Nalgonda

News July 23, 2024

బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం: మంత్రి ఉత్తమ్

image

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25 లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌ రాజకీయ ప్రేరేపితమైందని, ప్రజల కోసం కాకుండా బీజేపీ మిత్రపక్షాలు, జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే బడ్జెట్‌ను రూపొందించారని అన్నారు.

News July 23, 2024

జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించిన ఛైర్మన్

image

భువనగిరి పట్టణంలోని జిల్లా గ్రంథాలయాన్ని ఛైర్మన్ డా.రియాజ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయాలను నిరుద్యోగులు, విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సుధీర్, సిబ్బంది, శెట్టి బాలయ్య, అవేజ్ చిస్టీ, మజర్, అతహర్, సాయి కిరణ్ తదితరులు ఉన్నారు.

News July 23, 2024

శక్తి క్యాంటీన్లు.. వారికి రూ.20 లక్షల వరకు లోన్

image

గ్రామీణ మహిళల అభ్యున్నతే లక్ష్యంగా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. MLG RDO ఆఫీసు, DVK, NKL MPDO ఆఫీసు, NLG కలెక్టరేట్, RDO కార్యాలయాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేయించనున్నారు. ఆహార పదార్థాలను ఇళ్ల వద్ద తయారుచేసి క్యాంటీన్లకు తరలించడం, ఆర్డర్లపై పిండివంటలు, మిఠాయిలు, పచ్చళ్లను తయారుచేసి విక్రయిస్తారు. వ్యాపార దక్షత గల మహిళా సంఘాలకు రూ.10 నుంచి రూ.20 లక్షలు రుణంగా ఇవ్వనున్నారు.

News July 23, 2024

జిల్లాలో త్వరలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం

image

గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్దే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. మహిళా శక్తి పథకంలో భాగంగా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. మెరుగైన ప్రగతి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండి వ్యాపార నిర్వహణ సామర్థ్యం గల సంఘాలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ గుర్తిస్తుంది. మిర్యాలగూడ, నకిరేకల్, నల్గొండ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయంలో క్యాంటీన్ల ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తుంది.

News July 23, 2024

రోడ్డు ప్రమాదంలో CRPF కానిస్టేబుల్ మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కోదాడలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చింత రాజు( 23) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాలిలా.. కోదాడ సమీపంలోని కట్టుకోమ్ముగూడెం రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. చింత రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కోదాడ పోలీసులు మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News July 23, 2024

చిరుత గేదెలపై దాడి చేసింది: రైతు మోతీలాల్

image

నల్గొండ జిల్లాలో చిరుత కలకలం రేపింది. రెండు గేదెలపై చిరుత దాడి చేసి చంపిందని  డిండి మండలం కొత్త తండాకు చెందిన రైతు మోతీలాల్ చెప్పారు. మోతీలాల్ పొలం తండాకు ఆనుకుని ఉండడంతో చిరుత మళ్లీ వస్తుందేమో అని తండావాసులు భయపడుతున్నారు. అధికారులు చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. 

News July 23, 2024

NLG: కూరగాయల సాగు అంతంతే..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూరగాయల సాగు పెరుగుదల అంతంత మాత్రంగానే ఉన్నది. ఉమ్మడి జిల్లాలో 18 వేల ఎకరాల్లో కూరగాయలు పండించాల్సిన అవసరం ఉండగా.. కేవలం వందల ఎకరాల్లో మాత్రమే రైతులు కూరగాయలు పండిస్తున్నారు. జనాభాకు అనుగుణంగా సాగు లేకపోవడంతో 40 నుంచి 70 శాతం వరకు కూరగాయలు ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

News July 23, 2024

పూర్తయిన సాగర్ ప్రాజెక్టు స్పిల్ వే మరమ్మతు పనులు

image

కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వరద నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు జలాశయంలో నీటిని నింపేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. పదేళ్ల క్రితం సాగర్ డ్యాం స్పిల్ వే దెబ్బతినగా పలుమార్లు టెండర్లు పిలిచి చివరగా రూ.16కోట్లకు ఓ కంపెనీకి పనులు అప్పగించారు. గతేడాది నుంచి వర్షాలు లేకపోవడంతో స్పిల్ వే పనులు పూర్తి చేశారు.

News July 23, 2024

NLG: జిల్లాలోని చెరువుల సంగతేంటి?

image

నల్గొండ జిల్లాలో చెరువులు నింపకుండానే నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటిని ఖమ్మం జిల్లాకు తరలించడంపై ఈ జిల్లా రైతులు మండిపడుతున్నారు. రోజుకు 1000 క్యూసెక్కుల చొప్పున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. నల్గొండ జిల్లాలో చెరువులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని నింపకుండా ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తుండడంపై ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News July 23, 2024

NLG: రుణమాఫీ కోసమే భారీగా దరఖాస్తులు

image

కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి రెవెన్యూ, రుణమాఫీ సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. బాధితులు భారీగా తరలిరావడంతో కలెక్టరేట్ మీటింగ్ హాల్ తో పాటు బయట ఆవరణ అంతా జనంతో నిండిపోయింది. మొత్తం 96 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో భూసమస్యలకు సంబంధించి 53.. ఇతర అంశాలవి 43 ఫిర్యాదులు ఉన్నాయి. రుణమాఫీ కాలేదంటూ సుమారు వంద మంది రైతులు అర్జీలు అందజేశారు.