India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిప్పర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రామ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
రైలులో యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడు బిశ్వాల్ను నల్గొండ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతితో పాటు రైలు నుంచి కిందపడి గాయాలపాలైన బిశ్వాల్ మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా బుధవారం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని నల్గొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ప్రేమ వేధింపులతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. చింతలగూడానికి చెందిన కళ్యాణి(19)ని అదే గ్రామానికి చెందిన శివ, మధు అనే ఇద్దరు యువకులు ప్రేమపేరుతో కొంతకాలంగా వేధిస్తున్నారు. ప్రేమించకుంటే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఈనెల 6న కళ్యాణికి ఫోన్లు చేస్తూ వేధించసాగారు. దీంతో కళ్యాణి పురుగు మందు తాగింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
రూ.100 కోట్లతో సూర్యాపేటని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఛైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టి సూర్యాపేటకు వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉండ్రుగొండ, పిల్లలమర్రి, కాకతీయుల శివాలయాల అభివృద్ధితో పాటు మూసీ జలాశయంలో బోటింగ్తో కలిపి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసి.. సూర్యాపేట అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
నాగార్జున సాగర్ జలాశయం ప్రాజెక్టు వివరాలును అధికారులు బుధవారం తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 503.30 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 120.5754 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను బుధవారం ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన సందర్భంగా మల్లన్నను మంత్రి పొన్నం ప్రభాకర్ శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామ స్టేజి వద్ద విజయవాడ-హైదరాబాద్ వెళ్తున్న భారీ కంటైనర్ని దాటిన కారు ఓ లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై అడ్డంగా ఉన్న కంటైనర్ను క్రేన్ సాయంతో పక్కకు తీసేశారు.
ఆన్లైన్ బెట్టింగ్ మరొకరి ప్రాణం తీసింది. పోచారం PS పరిధి శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ స్టూడెంట్ నితిన్(21) మంగళవారం రైల్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన నితిన్ కాలేజీ ఫీజు కోసం రూ.1.3 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులు బెట్టింగ్లో పోగొట్టాడు. తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
‘ఆర్టీసీ బస్సులో ఓటర్ ఐడీ చెల్లదు. టికెట్ తీసుకో లేదంటే బస్సు దిగి పో’ అంటూ తన పట్ల కండక్టర్ దురుసుగా ప్రవర్తించినట్లు నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వగ్రామానికి వెళ్లేందుకు మంగళవారం కోదాడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ఎక్కానని , సదరు కండక్టర్ ఓటర్ ఐడీ చెల్లదంటూ మధ్యలోనే దించేశారని బాధితురాలు వాపోయారు.
ఇస్కాన్ టెంపుల్ కూకట్పల్లి వారి ఆధ్వర్యంలో చేపట్టిన పూరి జగన్నాథ రథయాత్ర బుధవారం దేవరకొండ పట్టణానికి చేరుకోనుంది. ఇప్పటికే యాత్రకు సంబంధించిన కమిటీ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పట్టణానికి చేరుకోనున్న రథయాత్ర స్థానిక అయ్యప్పస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై కొండల్రావు బంగ్లా వరకు కొనసాగనుంది. అనంతరం రాత్రి 7గంటలకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Sorry, no posts matched your criteria.