India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో ఖాళీగా ఉన్న జిల్లా ప్రోగ్రాం అధికారి పోస్టు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయుటకు ఇచ్చిన నోటిఫికేషన్కు సంబంధించి ప్రొవిజినల్ మెరిట్ జాబితాను www.nalgonda.telangana.gov.in వెబ్సైట్లో ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ నోటీస్ బోర్డులో ప్రకటించారని డీఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలు ఉన్నట్లయితే సోమవారం మధ్యాహ్నం లోగా లిఖితపూర్వకంగా అందజేయాలన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రూప్-3 పరీక్షలకు సంబంధిత అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఒరిజినల్ ఐడీతో పరీక్షకు హాజరుకావాలని, ఉదయం 10 గం. ప్రారంభమయ్యే పేపర్-1 పరీక్షకు 8:30 గంటలలోపు, పేపర్-2కి 1:30- 2:30 వరకు పరీక్షా కేంద్రాల్లో హాజరు కావాలన్నారు. మొదటి రోజు పేపర్-1 పరీక్షకు తీసుకొచ్చిన హాల్టికెట్ను మిగతా పరీక్షలకు తీసుకొని రావాలని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
#SHARE IT

నల్గొండ పట్టణ పరిధి కేశరాజుపల్లికి చెందిన ప్రేమ్ – సునీతల కుమారుడు ప్రణబ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 2020లో ఫైర్మెన్, 2024 ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్గా కొనసాగుతున్న ప్రణబ్ రెవెన్యూ శాఖలో చేరనున్నట్లు తెలిపారు.

నల్లగొండ పట్టణ పరిధి కేశరాజుపల్లికి చెందిన మెండే ప్రేమ్ – సునీతల కుమారుడు మెండే ప్రణబ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 2020లో ఫైర్మెన్, 2024 ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్గా కొనసాగుతున్న ప్రణబ్ రెవెన్యూ శాఖలో చేరనున్నట్లు తెలిపారు.

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన నిర్మాణాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె SLBC కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని తనిఖీ చేశారు. టీజీ ఎస్ఎం ఐడీసీ చీఫ్ ఇంజనీర్ దేవేందర్ కుమార్ వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల పరిస్థితిని వివరించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు సాగు చేసిన వరి పంట చేతికొచ్చింది. ఆనందంగా ఉండాల్సిన అన్నదాతలు భయంభయంగా, ఆందోళన చెందుతున్నారు. మారుతున్న వాతవరణ పరిస్థితులే అందుకు కారణం. ఆరుగాళం కష్టపడి పండించిన పంట ఎక్కడ అందకుండా పోతుందేమో అనేదే వారి ఆందోళన. వర్షాలు రాకూడదని, పంట చేతికందాలని అన్నదాతులు వరుణ దేవుడని ప్రార్థిస్తున్నారు.

నల్గొండ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా అధికారులు 5,03,500 కుటుంబాలను గుర్తించారు. ఇప్పటివరకు దాదాపుగా మూడు లక్షల గృహాల్లో ఎన్యూమరేటర్లు సర్వే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలతో పోలిస్తే నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో సర్వే వేగంగా ఇప్పటికే 55 శాతం పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు.

NLG: గ్రూప్- 3 పరీక్షల స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదేశించారు. అక్కడ భద్రపరిచిన ప్రశ్నాపత్రాలు, ఇతర కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్- 3 పరీక్షల స్ట్రాంగ్ రూమును పరిశీలించారు. జెసి జే.శ్రీనివాస్, ఆర్డిఓ అశోక్ రెడ్డి, డీఎస్పీ తదితరులున్నారు.

జిల్లాలో కొనుగోలు చేసిన పత్తి బిల్లులు పది రోజులైనా అందలేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు అన్నిచోట్ల పత్తి బిల్లుల చెల్లింపు ఆలస్యం అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్ అధికారుల జాప్యం వల్ల సకాలంలో బిల్లులు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

కోదాడలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో ఎయిర్ రైఫిల్, పిస్టల్, పీప్ సైట్ పోటీలు ప్రారంభమయ్యాయి. అండర్ 17, 14 విభాగాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు కళాశాలల నుంచి 50 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ అజం బాబా, పీడీలు మైసయ్య, వీవీ చారి, కొండలు, ప్రభాకర్, రంగారావు, నాని, అంజి క్రీడాకారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.