Nalgonda

News April 3, 2024

సర్వే పూర్తి.. వినిపించనున్న రైలు కూత

image

కనగల్‌, చండూరు, నాంపల్లి మండల వాసులకు రైలు కూత వినిపించనుంది. ఇప్పటికే ఆయా మండలాల మీదుగా సర్వే పూర్తయింది. డోర్నకల్‌ నుంచి కూసుమంచి, పాలేరు, మోతె, సూర్యాపేట, భీమారం, తిప్పర్తి, నల్గొండ, కనగల్‌, చండూరు, నాంపల్లి మీదుగా.. గద్వాల వరకు రైల్వే లైను ఏర్పాటుకు ప్రాథమిక సర్వే పూర్తి అయింది. దీంతో ఖమ్మం, నల్గొండ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News April 3, 2024

ధాన్యం కొనుగొలుకు కంట్రోల్ రూమ్: కలెక్టర్ ఎస్ వెంకట్రావు

image

ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రత్యేకంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. ఏమైనా సందేహాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా నేరుగా రైతులు కంట్రోల్ రూం నంబర్ కు 6281492368 నేరుగా ఫోన్ చేయవచ్చన్నారు. జిల్లాలో దాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభించడం జరిగిందని రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందానని సూచించారు.

News April 3, 2024

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి 

image

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. చివ్వెంల మండలం కుడకుడ శివారులో ఈ ప్రమాదం జరిగింది. మోకు జారి కింద పడడంతో గీత కార్మికుడి బిక్షంకు గాయాలయ్యాయి. చికిత్స కోసం హైదారాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్ల ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. 

News April 3, 2024

NLG: నీటి అక్రమ వినియోగంపై నిఘా!

image

నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో నీటి అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు అధికారుల బృందం నిఘా పెట్టారు. ఆయకట్టు పరిధిలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలోని పెద్దదేవులపల్లి, పాలేరు చెరువులను నింపి నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా 3టీఎంసీల నీటిని ఎడమ కాలువకు విడుదల చేసిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయకట్టు పరిధిలోని ఆయా మండలాల్లో అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.

News April 3, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి సమాచారం అప్డేట్

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.5050 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 513.10 అడుగులు (136.9932 టీఎంసీలు)గా ఉంది. సాగర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా 4,881 క్యూసెక్కుల నీటిని, జంటనగరాల తాగునీటి అవసరాల కోసం ఎస్ఎల్బీసీ ద్వారా 1350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 6,231 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఎగువ నుంచి ఎటువంటి నీటి రాక లేదు.

News April 3, 2024

గుప్తనిధుల కొసం రాతి గోపురం ధ్వంసం

image

దేవాలయం రాతి గోపురంలో వజ్రాలు ఉంటాయని దానిని ధ్వంసం చేసిన ఘటన అనుముల మండలంలోని చోటుచేసుకుంది. పేరూరులో సోమేశ్వరస్వామి దేవాలయం కాకతీయుల కాలంలో నిర్మించారు. గతేడాది రూ.40 లక్షల నిధులతో దేవాలయం పునర్నిర్మాణం చేపట్టారు. గోపురం తొలగించి దేవాలయ ఆవరణలో పెట్టారు. దుండగులు ఆ రాతి గోపురాన్ని వాగులోకి తీసుకెళ్లి పగలగొట్టారు. అటుగా వెళ్లిన గ్రామస్థులు గమనించి దేవాలయం కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు.

News April 3, 2024

కృష్ణా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

కృష్ణా నది ఒడ్డున గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనా సంఘటన మంగళవారం చింతలపాలెం మండల పరిధిలోని బుగ్గమాదారం గ్రామ శివారులో బుగ్గ వాగు కృష్ణానదిలో కలిసే చోట వెలుగు చూసింది. ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బుగ్గ మాధవరం గ్రామంలోని బుగ్గ వాగు కృష్ణ నదిలో కలిసే ప్రాంతంలో సుమారు 55 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగిన మగ వ్యక్తి మృతదేహం కనిపించడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు

News April 3, 2024

ఈనెల4న నల్గొండలో స్పాట్ అడ్మిషన్లు

image

గ్రూప్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్, RRB, SSC, రాష్ట్రస్థాయి, కేంద్ర స్థాయి ఉద్యోగాల కొరకు ఫౌండేషన్ కోర్సు ద్వారా మూడు నెలల పాటు ఉచిత వసతి, శిక్షణ అందచేస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం ఈనెల 4న నల్గొండలోని విశ్వదీప్ విద్యాపీట్ హైస్కూల్‌లో స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 3, 2024

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ హరిచందన

image

NLG: ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఎలాంటి సమస్యలు రాకుండా లోకసభ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు. మంగళవారం ఆమె నల్గొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లోకసభ ఎన్నికల విధుల నిర్వహణకు నియమించబడిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

News April 3, 2024

గంజాయి వాడకంపై ఉక్కుపాదం: SP చందనా దీప్తి

image

నల్గొండ జిల్లాలో గాంజయి, డ్రగ్స్ రవాణా, వినియోగం మీద ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో విడుదల చేసిన గంజాయి, కల్తీ కల్లుని నిర్మూలిద్దాం.. సమాజాన్ని కాపాడుదాం అనే పోస్టర్ అవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిషేధిత మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపీడ అన్నారు.