Nalgonda

News April 5, 2024

17నెలల చిన్నారిని కాపాడేందుకు విశ్వప్రయత్నం

image

సూర్యాపేటలో జరిగిన <<12991416>>రోడ్డుప్రమాదంలో<<>> 17నెలల చిన్నారి వేదస్విని తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి తరలించాక గంటపాటు కొన ఊపిరితో కొట్టుమిట్టాడింది. పాప ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేశారు. నలుగురు వైద్యులు, నలుగురు నర్సులు ఆక్సిజన్ అందించి సీపీఆర్ చేసినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. మరో వైపు చిన్నారి తల్లి పక్క బెడ్ పైనే అపస్మారకస్థితిలో ఉంది. ఈ దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి.

News April 5, 2024

సూర్యాపేట: ‘నిర్లక్ష్యమే ముగ్గురి ప్రాణాలు తీసింది ‘

image

సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<12991416>>ముగ్గురు మృతిచెందగా,<<>> 14మందికి గాయాలైన సంగతి తెలిసిందే. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పెద్ద శబ్దంతో సినిమా పాటలు పెట్టి నిర్లక్ష్యంగా ఆటో నడపడం కూడా ప్రమాదానికి ఓ కారణమని బాధితుల బంధువులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటే ప్రమాదం జరిగేది కాదంటున్నారు.

News April 5, 2024

సూర్యాపేట రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ టీచర్ మృతి

image

సూర్యాపేటలో జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రభుత్వ టీచర్ సరిత మృతి చెందారు. ఆటోలో ఉన్న లావణ్య, పావని అనే మరో ఇద్దరు టీచర్ల పరస్థితి విషమంగా ఉంది. వీరిలో లావణ్యను మెరుగైన చికిత్స కోసం HYDకు తరలించారు. వారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షనర్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

News April 5, 2024

ఆ ప్రాంతాల్లో నిరంతర నిఘా: ఎస్పీ చందనా దీప్తి

image

షీటీం బృందాలు మహిళా రక్షణలో ముందు వరుసలో ఉంటున్నాయని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గత నెలలో 12 ఫిర్యాదులు వస్తే 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండు, రైల్వే స్టేషన్లు, కళాశాలల వద్ద షీటీం సభ్యులు నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. వీటి పై సమాచారం అందించే వారు 98126 70235 చరవాణి సంప్రదించాలని కోరారు

News April 5, 2024

సూర్యాపేట: ప్రభుత్వ ఉద్యోగం సాధించిన లారీ డ్రైవర్

image

హుజుర్నగర్ నియోజకవర్గంలోని లింగగిరి గ్రామానికి చెందిన మధిర శ్రీనివాస్ రెడ్డి, షేక్ లతీఫు ఇద్దరు ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ ఉద్యోగాలలో ఫైర్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్గా జిల్లా టాప్ ర్యాంకులు సాధించారు. అయితే వీరిద్దరూ లారీ డ్రైవర్గా పని చేసుకుంటూ చదువుకుంటూ ఈ ఉద్యోగం సాధించినట్లు పేర్కొన్నారు. దీంతో కుటుంబసభ్యులు మిత్రులు బంధువులు అభినందించారు.

News April 4, 2024

సూర్యాపేట ప్రమాదం మృతుల వివరాలు

image

సూర్యాపేట ప్రమాద ఘటనలో బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి. చింతరెడ్డి సరిత టీచర్(44),
లునావత్ రుక్కమ్మ(63), గొలుసు వేదస్విని(17నెలలు) మృతిచెందారు. కలకొట్ల లావణ్య, కంపసాటి మహేష్(ఆటో డ్రైవర్), శివరాత్రి హైమావతి, రాములమ్మ, బొప్పాని పావని, మంగయ్య(టీచర్), చెరుకుపల్లి సైదమ్మ, చెరుకుపల్లి శైలజ, చెరుకుపల్లి విజయేందర్, జీడిమెట్ల సైదులు, కొమ్ము సువర్ణ, గొలుసు సంధ్య, గొలుసు మోక్షిత్, సైదులు గాయపడ్డారు.

News April 4, 2024

సూర్యాపేట: కుళ్ళిన మృతదేహం లభ్యం

image

హుజూర్ నగర్ మండలం దొంగల దిబ్బ, అమరవరం గ్రామాల మధ్య ఉన్న డొంక రోడ్డులో కుళ్లిన మృతదేహం లభ్యమైంది. మృతుడు హనుమంతుల గూడెం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణగా గుర్తించారు. ఈ మృతి పై పోలీసులు ఆరా తీస్తున్నారు. బైక్ మీద నుంచి కింద పడ్డాడా, ఎవరైనా చంపి ఇక్కడ పడేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చరమందరాజు తెలిపారు.

News April 4, 2024

యాదాద్రి క్షేత్రంలో రేపు చండీ హోమం

image

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండిహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

News April 4, 2024

SRPT: ‘రైతులతో వెళ్లి సాగర్ గేట్లు బద్దలు కొడతాం’

image

జిల్లాలోని అన్ని గ్రామాల చెరువులను సాగర్ నీటి ద్వారా నింపాలని, నీరు వదలక పోతే నేరుగా రైతులతో వచ్చి గేట్లు బద్దలు కొడతామని నల్లగొండ పార్లమెంట్ BJP ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. గురువారం సాగర్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటిని పరిశీలించి మాట్లాడారు. నీరు లేక గ్రామాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం గ్రామాలలో చెరువులను నింపాలన్నారు.

News April 4, 2024

SA-2 పరీక్షలు ఈనెల 15కు వాయిదా

image

SA-2 పరీక్షలు ఈనెల 15 కు వాయిదా వేస్తూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ఈ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 18 వరకు ఉన్నాయి. కాగా హై స్కూల్ ఉపాధ్యాయులు స్పాట్ డ్యూటీలో ఉండటం మూలంగా ఒకటి నుంచి 9వ తరగతి వరకు పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని భావించిన విద్యాశాఖ అధికారులు ఈ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 22 వరకు నిర్ణయిస్తూ షెడ్యూల్ జారీ చేశారు.