Nalgonda

News March 28, 2024

జిల్లాలో నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

image

జిల్లాలో నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నల్లగొండలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు సూచించారు.

News March 27, 2024

NLG: మార్చిలోనే మండుతున్న ఎండ!

image

వేసవి భగభగలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఉదయం 7 నుంచి మొదలవుతున్న వేడి సెగలు రాత్రి ఏడు వరకు తగ్గడం లేదు. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడం కలవరపరుస్తోంది. ఉమ్మడి జిల్లాలో గత ఐదు రోజుల నుంచి ఉష్ణోగ్రత తీవ్రత పెరిగింది. మరో అయిదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఆందోళన కలిగించే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

News March 27, 2024

మిర్యాలగూడ : హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు..?

image

మిర్యాలగూడ పట్టణంలో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు చేసినట్లు తెలుస్తోంది. మూడు ఇళ్లపై బుధవారం పోలీసులు దాడి చేసి పదిమంది మహిళలతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసులు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో అనుమానాస్పద ఇండ్లలో తనిఖీలు చేసి 11 మందిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. దీని వెనుక ఉన్న సూత్ర, పాత్రధారులు ఎవరు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది.

News March 27, 2024

‘సూర్యాపేట’ ఇక కనుమరుగేనా..?

image

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం తెర మీదకు వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల కుదింపులో సూర్యాపేట జిల్లా తొలగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

News March 27, 2024

లైసెన్సు కలిగిన ఆయుధాలు వెంటనే డిపాజిట్ చేయాలి: ఎస్పీ 

image

పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాలో లైసెన్సు కలిగిన ఆయుధాలు వెంటనే డిపాజిట్ చేయాలి జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఎన్నికల కోడ్ విడుదలైన నేపథ్యంలో నల్లగొండ జిల్లా పరిధిలోని మొత్తం 136 ఆయుధాలు లైసెన్స్ లు కలిగి ఉన్నాయని, వాటిని వెంటనే సమీప పోలీసు స్టేషన్‌లో లేదా జిల్లా పోలీసు కార్యాలయంలో డిపాజిట్‌ చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీచేశారు.

News March 27, 2024

మోత్కూరు ఎంపీడీవో కార్యాలయంపై ఏసీబీ దాడి

image

మోత్కూరు మండలం పొడిచేడు గ్రామ సెక్రటరీ కిరణ్ ఏసీబీ వలలో బుధవారం చిక్కాడు. మోత్కూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేయగా ఇంటి అనుమతి కోసం రూ.3వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇంటి అనుమతి కోసం బాధితుడు ఇదివరకే రూ.5వేలు ఇవ్వగా మళ్లీ అదనంగా డబ్బులు డిమాండ్ చేయడంతో రూ.3వేలు లంచం తీసుకుంటూ దొరికాడు.

News March 27, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాకు గుడ్ న్యూస్.. ప్రత్యేక నిధులు వచ్చాయ్!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి ఎద్దడి నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. NLG జిల్లాకు రూ. 4.5 కోట్లు, SRPTకు రూ. 2.70 కోట్లు, యాదాద్రి జిల్లాకు రూ.1.82 కోట్లు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక అభివృద్ధి నిధులు నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున 12 నియోజకవర్గాలకు రూ.120 కోట్లు గత నెలలో మంజూరు చేశారు. వాటిలో నియోజకవర్గానికి రూ. కోటి చొప్పున తాగు నీటికి ఖర్చు చేయనున్నారు.

News March 27, 2024

సూర్యాపేట: BRSను TRSగా మార్చండి.. KTRకు EX.MLA రిక్వస్ట్..

image

బీఆర్ఎస్ పేరును తిరిగి TRSగా మార్చాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా తాజాగా పోస్ట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్యవాదుల దాడిని అరికట్టాలన్నా, ప్రాంతీయతత్వం బతకాలన్నా.. బీఆర్ఎస్ పేరు నుంచి టీఆర్ఎస్‌గా మారాల్సిన అవసరం చాలా ఉందంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.

News March 27, 2024

పాముకాటుతో పదో తరగతి విద్యార్థి మృతి

image

తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ముక్కెర్ల మమత, కుమార్ ల కుమారుడైన ముక్కర్ల ఉమేష్ ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజామున 4.30 గం.లకు కట్లపాము కాటు వేయడంతో భువనగిరి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

News March 27, 2024

NLG: అంగన్ వాడి టీచర్లపై పెరిగిన పని భారం

image

ఉమ్మడి జిల్లాలో అంగన్వాడీ టీచర్లపై పని భారం పెరిగింది. ఇప్పటికే అంగన్‌వాడీ సేవలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్‌లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేస్తుండగా.. తాజాగా అంగన్వాడి టీచర్లకే NHTS కుటుంబ సర్వే కూడా అప్పగించారు. స్మార్ట్ ఫోన్లలో ర్యాం, స్టోరేజీ తక్కువగా ఉండడంతో సతాయిస్తున్నాయి. గ్రామాలలో నెట్ సేవలు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆన్లైన్ కుటుంబ సర్వేకు ఆటంకం కలుగుతుంది.