India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భువనగిరిలోని బాలసదన్లో <<14412798>>అనాథ <<>>బాలికపై వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తెలిసిందే. పట్టణ ఇన్స్పెక్టర్ సురేశ్ వివరాల ప్రకారం.. ఈనెల 14న బాలసదన్లో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈక్రమంలో బాత్రూంకి వెళ్లి వస్తున్న బాలికను న్యాయసేవాధికార సంస్థ అటెండర్ లైంగికంగా వేధించాడు. కాగా, ఈఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి 14రోజుల రిమాండ్ విధించారు.

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడంపై ఆలయ ఈఓ భాస్కర్ రావు స్పందించారు. ఆలయం వద్ద భక్తుల మనోభావాలు, భక్తుల విశ్వాసం దెబ్బతినే విధంగా వ్యక్తిగత ఫొటో, వీడియో చిత్రీకరణ చేయవద్దు అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఒక ఎమ్మెల్యేగా ఆలయ దర్శనం, తగిన గౌరవం ఇస్తామని తెలిపారు. అందరి మాదిరిగా ఆలయం బయట మాత్రమే ఫొటోలు దిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా జరుగుతున్నట్లు లబ్ధిదారులు తెలిపారు. దీర్ఘకాలిక, అపరిష్కృత సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఎంతో ఆశగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుదారులకు అధికారుల నుంచే చుక్కెదురవుతున్నది. జిల్లాలో కొన్ని మండలాల్లో ఈ కార్యక్రమం నామమాత్రానికే పరిమితమైంది. గత కొన్ని నెలలుగా ఫిర్యాదుదారులు ఎవరు దరఖాస్తులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.

భువనగిరిలోని బాలసదన్లో అనాథ బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఈనెల 14న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత అధికారులు ఫిర్యాదు రావడంతో పట్టణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అనాథలకు రక్షణ కల్పించాల్సిన మహిళా శిశు సంక్షేమ శాఖలోనే రక్షణ లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

దామరచర్ల మండల పరిధిలోని ఓ తండాకు చెందిన బాలిక (14) సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. RCO అగస్టీన్ వివరాలిలా.. MLGలో TG TWURJC [G] పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన బాలిక తిరిగి ఈనెల 18న తండ్రితో కలిసి పాఠశాలకు వచ్చింది. తాను ఇంటి వద్ద పురుగుల మందు తాగి వచ్చానని తోటి విద్యార్థులకు చెప్పగా.. NLG ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది

NLG జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అధ్యయనం నిమిత్తం సివిల్ సర్వీసెస్ ప్రొబెషనరీ అధికారుల బృందం జిల్లాలో వారం రోజులపాటు పర్యటించనున్నట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. సివిల్ సర్వీసెస్ ప్రొబేషనరీ అధికారుల బృందం జిల్లా పర్యటనకు అవసరమైన ఏర్పాట్లపై ఆదివారం ఆయన సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 21 నుండి 28 వరకు 8 రోజులపాటు పర్యటించనున్నారు.

నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుర్రంపోడు మండలం మొసంగి గ్రామంలో వెంకటయ్య జ్యోతి దంపతులు పురుగు మందు తాగారు. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా వెంకటయ్య మృతి చెందాడు. జ్యోతి పరిస్థతి విషమంగా ఉంది. వీరు రెండు రోజుల క్రితమే కుమార్తె వివాహం జరిపారు. ఇంతలోనే దంపతులు పురుగు మందు తాగడంతో పెళ్లింట విషాదం నెలకొంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు 18 క్రస్ట్ గేట్ల ద్వారా ఆదివారం నీటిని విడుదల చేశారు. రెండు రోజుల నుంచి అక్కడక్కడ కురుస్తున్న వర్షాల వల్ల నీరు అధికంగా కావడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరును వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతోందన్నారు.

కుల గణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. 2, 3 నెలల్లో పంచాయతీ పోరు జరగనుండగా పల్లెల్లో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. గతంలో ఓడినవారు, కొత్తగా పోటీ చేయాలనుకునే వారు, గతంలో గెలిచిన వారు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే మరోసారి సర్పంచ్ కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్ పదవినైనా దక్కించుకోవాలని కొందరు పావులు కదుపుతున్నారు.

పిడిగుపాటుకు మహిళ మృతి చెందిన ఘటన అడవిదేవులపల్లి మండలం మొల్కచర్లలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. బాలాజీ తండాకు చెందిన జటావత్ నాగమణి పొలంలో కలుపు తీస్తోంది. ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. అందరూ ఇంటికి వెళుతుండగా బాల్నేపల్లి సబ్ స్టేషన్ దగ్గరకు రాగానే ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో నాగమణి అక్కడికక్కడే చనిపోయింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.