India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిప్పర్తి: అప్పుల బాధ తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మామిడాలలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మి(40) అప్పులు అధికం కావడంతో తీర్చలేక మనస్తాపానికి గురై ఈనెల 21న పురుగు మందు తాగింది. నల్లగొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కూతురు జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని రైతు బజార్ పక్కన ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ ను బుధవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పెడుతున్న రూ.5ల భోజనాన్ని పరిశీలించారు. భోజనం చేస్తున్న వారిని భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అన్నపూర్ణ క్యాంటీన్ పరిసరాలలో పూర్తి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
హైదరాబాద్లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRని మాజీ మంత్రి గుంత కండ్ల జగదీశ్ రెడ్డి కలిశారు. బుధవారం పుట్టినరోజు జరుపుకుంటున్న కేటీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువ కప్పి సన్మానం చేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం
ఇన్ ఫ్లో : నిల్
ఔట్ ఫ్లో: 8,714 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటిమట్టం: 590 అడుగులు
ప్రస్తుతం: 503.60 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.5050 టీఎంసీలు
ప్రస్తుతం: 121.0608 టీఎంసీలు
కుడి కాలువకు: 5,496 క్యూసెక్కులు
ఎడమ కాలువకు: 2,818 క్యూసెక్కులు
మాధవరెడ్డి ప్రాజెక్టుకు: 400 క్యూసెక్కులు
కార్గిల్ సిల్వర్ జూబ్లీ విజయ్ దివస్ను ఈ నెల 26న నల్గొండ పట్టణంలోని పానగల్ రోడ్డులో గల రీజనల్ సైనిక్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంది పాపిరెడ్డి, కొల్లోజు వెంకటాచారి ఓ ప్రకటనలో తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని మాజీ సైనికులు, అమరులైన, మరణించిన సైనికుల కుటుంబ సభ్యులు హాజరుకావాలని కోరారు.
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జియాలజీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా భూగర్భ జలాల మూలాలు సుస్థిరత, నిర్వహణపై విద్యార్థులకు ఈనెల 24 నుంచి 26 వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులందరు హజరు కావాలని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ శాస్త్రవేత్త విఠల్, జియాలజీ విభాధిపతి మధుసూదన్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో మొత్తం 2,810 మంది ఉన్నారు. ప్రతి ఇంటిలో ఇద్దరు నుంచి ముగ్గురికి పైనే జ్వరాలు బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరాల బారిన పడిన ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తూ అవసరమైన వారికి మందులు అందజేశారు.
మూసీ జలాశయం నీటిని ఈనెల 25 నుంచి ఆయకట్టుకు విడుదల చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33వేల ఎకరాల ఆయకట్టు భూములు సాగులోకి రానున్నాయి. వానకాలం సాగుకు నాలుగు విడతలుగా నీటిని విడుదల చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. వారాబంది పద్ధతిన మూసీ నీరు ఆయకట్టుకు విడుదల కానుంది. కాలువలకు నీరు విడుదల చేస్తున్నందున ఆయకట్టలోని చెరువు కుంటలు నిండనున్నాయి.
నల్గొండ అగ్నిమాపక శాఖ ADFO పురుగు మందు తాగి బలవన్మరణం చెందారు. ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. NLG పట్టణం అప్పాజీ పేటకు చెందిన రాజు(36) సోమవారం ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్యాభర్తల మధ్య కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
గరిడేపల్లి పోలీస్ స్టేషన్లోని ఓ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్కు గురయ్యారు. ఈనెల 6న బ్యాటరీల దొంగతనం కేసులో ఓ వ్యక్తిని పీఎస్లో విచారణకు తీసుకువచ్చారు. కాగా, నిందితుడు అదే రోజు రాత్రి గోడ దూకి పారిపోయాడు. 2 రోజుల తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకొని రిమాండ్కు తరలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.