Nalgonda

News March 22, 2024

NLG: ఊపందుకుంటున్న ప్రచార ప్రక్రియ

image

ఉమ్మడి జిల్లాలో ఈ సారి ఎండాకాలం లోక్‌సభ ఎన్నికలతో మరింత వేడెక్కనుంది . రాజకీయ పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు, అభ్యర్థుల ప్రకటనలతో ప్రచార ప్రక్రియ ఊపందుకుంటుంది. ఇప్పటికే నల్లగొండకు అభ్యర్థిని ప్రకటించి కాంగ్రెస్, బిజెపిలు ఒక అడుగు ముందుకు వేశాయి. భువనగిరి ఎంపీ స్థానానికి ఏ పార్టీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్లో టికెట్ కోసం పోటీ పడుతుండగా.. బీఆర్ఎస్‌లో అయోమయం నెలకొంది.

News March 22, 2024

NLG: ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

image

లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఈ మేరకు భువనగిరి స్థానానికి అభ్యర్థిని కూడా ప్రకటించింది. సీపీఐతో కలిసి పోటీ చేయాలని భావించినా.. ఆ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలనే యోచనలో ఉండడంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కాగా సీపీఎంకు పడే ఓట్ల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్..

News March 22, 2024

యాదాద్రి క్షేత్రంలో నేడు చండీ హోమం

image

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండి హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.‌ ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

News March 22, 2024

సూర్యాపేట: భారీగా నగదు, బంగారం పట్టివేత

image

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అన్ని చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు తెలిపారు. తనిఖీల్లో భాగంగా రూ.15.65 లక్షలు, 690 లీటర్ల మద్యంతో పాటు 27 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అలాగే 229 గ్రాముల బంగారం, పట్టుబడిన రెడీ మేడ్ దుస్తులు విలువ రూ.21.45 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. బాధితులు ఆధారాలు అందజేస్తే పరిశీలన చేసి అందచేస్తామని చెప్పారు.

News March 21, 2024

చౌటుప్పల్ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం గుండ్లబావి స్టేజి వద్ద జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాలిలా.. రామన్నపేట మండలం సిరిపురానికి చెందిన బొడ్డుపల్లి సాయికుమార్, నవీన్ బైక్ పై వెళ్తుండగా గుండ్లబావి వద్ద గుర్తుతెలియని వాహనం కొట్టింది. ప్రమాదంలో సాయి అక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలైన నవీన్‌ను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2024

నార్కట్‌పల్లి: తనిఖీలు ముమ్మరం.. రూ.10 లక్షలు సీజ్

image

పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. గురువారం నార్కట్‌పల్లిలో చేపట్టిన తనిఖీలో ఓ వ్యక్తి కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న పది లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ అంతిరెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరూ రూ.50 వేలకు మించి తీసుకెళ్లొద్దని, ఒకవేళ తీసుకెళ్తే ఆ డబ్బుకు సంబంధించి ఆధారాలు వెంట తీసుకెళ్లాలని సూచించారు.

News March 21, 2024

నార్కట్‌పల్లి: హైవేపై లారీ ఢీకొని ఒకరి దుర్మరణం

image

నార్కట్‌పల్లిలో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న లారీ నార్కట్‌పల్లి శివారులోని నల్లగొండ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. మృతుడి వయసు 55-60 ఏళ్లు ఉంటాయని.. అతను యాచకుడిలా పోలీసులు భావిస్తున్నారు.

News March 21, 2024

బీబీనగర్ వద్ద రైలు కింద పడి మహిళ దుర్మరణం

image

బీబీనగర్ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే ఎస్సై సత్యనారాయణ తెలిపారు. కిలోమీటర్ నెంబర్ 227/ 3-5 వద్ద ఎగువ లైన్లో 40 ఏళ్ల వయసు గల మహిళ రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. మృతురాలు తెలుపు రంగు చీర, పసుపుపచ్చ జాకెట్ ధరించారని వెల్లడించారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రిలో భద్రపరిచామని తెలిపారు.

News March 21, 2024

నల్గొండ: భూగర్భ పైప్ లైన్ల ఏర్పాటుకు లైన్ క్లియర్

image

ఉమ్మడి జిల్లాలోని మూడు పురపాలికల్లో భూగర్భ మురుగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయనున్నారు. నల్లగొండ జిల్లాలో 9, సూర్యాపేట జిల్లాలో 5, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు పురపాలక సంఘాల్లో భూగర్భ మురుగునీటి పైప్ లైన్లు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఆయా మున్సిపాలిటీల్లో భూగర్భ మురుగునీటి పైపులైన్ల నిర్మాణ పనులను రెండేళ్లలో పూర్తి చేయనున్నారు.

News March 21, 2024

సూర్యాపేట: బ్యాంకు అధికారిపై కేసు నమోదు

image

రుణాల పేరుతో రూ.2.82 కోట్లు దోచుకున్న తాళ్లసింగారానికి చెందిన ఎస్బీఐ మేనేజర్ హరిప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు నూతనకల్ ఎస్సై సైదులు తెలిపారు. ప్రస్తుత మేనేజర్ రవీందర్ ఫిర్యాదు మేరకు.. నకిలీ రైతులు, వ్యాపారస్థులు, మహిళా సంఘాల పేరుతో రుణాలు మంజూరు చేసి తన ఖాతాలోకి నిధులు మళ్లించుకొని రూ.కోట్ల బ్యాంకు సొమ్ము కాజేసినట్లు రుజువు కావడంతో హరిప్రసాద్‌తో పాటు అతనికి సహకరించిన 14 మందిపై కేసు నమోదు చేశారు.