India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూర్యాపేట జిల్లా సింగిరెడ్డి పాలెం పాఠశాల తనిఖీల్లో భాగంగా ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా సెలవులో ఉన్న HM నరేందర్, టీచర్ శ్రీనివాస్పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సీరియస్ అయ్యారు. షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విద్యాశాఖ అధికారిని ఆయన ఆదేశించారు. సమయపాలన పాటించి విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని కోరారు.
వర్షం కారణంగా చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా ముందే పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆర్డీవోలు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడైనా వర్షం నీటికి తెగిపోయేందుకు, గండ్లు పడేందుకు అవకాశం ఉన్న చెరువులను గుర్తించాలన్నారు.
రాష్ట్రంలో BRS సమాధి అయ్యిందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ని జైలుకి పంపండమే తన మరో లక్ష్యమని తెలిపారు. ఆయనతో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా జైలుకు వెళ్తారన్నారు. BRSలో ఎవరూ ఉండరని హరీశ్ రావు సైతం బీజేపీలోకి వెళ్తారని పేర్కొన్నారు.
మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో ఆకతాయి వేధింపులకు గురై <<13605754>>కళ్యాణి <<>>అనే యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కళ్యాణి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపులకు గురిచేసిన నిందితులు ఆరూరి శివ, కొమ్మనబోయిన మధులను పోలీసులు అదుపులోకి తీసుకొని శుక్రవారం రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాశం భాస్కర్తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వారు తెలిపారు.
మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ పరిధిలోని చింతల గూడేనికి <<13605754>>యువతి <<>>ఆత్మహత్యకు కారణమైన నిందితులు పరారీలో ఉన్నారు. ఇద్దరు యువకులు కళ్యాణిని వేధించడంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతికి కారణమైన యువకులను పట్టుకోవడానికి పోలీసులు 3 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. పోన్ సిగ్నల్స్ ఆధారంగా వారిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉరేసుకుని మైనర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓకాలనీకి చెందిన ఓ మైనర్(13) 9వ తరగతి చదువుతోంది. తండ్రి మరణించడంతో తల్లి ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తుంది. గురువారం మధ్యాహ్నం పాఠశాలకు వెళ్ళలేదని బాలికను తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఉరి చేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.
పీడీఎస్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోదాడ ఆర్టీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలో రేషన్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమ పద్ధతుల్లో విక్రయిస్తే డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రేషన్ బియ్యం గ్రామాల్లో కొనుగోలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో సీఎంతో సమానంగా పవన్ కళ్యాణ్ ఫొటోను అన్ని ఆఫీసులలో ఉండాలని అక్కడి సీఎం జీవో రిలీజ్ చేయడం హర్షించదగ్గ విషయమని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం ఆయన మాట్లాడారు. తెలంగాణలో కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు సమానంగా దళిత ఉపముఖ్యమంత్రి అయిన భట్టి వికమార్క ఫొటోను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో సుమారు రూ.కోటి వ్యయంతో ఫుడ్ కోర్టు ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ రోడ్డులో బీట్ మార్కెట్ యార్డుకు వెళ్లే ప్రధాన మార్గంలో ఫుడ్ కోర్టు నిర్మాణాలకు స్థలం కేటాయించారు. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. వారం పది రోజుల్లో ఫలహారశాల నిర్మాణాలకు మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.