Nalgonda

News March 29, 2024

తెలంగాణ కోసం తప్పా పార్టీని వ్యతిరేకించలేదు: మంత్రి కోమటిరెడ్డి

image

ఒక్క తెలంగాణ కోసం తప్ప పార్టీని ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టికెట్ల విషయంలో నేను కలుగజేసుకోను.. నేను పార్టీ కోసం పని చేస్తానన్నారు. మంత్రుల నివాస సముదాయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో వారు మాట్లాడారు. తన నియోజకవర్గం తన శాఖ తప్ప వేరేది పట్టించుకోవడంలేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు ఆయన చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని ఎద్దెవ చేశారు.

News March 29, 2024

సూర్యాపేట: మంత్రి కారును తనిఖీ చేసిన పోలీసులు

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ప్రకారం వాహనాల తనిఖీల్లో భాగంగా సూర్యాపేటలో కేంద్ర పోలీసు బలగాలు సూర్యాపేట పోలీసులు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కారును జాతీయ రహదారిపై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువులు పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఎన్నికల నియమాలు ప్రకారం ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. వాహనం తనిఖీ అనంతరం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తిరిగి ప్రయాణమయ్యారు.

News March 29, 2024

దేవరకొండ: వ్యక్తి ఖాతా నుండి ఏడు లక్షలు మాయం

image

బ్యాంక్ ఖాతా నుండి 7లక్షలు చోరీ జరిగిన ఘటన ముదిగొండ పంజాబ్ నేషనల్ బ్యాంకులో గురువారం జరిగింది. ముదిగొండ గ్రామానికి చెందిన మారుపాకల బాలయ్య అకౌంట్ నుండి 7లక్షలు డెబిట్ అయినట్టు మెసేజ్ రావడంతో బ్యాంకు వారిని సంప్రదిస్తే ఆన్‌లైన్ ఫ్రాడ్ జరిగిందని, పూర్తి వివరాలు చెప్పడం లేదన్నారు. 20 రోజుల క్రితం మరో వ్యక్తి అకౌంట్‌ నుండి రూ.70వేలు డ్రా అయ్యాయని, బ్యాంక్ అధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

News March 29, 2024

NLG: పార్లమెంట్ ఎన్నికల్లో ఇక హోరాహోరీగా పోరు!

image

ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశారు. గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ప్రారంభించాలని ఆయా పార్టీల అభ్యర్థులు వ్యూహాలు పన్నుతున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో గ్రామాలు, మండలాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ప్రచారాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది.

News March 29, 2024

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు: ఎస్పీ రాహుల్ హెగ్డే

image

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని విద్వేషకర పోస్టులు పెట్టే వారి సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

News March 29, 2024

జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు అమూల్య

image

బిహార్ రాష్ట్రం పాట్నాలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్న 33వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు సూర్యాపేట జిల్లా నుంచి చింతరాల అమూల్య రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్టు కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అమూల్య ఎంపికకు సహకరించిన అంతర్జాతీయ క్రీడాకారుడు మహేందర్ రెడ్డికి, జై హనుమాన్ స్పోర్ట్స్ క్లబ్ సీనియర్ కబడ్డీ క్రీడాకారులకు ధన్యవాదాలు తెలియజేశారు.

News March 29, 2024

హత్య కేసులో నిందితుడికి రిమాండ్

image

ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి హత్య చేసిన నిందితుడిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నాంపల్లి సీఐ నవీన్ కుమార్, ఎస్సై యాదయ్య తెలిపారు. మండలంలోని తీదేడులో ఈ 23న అలకుంట్ల రాజుతో ఎల్లయ్య గ్రామ శివారులోని గొడవ పడ్డారు. తిరిగి అదే రాత్రి గ్రామంలో గొడవ జరిగిన విషయమై ఇరువురు మాట్లాడుతుండగా మాటామాట పెరిగింది. కోపోద్రిక్తుడైన ఎల్లయ్య కర్రతో రాజుపై దాడి చేయడంతో మృతి చెందాడు.

News March 29, 2024

యాదాద్రి: ఉరి వేసుకుని యువకుడి సూసైడ్ 

image

వ్యక్తిగత కారణాలతో ఓ యువకుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన బీబీనగర్లో చోటుచేసుకుంది. పోచంపల్లి మండలం పిల్లాయిపల్లికి చెందిన నరసింహ అనే యువకుడు బీబీనగర్లో ఓ వెంచర్లో విద్యుత్ స్తంభానికి ఉరి వేసుకుని మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.

News March 29, 2024

నల్గొండ: సిట్టింగ్‌ స్థానాలను నిలబెట్టుకోవాలని..

image

నల్గొండ, భువనగిరి లోక్ సభ స్థానాలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు స్థానాలను గత ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఉత్తమ్ నల్గొండ నుంచి , కోమటిరెడ్డి భువనగిరి నుంచి ఎంపీలుగా గెలిచారు. ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ గెలుపుకోసం ఆరాటపడుతున్నాయి.

News March 29, 2024

NLG: కూలి రేట్లు పెరిగినా.. కూలీలు అసంతృప్తి!

image

ఉపాధి కూలీలకు కేంద్రం దినసరి కూలిని పెంచింది. పెంచిన కూలిని APR 1 నుంచే చెల్లించనున్నారు. గతేడాది APR 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు రూ. 272గా చెల్లిస్తుండగా.. తాజాగా మరో రూ.28 పెంచింది. దీంతో రూ. 300లకు చేరింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 4 లక్షల జాబ్కార్డుల కూలీలకు లబ్ధి కలగనుంది. వ్యవసాయేతర పనులకు వెళితే రూ.500 వరకు చెల్లిస్తుండడంతో.. కూలి రేట్లు పెరిగినా కూలీలు అసంతృప్తితోనే ఉన్నారు.