India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NLG జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలను కల్పించుటకు నేడు ఉదయం 10-30 గంటలకు జిల్లా ఉపాధికల్పన కార్యాలయము, ఐటిఐ క్యాంపస్ నల్లగొండలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి S.మాధవరెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 4 ప్రైవేట్ కంపెనీలు హాజరవుతున్నాయని, ఎంపిక కాబడిన వారు NLG, HYD పరిసర ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు.
చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన చెరువుగట్టు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు, దేవస్థానం కమిటీ కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గట్టు పైకి వచ్చే రహదారులతో పాటు ఘాట్ రోడ్డు సైతం డబుల్ రోడ్డు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.
నార్కెట్ పల్లి మండలం, ఎల్లారెడ్డి గూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనులన్నీ ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన ఎల్లారెడ్డి గూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల తరగతి గదులు ,వంటగది, తాగునీటి సౌకర్యం, ప్రహరీ ,పాఠశాల ఆటస్థలం, టాయిలెట్స్ తదితర సౌకర్యాలను పరిశీలించారు.
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులు, గతంలో రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోని రైతులు వచ్చేనెల ఐదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీఏఓ పాల్వాయి శ్రవణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఆయా గ్రామాల ఏఈఓలకు అందజేయాలన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గతనెలలో చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిపోయిన 109 ఖాళీలను మళ్లీ పదోన్నతులతో భర్తీ చేసేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో పదోన్నతులపై ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో ఒక్కో ఉపాధ్యాయుడు రెండు నుంచి మూడేసి పోస్టుల్లో పదోన్నతి పొంది ఒక పోస్టులో జాయిన్ కావడంతో మిగతావి ఖాళీగా మిగిలిపోయాయి. కొందరు పదోన్నతి పొంది కూడా పోస్టు వద్దని రాసిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ఇవాళ శాసనసభలో ప్రవేశ పెడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు ఈ పద్దుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పథకాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కేటాయింపులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. సీనియర్లు ఉత్తమ్, కోమటిరెడ్డి మంత్రులుగా ఉండడంతో జిల్లాకు ప్రయారిటీతో పాటు అధిక నిధులు వస్తాయని జిల్లా ప్రజానీకం ఆశిస్తోంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్వంగా వరద వస్తోంది. ప్రాజెక్టు సమాచారమిలా..
ఇన్ ఫ్లో: 9,500 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 9,500 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం 503.80అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ 121.3844 టీఎంసీలు
గంజాయి నిర్మూలనకు పోలీసు శాఖ ఇప్పుడు ప్రత్యేక కిట్టునే ఉపయోగిస్తోంది. ”గంజాయి తాగే వారిని గుర్తించేందుకు ఎబాన్ డ్రగ్ యూరిన్ టెస్టింగ్ కిట్ను ఉపయోగిస్తున్నాం. 45 రోజులైనా ఇది గంజాయి తీసుకున్న వారిని గుర్తిస్తుంది. అనుమానం వచ్చిన ప్రతీ వ్యక్తి యూరిన్ను పరీక్ష చేసి నిర్ధారణ అయితే కేసులు నమోదు చేస్తాం. గంజాయి నిర్మూలనకు ప్రతీ ఒక్క పౌరుడు సహకరించాలి” అని కోదాడ సీఐ శ్రీధర్ రెడ్డి చెప్పారు.
ఈనెల 26 నుండి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో “ఇంటింటి జ్వర సర్వే” నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మున్సిపల్ కమిషనర్లు, వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. “ఇంటింటి జ్వర సర్వే” లో భాగంగా తక్షణమే మెప్మా సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.