Nalgonda

News March 26, 2024

నల్గొండ: ఉపాధి హామీ కూలీలకు తీపి కబురు

image

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం అందిస్తున్న దినసరి కూలీని పెంచుతున్నట్లు పేర్కొంది. దీంతో ఉమ్మడి జిల్లాలో 7.52 లక్షల కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. 2005లో కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రారంభించిన సమయంలో దినసరి కూలీ రూ.87.50 ఉండగా.. ప్రస్తుతం రూ.272 చెల్లిస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త కూలీ అమల్లోకి రానుంది.

News March 26, 2024

NLG: ఏడాది గడిచినా ఊసే లేదు!

image

ఉమ్మడి జిల్లాలోని గొల్ల కురుమలు గొర్రెల యూనిట్ల విషయంలో ఆందోళనలో పడ్డారు. యూనిట్ల కోసం డీడీల రూపంలో డబ్బులు చెల్లించి ఏడాది గడిచినా ఇంతవరకు అతీగతీ లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి డబ్బులు చెల్లించామని, కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలలు దాటిపోయినా గొర్రెలు ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తాము చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కాపరులు కోరుతున్నారు.

News March 26, 2024

ప్రభుత్వ పాఠశాలలకు రూ.91 లక్షలు మంజూరు

image

నల్గొండ జిల్లాలో 1,483 ప్రభుత్వ పాఠశాలలతో పాటు మోడల్, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటికి ఏటా స్కూల్ మెయిన్టెనెన్స్ కింద (చాక్పీసులు, డస్టర్లు , స్టేషనరీ, ఇతర వస్తువుల కొనుగోలు కోసం) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు మంజూరు చేస్తుంది. రెండేళ్లుగా ప్రభుత్వం జూలై, జనవరి నెలల్లో రెండు విడతల్లో ఈ నిధులు ఇస్తుంది. మూడు రోజుల క్రితం జిల్లాకు రూ.91 లక్షలు మంజూరు చేసింది.

News March 26, 2024

సూర్యాపేట మీదుగా రైలు మార్గం

image

డోర్నకల్ నుంచి గద్వాల్ వరకు కొత్త రైల్వే మార్గానికి సూర్యాపేట జిల్లా మోతే మండలంలో సర్వే జరుగుతోంది. మండలంలోని కొత్తగూడెం, తుమ్మలపల్లిలో సర్వే బృందం మార్కింగ్ చేస్తున్నారు. సుమారు 296 కిలోమీటర్ల ఈ రైలు మార్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోతే, చివ్వెంల, సూర్యాపేట, కేతేపల్లి, తిప్పర్తి, నల్గొండ, కనగల్, చండూరు, నాంపల్లి, చింతపల్లి మండలాల్లోని గ్రామాల నుంచి వెళ్లనుంది.

News March 26, 2024

నల్గొండ: ఫస్ట్ నుంచి కొనుగోళ్లు షురూ

image

ఉమ్మడి జిల్లాల్లో ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగాలు సన్నద్ధమవుతున్నాయి. రైతులు ధాన్యం తీసుకువస్తే రెండు, మూడు రోజులు ముందుగానే కేంద్రాలు తెరవడానికి సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోళ్లపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేసింది.

News March 25, 2024

సూర్యాపేట: వాహన తనిఖీలు.. బంగారం పట్టివేత

image

ఎన్నికల నేపథ్యంలో సోమవారం సూర్యాపేటలో పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న షేక్ నాగుల్ మీరా కారులో 56 గ్రాముల బంగారం, 5 కేజీల వెండి నగదును స్వాధీనం చేసుకొని FST అధికారులకు అందజేశామని రూరల్ ఎస్సై బాలు నాయక్ సోమవారం తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలని ఎస్సై సూచించారు

News March 25, 2024

NLG: రాచకొండ పై రేకెత్తుతున్న ఆశలు!

image

ఘనమైన చరిత్ర కలిగి, రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న రాచకొండ ప్రాంత అభివృద్ధికి అడుగులు పడడం లేదు. ఫిలిం సిటీ, స్పోర్ట్స్ సిటీ, నెమళ్ల పార్కు, రోప్వే వంటివి ఏర్పాటు చేసి రాచకొండకు పూర్వ వైభవం తీసుకొస్తామని నాటి ప్రభుత్వం హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. రాచకొండను HYD, SEC, సైబరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఇటీవల CM రేవంత్ రెడ్డి ప్రకటించడంతో మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయి.

News March 25, 2024

క్రేన్ ఢీ.. వ్యక్తి శరీర భాగాలు నుజ్జు నుజ్జు 

image

హుజూర్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని క్రేన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి శరీర భాగాలు నుజ్జు నుజ్జు కాగా హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

News March 25, 2024

నిడమనూరు: హోలీ వేడుకలకు దూరం

image

నిడమనూరు మండల పరిధిలోని ముప్పారం గ్రామంలో ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా ఉండటం ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తోంది. రోజంతా శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తారు. దీంతో ఆ గ్రామస్థులు హోలీ వేడుకలకు దూరంగా ఉంటారు. స్వామివారి కల్యాణోత్సవానికి వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.

News March 25, 2024

నల్గొండ: కలర్ పడుద్ది.. కండ్లు భద్రం..!

image

హోలీ అంటేనే రంగుల కేళి..చిన్నా పెద్దా తేడా లేకుండా కలిసి ఆడే పండుగ. నేడు రంగుల వేడుకను జరుపుకొనేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రంగులు కళ్లల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తే మంచిది అని అంటున్నారు.