Nalgonda

News April 1, 2024

ఫణిగిరిలో 2 వేల ఏళ్ల నాటి నాణేలు లభ్యం

image

సూర్యాపేట జిల్లాలో 2వేల సంవత్సరాల క్రితం నాటి నాణేలు బయటపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమలగిరి మండలం ఫణిగిరిలో బౌద్ధ కళా ఖండాలుగా చెప్పబడుతున్న 3700 సీసపు నాణేలు పురావస్తు శాస్త్రవేత్తలు ఆదివారం వెలికి తీశారు. తవ్వకాలలో అనేక పలకలు, వ్యాసాలు, శాసనాలు, నాణేలు, లిఖిత పూర్వక స్తంభాలు బయటపడ్డాయి. 2015లో కూడా ఫణిగిరిలో 2వేల ఏళ్లనాటి బౌద్ధ అవశేషాలను పురావస్తు శాఖ వారు కనుగొన్నారు.

News April 1, 2024

యాదాద్రి: రైల్వే ట్రాక్‌పై మృతదేహం

image

వలిగొండ మండలం టేకులసోమారం సమీపన రైల్వే ట్రాక్‌పై ఓ మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంటున్నారని రైల్వే ఎస్సై సాలకమ్మ తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2024

నల్గొండ: రూ.3లక్షల నగదు పట్టివేత

image

పెద్దవూర మండలంలో కొండమల్లేపల్లి వైపు నుంచి వచ్చిన వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు చెందిన తాతారావు రూ.1.50 లక్షలు, కృష్ణ జిల్లాకు చెందిన ఎర్రగడ్డ నవీన్ రూ.50వేలు, అనకాపల్లి జిల్లాకు చెందిన కొండల దుర్గారావు రూ.1లక్షల నగదుకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఎస్సై వీరబాబు తెలిపారు.

News April 1, 2024

సూర్యాపేట జిల్లాలో పోలీస్ యాక్ట్

image

సూర్యాపేట జిల్లాలో నేటి నుంచి 30 రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిదే ప్రజలు, ప్రజా ప్రతినిధులు రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని కోరారు. ఎన్నికల నిబంధనలకు అందరూ సహకరించాలని సూచించారు.

News April 1, 2024

42.4°డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!

image

భానుడి ప్రతాపంతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి భగభగలతో బెంబేలెత్తుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే క్రమేణా పెరుగుతున్నాయి. మూడు రోజులుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాడుగులపల్లి మండలంలో సండే రోజు అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 1, 2024

NLG: 1500 గ్రామాల్లో తాగునీటి సమస్య!

image

ఉమ్మడి జిల్లాలో దాదాపు 1500 గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడనున్నట్లు అధికారులు ముందస్తుగా గుర్తించారు. నల్గొండ జిల్లాలో 788, సూర్యాపేటలో 412, యాదాద్రి భువనగిరిలో 300 ఆవాసాల్లో తాగు నీటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ముందస్తు ప్రణాళికలో గుర్తించారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో తాగునీటి ఎద్దడి నివారణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

News April 1, 2024

మంత్రులు, ఎమ్మెల్యేకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు

image

లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్ఠానం ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌లు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. నల్లగొండ, భువనగిరి పార్లమెంటుకు ఏఐసీసీ తరఫున ఇన్‌ఛార్జిగా రోహిత్ చౌదరిని నియమించారు. నల్గొండకు ఇన్‌ఛార్జ్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా నియమించారు.

News April 1, 2024

నేడు సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల !

image

తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువకు ఈరోజు నీటిని విడుదల చేయనున్నారు. నల్లగొండ జిల్లాలోని పెద్దదేవులపల్లి, ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్లను నింపడానికి ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎన్ఎస్పీ అధికారులకు ఎస్సీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. కేవలం తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నట్టు సమాచారం.

News April 1, 2024

జిల్లాలో నెల రోజులపాటు పోలీసు యాక్ట్ అమలు: ఎస్పీ చందనా దీప్తి

image

నల్గొండ జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 1నుండి 30 వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవన్నారు.

News March 31, 2024

ఈతకు వెళ్లే వారి పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి:SP

image

నల్లగొండ: వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో చిన్న పిల్లలు, యువకులు ఈత సరదా కొరకు వెళ్లి ఈత రాకపోవడంతో ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలనీ, బావులు, చెరువులు, కాల్వల వద్ద ఈత చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పాఠశాలలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, పిల్లలు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్తుంటారని తెలిపారు.