Nalgonda

News July 22, 2024

మూసి పర్యాటక కేంద్రంగా గుర్తించాలని పాదయాత్ర

image

నల్గొండ: కేతపల్లి మండలం బొప్పారం గ్రామం నుంచి కేతేపల్లి వరకు మూసి సుందరీకరణ, పర్యాటక కేంద్రంగా గుర్తించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

News July 22, 2024

NLG: రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి

image

ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జూన్ 28, 2024 నాటికి భూమి పట్టా పొందిన రైతులంతా అర్హులని పేర్కొన్నారు. నామిని మరణించిన, పేరు మార్పు, ఇతర సవరణలు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 22, 2024

కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

image

కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. గుడిపల్లి పోలీసుల వివరాల ప్రకారం.. తిర్మలగిరిసాగర్ మండలం అల్వాల వాసి కొండల్(19), అజయ్ కలిసి బైక్‌పై వెళ్తూ మిర్యాలగూడకు వెళ్తున్న RTC బస్సును ఢీకొట్టారు. ప్రమాదంలో కొండల్ అక్కడికక్కడే మృతి చెందగా, గాయాలైన అజయ్‌ను మెరుగైన చికిత్స కోసం HYD తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు SI నర్సింహులు తెలిపారు.

News July 22, 2024

NLG: రేబిస్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రణాళిక

image

ఉమ్మడి జిల్లాను రేబిస్ రహిత జిల్లాగా మార్చేందుకు పశు సంవర్ధక, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ప్రణాళిక సిద్ధం చేశాయి. ఉమ్మడి జిల్లాలో 1.10 లక్షలకు పైగా వీధి కుక్కలు, పదివేలకు పైగా పెంపుడు కుక్కలు ఉన్నాయి. రేబిస్ నివారణకు అవసరమైన డయాగ్నస్టిక్ ల్యాబ్లను ఏర్పాటు చేనున్నట్లు తెలిసింది. ఈ ల్యాబ్‌ల్లో యాంటీ రేబిస్ ఎలిమినేషన్‌పై పరీక్షలు నిర్వహిస్తారు.

News July 22, 2024

చౌటుప్పల్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు

image

చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురంలో శ్రీ ఆంధోల్‌ మైసమ్మ బోనాల ఉత్సవాలను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో దేవాలయ ఈఓ ఎస్‌.మోహన్‌బాబు బోనం సమర్పించారు. చండీహోమం నిర్వహించారు. అనంతరం వేలాదిగా తరలొచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదానాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రారంభించారు.

News July 22, 2024

అర్హులైన రైతులందరితో బీమా చేయించాలి : కలెక్టర్

image

జిల్లాలోని అర్హులైన రైతులందరితో రైతు బీమా చేయించాలని, నెలాఖరు వరకురైతు బీమా రెన్యువల్స్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం నుండి ప్రజాపాలన సేవా కేంద్రాలను అన్ని ఎంపిడిఓ కార్యాలయాలు, మున్సిపాలిటీలలో పకడ్బందీగా పనిచేసేలా చూడాలని ఎంపీడీవోలను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.

News July 21, 2024

NLG: అంగన్వాడీల అప్ గ్రేడ్..! ఇక ప్రీ స్కూల్ విద్య

image

అంగన్వాడీలను చిన్నారులకు మరింత చేరువ చేసేందుకు సర్కార్ నడుం బిగించింది. అందులో భాగంగా ఈ కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా అప్ గ్రేడ్ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇది అమలు అయితే ఈ సెంటర్లు ఇకపై ప్రైవేట్ ప్లే స్కూల్స్ కు దీటుగా ప్రీ స్కూల్ విద్యను అందించనున్నాయి. సీఎం నిర్ణయంతో ఇన్ని రోజులు పౌష్టికాహారాన్ని మాత్రమే అందించిన ఈ కేంద్రాలు ఇకపై పిల్లలకు మూడో తరగతి వరకు ప్రాథమిక విద్యను అందించనున్నాయి.

News July 21, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైరల్ ఫియర్

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యాధులు ముసుకురుకుంటున్నాయి. కురుస్తున్న వర్షాలతో పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీలు, వీధుల్లో మురుగు పేరుకుపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమలతో సీజనల్‌ వ్యాధులు ప్రబలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఎక్కడ చూసినా ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. జ్వరాల బారిన పడి ప్రజలు ఆసుపత్రులపాలవుతున్నారు.

News July 21, 2024

మార్చి నాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి: కోమటిరెడ్డి

image

వచ్చే మార్చినాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నార్కట్పల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న SLBC సొరంగం పనుల పూర్తికి రాష్ట్ర సీఎంతో మాట్లాడి రూ.2200 కోట్లు మంజూరు చేయించడమే కాకుండా, నిధుల విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ లో నిధులు ఏర్పాటు చేశామని తెలిపారు.

News July 21, 2024

అమ్మ బత్తాయో..! నిండా మునిగిన రైతులు

image

నల్లగొండ జిల్లాలో 68 మంది బత్తాయి రైతులు నిండా మునిగారు. తిరుపతి ఉద్యాన యూనివర్సిటీ నుంచి 11 ఏళ్ల క్రితం బత్తాయి మొక్కలు తీసుకువచ్చి జిల్లాలో నాటిన రైతులు దిగుబడి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సుమారు 350 ఎకరాల్లో ఈ బత్తాయి మొక్కలు నాటారు. సాధారణంగా నాలుగో ఏటా నుంచి దిగుబడి ప్రారంభమవుతుందని 8 ఏళ్లు గడిచినా సాధారణ దిగుబడి కూడా రాలేదని రైతులు తెలిపారు.