో ప్రజలు చలిమంటలు కాచుకోక తప్పడం లేదు. గత రెండు మూడు రోజులుగా జిల్లాలో 19 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు పలు ప్రాంతాల్లో పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చలి తీవ్రత కారణంగా వృద్ధులు, పిల్లలు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈఏడాది నల్గొండ జిల్లాలో 370, సూర్యాపేట జిల్లాలో 310, యాదాద్రి భువనగిరి జిల్లాలో 372 కేంద్రాలను ఏర్పాటు చేసి అధికారులు ధాన్యాన్ని సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో అక్టోబర్, నవంబర్ నెలల్లో అంచనాలకు మించి ధాన్యాన్ని రైతులు మార్కెట్లకు తీసుకువచ్చారు. గత ఏడాది ఉమ్మడి జిల్లాలో 4,24,135 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

చింతలపాలెం మండలంతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిన్న చింతలపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చింతలపాలెం మండలానికి రెండు కోట్లతో సీసీ రోడ్డు మంజూరు చేయించానన్నారు.మండలం అభివృద్ధికి ఎల్లపుడూ కృషి చేస్తానని తెలిపారు.

విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనాన్ని పెట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా తృప్తి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతి బాపూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల వంటగదిని, డైనింగ్ హాల్, పరిసరాలను, ఆటస్థలాన్ని, తరగతి గదులను తనిఖీ చేయడమే కాకుండా విద్యార్థినులు, వంట వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారితో కలిసి భోజనం చేశారు.
Sorry, no posts matched your criteria.