Nalgonda

News July 20, 2024

చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

చిట్యాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో పట్టణానికి చెందిన మహిళ సంగిశెట్టి సుగుణమ్మ (69) మృతి చెందారు. బంధువుల వివరాలిలా.. సుగుణమ్మ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. భుజం వరకు చేయి నుజ్జునుజ్జు కావడంతోపాటు, తలకు బలమైన గాయాలయ్యాయి. కామినేని ఆసుపత్రికి తరలించగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మృతి చెందింది.

News July 20, 2024

NLG: DCCB పరిధిలో సగం మందికే రుణమాఫీ!

image

ఉమ్మడి జిల్లాలోని 111 PACSలలో సభ్యులుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న రైతుల్లో అందరికీ రూ.లక్షలోపు రుణమాఫీ కాలేదు. శుక్రవారం నాటికి డీసీసీబీ నుంచి అందిన సమాచారం ప్రకారం రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారిలో సగం మంది రుణాలే మాఫీ అయ్యాయి. ఆ జాబితా మాత్రమే డీసీసీబీకి అందినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో డిసిసిబి పరిధిలో 72,513 మంది లక్ష లోపు రుణాలు తీసుకున్నారు.

News July 20, 2024

నల్గొండ: ట్రాక్టర్ బోల్తా, డ్రైవర్ మృతి

image

పొలం దున్నుతుండగా ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో డ్రైవర్ మృతి చెందిన ఘటన నార్కట్ పల్లి మండలం పల్లెపహాడ్‌లో జరిగింది. ఎస్సై అంతిరెడ్డి వివరాలిలా.. పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా పడింది.  డ్రైవర్ మంటిపల్లి నర్శింహా బురదలో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక మృతిచెందాడు. మృతుడి భార్య యాదమ్మ ఫిర్యాదుతో కేసు నమోదైంది. 

News July 20, 2024

NLG: మెడికల్ కళాశాలలో పెద్ద ఎత్తున బదిలీలు

image

ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న NLG మెడికల్ కళాశాలలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ రాజకుమారి గాంధీ మెడికల్ కళాశాలకు, GGH సూపరింటెండెంట్ డాక్టర్ నిత్యానంద నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. మెడికల్ కళాశాలలో ఐదేళ్లుగా పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పలువురు హెచ్వోడీలు 40 మందికి పైగా బదిలీ అయినట్లు తెలుస్తుంది.

News July 20, 2024

రైతు రుణమాఫీ.. నల్గొండ SP కీలక సూచన

image

రుణమాఫీకి సంబంధించి ఫోన్‌కు ఏమైనా లింకులు వస్తే ఓపెన్ చేయొద్దని ఎస్పీ శరత్ చంద్ర పవార్ రైతులకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని చెప్పారు. సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు. రుణమాఫీ వేళ  సైబర్ నేరగాళ్లు రైతుల ఖాతాల్లో ఉన్న డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తారని, ఆధార్ కార్డు, ఓటీపీ వివరాలు చెప్పవద్దన్నారు.

News July 20, 2024

నల్గొండ: సమగ్ర సర్వేకు సిద్ధం!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏళ్లుగా రెవెన్యూ, అటవీశాఖల మధ్య భూ సరిహద్దుల్లో స్పష్టత లేకపోవడంతో దాదాపు 55 వేల ఎకరాల్లో రెండు శాఖల మధ్య ప్రస్తుతం హద్దుల వివాదం కొనసాగుతోంది. కృష్ణపట్టి ప్రాంతాలైన మఠంపల్లి, మేళ్లచెర్వు, పాలకవీడు, చింతపలపాలెం, దామెరచర్ల, పీఏపల్లి, చందంపేట, పెద్దవూరు హద్దుల తగాదా ఉంది. HYD సరిహద్దుల్లోనూ ఇదే సమస్య ఉంది. దీంతో సమగ్ర సర్వేకు అధికారులు సిద్ధమవుతున్నారు.

News July 20, 2024

ప్రతి కేసుపై పారదర్శక విచారణ: ఎస్పీ

image

ప్రతీ కేసుపై పారదర్శకంగా విచారణ చేపట్టి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసులను పరిశీలించారు. ఆయా కేసులకు సంబంధించి అధికారులు సేకరిస్తున్న ఆధారాలను పరిశీలించారు. సమవేశంలో అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి ఉన్నారు.

News July 19, 2024

SRPT: ‘సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. కలెక్టరేట్లో మెడికల్ ఆఫీసర్లకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రతి మెడికల్ ఆఫీసర్ ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో సిజేరియన్ సెక్షన్లు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని, అనుమతులను రద్దు చేస్తామని అన్నారు.

News July 19, 2024

నల్గొండ: కూల్ డ్రింక్ ఇచ్చి.. మహిళ మెడలో బంగారం చోరీ

image

మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లిన ఘటన పీఏ పల్లి మండల పరిధిలోని మల్లాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన గన్నేబోయిన ముత్యాలమ్మ గ్రామ శివారులో పంట పొలంలో పనిచేస్తుంది. అక్కడికి బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి తెలిసిన వ్యక్తిలా పరిచయం చేసుకుని కూల్ డ్రింక్ తాగమని ఇచ్చాడు. డ్రింక్ తాగుతుండగా రాయితో ఆమె తలపై కొట్టి బంగారం లాక్కెళ్లినట్లు SI నర్సింహులు తెలిపారు.

News July 19, 2024

మునగాల: విధుల పట్ల నిర్లక్ష్యం తగదు : కలెక్టర్‌

image

మునగాల పి.హెచ్. సి. ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తనిఖీ చేసారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ మునగాల పి.హెచ్.సి.కి వెళ్లగా ఆ సమయానికి మెడికల్ అఫీసర్, సిబ్బంది లేకపోవటం వల్ల కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్‌ని, మెడికల్ స్టోర్‌ని పరిశీలించారు. అలాగే పి.హెచ్.సి.ని పరిశీలించగా పరిశుభ్రంగా లేకపోవటం పట్ల సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు.