India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం చెన్నారి గూడెం గ్రామానికి చెందిన మాతంగి గురవయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఈరోజు ఉదయం ఓ రైతు పొలంలో పురుగు మందు పిచికారీ చేసి ట్రాక్టర్పై వస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడగా గురవయ్య మృతి చెందారు. ఆయన మృతితో చెన్నారిగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 21 రూట్లలో బస్సులు నడపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వినతిపత్రం అందించారు. సోమవారం నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చించిన అనంతరం మంత్రిని కలిశారు. అన్ని మండల కేంద్రాలలో బస్టాండ్లను నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని, నియోజకవర్గ వ్యాప్తంగా పబ్లిక్ రవాణా కనెక్టివిటీ గురించి వివరించారు.
బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చిన యువకుడు సాగర్ ఎడమ కాల్వలో పడి గల్లంతైన ఘటన విధితమే. గరిడేపల్లి మండలం వెలిదండలో స్నానం కోసం నాగార్జునసాగర్ ఎడమ కాల్వ వద్దకు వెళ్లాడు. లక్షమల వెంకట్ (21) కాలుజారి కాల్వలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంకట్ ఆచూకి కోసం గజ ఈతగాళ్లతో రాత్రి వరకు గాలించగా ఈరోజు చిలుకూరు మండలంలోని పోలేని గూడెం గ్రామంలో సాగర్ ఎడమ కాలువలో వెంకట్ మృతదేహం లభ్యమైంది.
ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీనిని క్యాష్ చేసుకొని కొందరు RMPలు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో ఒప్పందాలు కుదుర్చుకొని, పేదలను దోపిడీ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. RMPతో కలిసి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే చికిత్స చిన్నదైనా భయం పెట్టి అడ్మిట్ చేయించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.5వేలు అయ్యే బిల్లును రూ.10 వేలు చేస్తున్నారని పేర్కొన్నారు.
కరెంటు షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామ సమీపంలో జరిగినది. బీహార్కు చెందిన మున్నా కుమార్ మల్లాపూర్ ఐడిఏలో స్క్రాప్ కూలి పని చేస్తుండేవాడు. వృత్తిలో భాగంగా ములకలపల్లి గ్రామంలోని డీసీఎం లో ఇనుప పైపులను లోడ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగిలి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
మోటకొండూరు మండలం ఇక్కుర్తి వీధి దీపాలు బిగిస్తుండగా విద్యుత్ షాక్తో యువకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై పాండు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గిరిధర్ ఈనెల 9న గ్రామంలో వీధి దీపాలు బిగిస్తుండగా విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు గిరిధర్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
నల్గొండ జిల్లాలో పశు సంపద ఏటేటా తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఐదేళ్ల క్రితం పోల్చితే ఈసారి లెక్క తగ్గింది. గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం చేపట్టకముందు జిల్లాలో ఉన్న గొర్రెలు మేకల సంఖ్య కంటే పథకం అమలు చేశాకే తక్కువ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలోని 31 మండలాల్లో 9,12,625 గొర్రెలు ఉండగా, 3,36,182 మేకలు ఉన్నట్లు తేలింది. రాయితీపై పంపిణీ చేసిన గొర్రెలు లెక్కలోకి రావడం లేదు.
రెండు లక్షల రుణమాఫీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈనెల 15వ తేదీన కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
వారంలో పెళ్లి ఉందనగా గుండెపోటుతో యువకుడు మృతిచెందిన ఘటన నిడమనూరు మండలం ముప్పారంలో జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన శంకరయ్య, పద్మల కుమారుడు శివకుమార్(23) ఇంట్లో శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రించాడు. శనివారం ఉదయం వచ్చి లేపినా లేవలేదు. నిద్రలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు గుర్తించారు. శివ వివాహం ఈనెల 18న జరగాల్సి ఉంది.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండలో పెళ్లికి వచ్చిన యువకుడు సాగర్ కాలవలో గల్లంతు అయిన ఘటన ఆదివారం జరిగింది. స్నానం కోసం సాగర్ కాలువ దిగి ప్రమాదవశాత్తు కాలు జారి గల్లంతు అయ్యాడు. యువకుడు హుజూర్నగర్కు చెందిన వెంకట్గా(20) స్థానికులు గుర్తించారు. యువకుడి కోసం గరిడేపల్లి పోలీసులు గాలిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.