Nalgonda

News September 2, 2024

జాతీయ సాధన సర్వే నిధులు విడుదల

image

విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్లకోసారి జాతీయ సాధన సర్వే (న్యాస్) నిర్వహిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 3, 6, 9 తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు జాతీయ స్థాయిలో ఈ ఏడాది నవంబరు 19న ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. మూడు మాదిరి పరీక్షల కోసం ఉమ్మడి జిల్లాకు రూ.4,72,160 లక్షలు మంజూరయ్యాయి.

News September 2, 2024

NLG: 498 ఎకరాల్లో నీట మునిగిన పంట

image

జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 4 మండలాల్లో 498ఎకరాల్లో వరి, పత్తి, మిరప పంటలు నీట మునిగాయని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. వాడపల్లిలో పత్తి 20 ఎకరాలు, వరి 100 ఎకరాలు, మాడ్గులపల్లి మండలం కాల్వపల్లిలో వరి 2 ఎకరాలు, వేములపల్లి, శెట్టిపాలెం, రావుల పెంటలో 350 ఎకరాల్లో వరి, గుర్రంపోడు మండలం రేపల్లెలో మిరప 3 ఎకరాలు, పెద్దవూరలోని చలకుర్తిలో 3 ఎకరాల్లో వరి నీట మునిగినట్లు తెలిపారు.

News September 1, 2024

సూర్యాపేట: వరదలో చిక్కుకున్నారు.. పోలీసులు కాపాడారు..!

image

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం శివారులో ఓ పౌల్ట్రీ ఫాం జలదిగ్బంధమైంది. ఆ పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేసే కూలీలు వరదలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది.. ఏఎస్పీ నాగేశ్వర్ రావు, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో కూలీలను రెస్క్యూ చేసి కాపాడారు. బాధిత కూలీలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రాణాలు కాపాడిన పోలీసులకు వారు థ్యాంక్స్ చెప్పారు. 

News September 1, 2024

యాదాద్రి: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్

image

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కారణంగా యాదాద్రి జిల్లాలో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిందని జిల్లా కలెక్టర్ హనుమంత్ తెలిపారు. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే తప్ప బయటకి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే స్థానిక మండల తహసీల్దార్‌ను, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08685-293312 ఏర్పాటు చేశామన్నారు.

News September 1, 2024

SRPT: రేపు ప్రజావాణి రద్దు: అదనపు కలెక్టర్ లత

image

అధిక వర్షాల కారణంగా రేపు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అదనపు కలెక్టర్ రెవెన్యూ బీయస్ లత తెలిపారు. భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా సహాయక చర్యలు నిమగ్నం అయినందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అన్నారు. ఈ నెల 9న సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు.

News September 1, 2024

నడిగూడెం వరద పరిస్థితులను పరిశీలించిన ఎస్పీ

image

నడిగూడెం మండలంలో వరద పరిస్థితులను సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. మట్టి రోడ్డులో స్థానికులతో కలిసి ద్విచక్ర వాహనంపై ఆయన ప్రయాణించారు. ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News September 1, 2024

రామపురంలో సాగర్ ఎడమ కాలువకు గండి

image

నడిగూడెం మండల పరిధిలోని రామచంద్రాపురం 117 కిలోమీటర్ల వద్ద వరదకి సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. పంట పొలాల నుంచి వరద నీరు గ్రామంలోకి చేరుతోంది. గతంలో గండి పడడంతో అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. ఎన్ఎస్పి అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.

News September 1, 2024

బీ అలర్ట్.. అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

image

రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ, అతి భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శనివారం ఆయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

News August 31, 2024

సొంత ఖర్చులతో  బోరు వేయించిన మంత్రి కోమటిరెడ్డి

image

నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన సొంత ఖర్చులతో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం బోర్ వేయించారు. ప్రజలు నీటి సమస్యపై మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి వెంటనే తన సొంత ఖర్చులతో బోరు వేయిస్తానని ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బోర్ వేయించారు. 

News August 31, 2024

ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ నుంచి జాతీయ పశుగణన

image

ఉమ్మడి జిల్లాలో పెంపుడు జంతువుల పశుగణన SEP 1 నుండి ప్రారంభం కానుంది. పెంపుడు జంతువులైన ఆవుజాతి , గేదెజాతి, గొర్రెమేకలు , కుక్కలు, పిల్లులు, పందులు, గాడిదలతో పాటూ కోడి బాతుల లెక్కింపు కూడా స్వదేశీ జాతులు విదేశి జాతుల వివరాలు విడివిడిగా శాస్త్రీయ పద్దతిలో తర్ఫీదు పొందిన పశుసంవర్ధక శాఖ బృందాలు ప్రతీ ఇంటింటికి వెళ్లి ఆన్ లైన్ అప్ లోడింగ్ ద్వారా 4 నెలల పాటు నమోదు చేయనున్నారు.