India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లా పరిధిలోని ఆసరా ఫించన్ దారులకు మంగళవారం నుంచి ప్రభుత్వం ఫించన్లు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీవో పీడీ నాగిరెడ్డి తెలిపారు. స్థానిక తపాలశాఖ కార్యాలయాల్లో నేటి నుంచి ఈ నెల 29 వరకు ఫించన్లు పొందవచ్చని తెలియజేశారు. పంపిణీలో మధ్య దళారీల మాటలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల ఫలితాలను HYDలో యూనివర్సిటీ ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ నవీన్ మిట్టల్, రిజిస్ట్రార్ అల్వాల రవి, పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్ రెడ్డి, అడ్మిషన్ డైరెక్టర్ ఆకుల రవి విడుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలో 8,118 మంది విద్యార్థులకు గాను 3,493 మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు.
ప్రజావాణి కార్యక్రమనికి మొత్తం 80 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లతతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో భూ సమస్యలపై 38 దరఖాస్తులు, డిఆర్డిఓ 12, డియంహెచ్ఓ 8, ఇతర శాఖలకు సంబంధించి 22, మొత్తం 80 దరఖాస్తులు అందాయని తెలిపారు.
నకిరేకల్ మున్సిపాలిటీ ఛైర్మన్ రాచకొండ శ్రీనివాస్పై నల్గొండ కలెక్టర్కు 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్కి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి 12 మంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు నుంచి ఆరుగురు, కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీనీ కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
నార్కెట్పల్లి- చిట్యాల స్టేషన్ల మధ్య కిలోమీటర్ నం.55/13 వద్ద ట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. రైలు నుంచి పడి చనిపోయి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదైంది.
పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 70 మంది ఆర్జీలతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్తి వివరాలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నల్గొండ జిల్లాలో ఈనెల 29వ తేదీ వరకు ఆసరా పింఛన్లు (వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళ పెన్షన్లు) పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి తెలిపారు. పింఛను మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుంచి పొందాలని మధ్య దళారులను నమ్మొద్దని చెప్పారు.
అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్
సి.నారాయణరెడ్డి అన్నారు.
విధులలో సమయపాలన పాటించాలని, పనిలో నాణ్యత ఉండాలని అన్నారు. రెగ్యులర్ పనులతో పాటు, ప్రభుత్వ ప్రాధామ్య పథకాల అమలులో జాప్యం చేయవద్దని అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరారు.
జాతీయ రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. RRR నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా కంప్లీట్ చేసేందుకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.