Nalgonda

News November 11, 2024

రైతులను మోసం చేస్తే.. మిల్లులు సీజ్ చేస్తాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,320 కన్నా తక్కువగా రైస్ మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఎవరైనా రైస్ మిల్లర్లు మద్దతు ధర కన్నా తక్కువగా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను మోసం చేసినట్లయితే రైస్ మిల్లును సీజ్ చేస్తామని హెచ్చరించారు. మిల్లును సీజ్ చేయడంతో పాటు, ఆ మిల్లుకు సంబంధించిన అన్ని రకాల లైసెన్సులను రద్దు చేస్తామన్నారు.

News November 11, 2024

NLG: జిల్లాలో ముమ్మరంగా సమగ్ర సర్వే

image

నల్గొండ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. శనివారం 20,324, ఆదివారం 30,168 గృహాలను సర్వే చేశారు. రెండు రోజుల్లో మొత్తం 50,492 ఇండ్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా పూర్తి చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎన్యుమరేటర్లను ఆదేశించారు.

News November 11, 2024

మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే రైస్ మిల్లు సీజ్: కలెక్టర్

image

NLG: జిల్లాలో ఎవరైనా రైస్ మిల్లర్ మద్దతు ధర కన్నా తక్కువకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను మోసం చేసినట్లయితే రైస్ మిల్లును సీజ్ చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. అంతేగాక అన్ని రకాల లైసెన్స్‌లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర, బోనస్ ను పొందాలని సూచించారు.

News November 11, 2024

NLG: లింకులు, ఓటీపీలు చెప్పొద్దు.. జిల్లా కలెక్టర్ కీలక సూచన

image

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ఎవరు ఓటీపీ లేదా లింకులు అడగరని, అలాగే ప్రజలు లింకులు, ఓటీపీలు చెప్పాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఆదివారం ఆమె నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలోని లక్ష్మీపురం, గాంధీనగర్ వీధులలో సమగ్ర కుటుంబ సర్వేను తనిఖీ చేశారు. ఎన్యుమరేటర్లు సర్వే ఎలా చేస్తున్నారు పరిశీలించారు.

News November 10, 2024

NLG: విహారయాత్రలో విషాదం.. యువకుడు మృతి

image

నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ విహార యాత్రలో విషాదం నెలకొంది. ఆదివారం నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి అనిల్ అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా అనిల్ స్నేహితులతో కలిసి సికింద్రాబాద్ నుంచి వైజాగ్ కాలనీకి విహారయాత్ర కోసం వచ్చినట్టు పోలీసులు తెలిపారు.

News November 10, 2024

సూర్యాపేట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

సూర్యాపేట జిల్లా మఠంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. మృతుల రఘునాథ్ పాలెం, పెదవిడు గ్రామాలకు చెందినవారుగా గుర్తించారు. ఘటన స్థలానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 10, 2024

18 లోగా పరీక్ష ఫీజులు చెల్లించాలి: డీఈఓ భిక్షపతి

image

2025 సంవత్సరం మార్చి నెలలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షల ఫీజును ఈనెల 18లోగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 50 అపరాధ రుసుముతో డిసెంబర్ 2, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 12, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 21 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News November 10, 2024

సర్వేలో జిల్లా వ్యాప్తంగా 5 లక్షల 3,411 ఇండ్లు గుర్తింపు

image

సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లాలో 5 లక్షల 3,411 ఇండ్లను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇండ్ల జాబితాను పూర్తి చేయడం జరిగిందని, శనివారం నుంచి కుటుంబ వివరాల సేకరణను ప్రారంభించినట్లు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేపై శనివారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా ప్రతినిధులు సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

News November 10, 2024

సర్వేలో జిల్లా వ్యాప్తంగా 5 లక్షల 3,411 ఇండ్లు గుర్తింపు

image

సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లాలో 5 లక్షల 3,411 ఇండ్లను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇండ్ల జాబితాను పూర్తి చేయడం జరిగిందని, శనివారం నుంచి కుటుంబ వివరాల సేకరణను ప్రారంభించినట్లు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేపై శనివారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా ప్రతినిధులు సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

News November 10, 2024

సమగ్ర సర్వేపై అనుమానాలు ఉంటే నివృత్తి చేయాలి: కలెక్టర్ త్రిపాటి

image

సామాజిక,ఆర్థిక,విద్య, ఉపాధి,రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటి కుటుంబ సర్వేపై విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అందువల్ల సర్వేకు సంబంధించి ప్రజలలో ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. సమగ్ర సర్వేపై ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు.