Nalgonda

News March 30, 2024

రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు కేసీఆర్

image

మాజీ సీఎం కేసీఆర్ రేపు తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ఎద్దడి కారణంగా ఎండిపోయిన పంటలను పరశీలించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని తుంగతుర్తి , హాలియా ప్రాంతాల్లో పర్యటిస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.

News March 30, 2024

మిర్యాలగూడ: వివాహిత సూసైడ్ 

image

వరకట్న వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారంలో జరిగింది. ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అయోధ్య కుమార్తె చందన(23)కు మిర్యాలగూడకు చెందిన ఆనందం వేణుతో 2021లో వివాహం జరిగింది. భర్త, అత్తమామలు అదనపు కట్నం తేవాలని వేధిస్తుండడంతో చందన సూసైడ్ చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

News March 30, 2024

NLG: సిబ్బంది నియామకంపై దృష్టి

image

లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు సిబ్బంది నియామకంపై దృష్టి సారించారు. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో సిబ్బంది పాత్రే కీలకం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. వాటికి ఆర్వోలుగా ఆయా జిల్లాల కలెక్టర్లు వ్యవహరించనున్నారు. వారి ఆధ్వర్యంలో సహాయ రిటర్నింగ్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు, పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించనున్నారు.

News March 30, 2024

NLG: వామ్మో సన్న బియ్యం.. కొనలేం తినలేం!

image

ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం ధరలు సామాన్యుడికి దడ పుట్టిస్తున్నాయి. బియ్యం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నా అధికారులు కట్టడి చేయకపోవడంపై జనం మండిపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధర కిలో రూ.70 వరకు విక్రయిస్తున్నారు. క్వింటా ధర రూ .7వేలు పలుకుతుంది. గతంలో దొడ్డు బియ్యం వాడకం ఎక్కువగా ఉండగా.. రాను రాను వినియోగం తగ్గిపోయింది. దీంతో సన్న బియ్యం ధరలు అమాంతం పెరిగాయి.

News March 30, 2024

NLG: రైతులకు రూ.304 కోట్ల నష్టం…!

image

జిల్లాలో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యాసంగిలో సాగు చేసిన వరిచేలు పొట్ట దశలో ఎండిపోతున్నాయి. యాసంగి సీజన్లో బోరుబావులపై ఆధారపడి జిల్లా వ్యాప్తంగా 4,20,561 ఎకరాల్లో రైతులు వరినాట్లు వేసుకున్నారు. నీటి ఎద్దడి కారణంగా సుమారు 15 శాతం మేర వరిచేలు ( 60 వేల ఎకరాల్లో పొలాలు) ఎండిపోయాయి. దీంతో రైతులకు రూ.304 కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News March 30, 2024

సూర్యాపేట: ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం: మంత్రి ఉత్తమ్

image

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ రాజకీయాల్లో నల్లగొండ పార్లమెంటుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

News March 29, 2024

NLG: పార్లమెంటు ఎన్నికల సన్నాక సమావేశం విజయవంతం చేయాలి

image

ఈనెల 30న నల్గొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం విజయవంతం చేయాలని మఠంపల్లి మండల నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మఠంపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో జరుగు నల్గొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News March 29, 2024

రౌడీ షీటర్లపై స్పెషల్ ఫోకస్: చందనా దీప్తి

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక వ్యక్తులు, రౌడీషీటర్లు, ట్రబుల్ మంగ్లర్స్ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు నల్గొండ ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అటు అక్రమ మద్యం, నగదు సరఫరా కాకుండా పటిష్ఠ నిఘాతో తనిఖీలు నిర్వహించాలని సూచించారు

News March 29, 2024

నల్గొండలో గెలిచి చరిత్ర సృష్టిస్తా.. బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి

image

నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నల్గొండలో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. బీజేపీ కాంగ్రెస్‌కు ఎప్పుడూ బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. బీజేపీలో అందరినీ కలుపుకొని పోయి పనిచేస్తా తప్పకుండా జిల్లాలో బీజేపీ జెండా ఎగరేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.

News March 29, 2024

NLG: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

image

ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడస్తున్నందుకు చాలా మంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారని జిల్లా ఎస్పీ చందనా దీప్తి అన్నారు. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల ఆర్థికంగా దెబ్బతిని సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. యువత క్రికెట్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ కోరారు.