Nalgonda

News March 29, 2024

NLG: టెట్‌పై గురి.. అర్హత సాధించేందుకు..

image

ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష పై యువత గురి పెట్టింది. ఉమ్మడి జిల్లాలోని డీఎడ్, బీఎడ్ అభ్యసించి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణత సాధించేందుకు వేలాదిమంది నిరుద్యోగులు ప్రయత్నిస్తున్నారు. గత సెప్టెంబర్లో నిర్వహించిన టెట్ పరీక్షకు మొత్తం 43,681 మంది దరఖాస్తు చేసుకోగా.. 36, l919 మంది హాజరయ్యారు. అందులో పేపర్-1 కు 18,174 మంది, పేపర్-2కు 18,745 మంది టెట్ పరీక్ష రాశారు.

News March 29, 2024

నల్గొండ: అభ్యర్థులు ఖరారు.. ప్రచారంలో బిజీ

image

నల్గొండ, భువనగిరి లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేశాయి. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా రఘువీర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశ్, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్ బరిలో ఉన్నారు. వీరంతా ప్రచారంలో నిమగ్నం కానున్నారు.

News March 29, 2024

‘CMR చెల్లింపు లక్ష్యాన్ని ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలి’

image

2023- 24 వానకాలం కష్టం మిల్లింగ్ రైస్ చెల్లింపు లక్ష్యాన్ని ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ హరిచందన రైస్ మిల్లర్లను కోరారు. గురువారం ఆమె మిర్యాలగూడ రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 2023- 24 వానాకాలానికి సంబంధించిన సీఎంఆర్ ప్రతిరోజు 4000 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా, మిల్లర్లు 50 శాతం మాత్రమే చెల్లిస్తున్నారని అన్నారు.

News March 28, 2024

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డ్రగ్స్ వ్యాపారంలో కూరుకుపోయారు: గాదరి కిషోర్

image

NLG: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీలను బొంద పెడతామని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. ఈరోజు నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి డ్రగ్స్ వ్యాపారంలో కూరుకుపోయారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపొద్దని యువతను కోరారు. ఢిల్లీలో గొంతుక వినబడాలంటే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

News March 28, 2024

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు:SP

image

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫొటోలు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.

News March 28, 2024

తోలిసారి కోమటిరెడ్డి కుటుంబం కాకుండా..

image

కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీ అభ్యర్థిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రకటించింది. 2009లో భువనగిరి నుంచి కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి పోటీ చేసి CPMఅభ్యర్థి నోముల నర్సింహయ్యపై గెలుపొందారు. 2014లో TRS అభ్యర్థి బూర నర్సయ్యపై ఓడిపోయారు. 2019లో వెంకట్‌రెడ్డి నర్సయ్యపై గెలుపొందారు. ఈ నియోజకవర్గానికి నాలుగోసారి ఎన్నికలు జరుగుతుండగా.. కోమటిరెడ్డి కుటుంబం కాకుండా వేరే వ్యక్తి పోటీ చేస్తుండటం గమనార్హం.

News March 28, 2024

ఆత్మకూరు: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆత్మకూరు మండలంలోని పారుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పట్టూరి శివ కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉంటున్నాడు. బుధవారం ఉదయం పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో ఉండటంతో చికిత్స నిమిత్తం HYD కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News March 28, 2024

భువనగిరి: ఎంపీ అభ్యర్థి చామల రాజకీయ నేపథ్యం ఇదే

image

భువనగిరి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వగ్రామం శాలిగౌరారం. యూత్ కాంగ్రెస్ రాజకీయాలతో రాజకీయ అరంగ్రేటం చేశారు. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 2007లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ కోటరీలో కీలకంగా వ్యవహరించారు. తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు.

News March 28, 2024

చౌటుప్పల్: లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి రిమాండ్

image

చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివ దండు మల్కాపురంలోని ఓ కంపెనీలో పని చేస్తుంటారు. ఈనెల 25న రెండున్నరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుధవారం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ నిమిత్తం నల్గొండ జైలుకు తరలించారు.

News March 28, 2024

NLG: మాస్టర్ ప్లాన్.. ఎక్కడి వేసిన గొంగడి అక్కడే!

image

NLG మున్సిపాలిటీలో 40 ఏళ్ల కిందటి మాస్టర్ ప్లాన్ అమల్లో ఉంది. పాత మాస్టర్ ప్లాన్ వల్ల మున్సిపాలిటీ ఆదాయాన్ని భారీగా కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ కోసం చేస్తున్న కసరత్తు ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రావడం లేదు. పాలకవర్గాలు, ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నారే గాని మాస్టర్ ప్లాన్ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.