Nalgonda

News July 10, 2024

SRPT: చికిత్స పొందుతూ బాలిక మృతి

image

పురుగు మందు తాగిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాలు మేరకు.. సూర్యాపేటకు చెందిన బాలిక(15) మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఈనెల 6న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు సీఐ తెలిపారు.

News July 10, 2024

నల్గొండ: ప్రాణం తీసిన గడ్డివాము పంచాయతీ

image

అనంతగిరి మండలం వెంకట్రాంపురంలో గడ్డి వాము పంచాయతీ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పల్లె సుధాకర్, తుళ్లూరు అచ్చయ్య గడ్డివాము విషయంలో గొడవపడ్డారు. అచ్చయ్య సుధాకర్‌ను నెట్టి వేయగా సుధాకర్ తలకు తీవ్ర గాయమైంది. హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనంతగిరి ఎస్ఐ తెలిపారు.

News July 10, 2024

18న సూర్యాపేట పోస్ట్ ఆఫీసులో ఇంటర్వ్యూలు

image

తపాలా శాఖలో కమిషన్ ప్రాతిపదికన పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 18న సూర్యాపేట పోస్ట్ ఆఫీస్‌లో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సూర్యాపేట డివిజన్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ జి.సైదులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సూర్యాపేట డివిజన్‌లోని 347 పోస్ట్ ఆఫీసులు పరిధిలో 18 ఏళ్లు నిండి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

News July 10, 2024

NLG: ఆకతాయిలకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

image

మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తూ పోలీస్ శాఖ వారికి రక్షణ కల్పిస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్, షీటీమ్ పోలీస్ స్టేషన్, భరోసా సెంటర్లను ఎస్పీ మంగళవారం పరిశీలించారు. ఆకతాయిలు మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ సందర్భంగా ఎస్సీ హెచ్చరించారు.

News July 9, 2024

SRPT: సీఎంను కలిసిన టూరిజం డెవలప్మెంట్ ఛైర్మన్

image

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా పటేల్ రమేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు.

News July 9, 2024

యాదాద్రి: కలెక్టరేట్ ముందు VRAల నిరసన

image

VRAలను విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన వ్యక్తంచేశారు. GO 81 ప్రకారం 60 ఏళ్లలోపు వారిని 61ఏళ్లు నిండిన ఉద్యోగుల వారసులను విధులలోకి తీసుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. VRAలను గత ప్రభుత్వం 81వ GO ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 20,555 VRAలు ఉంటే 16,758 మందిని విధుల్లోకి తీసుకుంది. మిగతా 3,797మందిని ఎలక్షన్ల తర్వాత తీసుకుంటామని ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు.

News July 9, 2024

విదేశీ స్కాలర్ షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం

image

విదేశాల్లో చదువుకునే వారు స్కాలర్షిప్ పొందేందుకు అర్హులైన మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి టి.విజేందర్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, డాక్టోరల్ కోర్సు అభ్యసిస్తూ ఉపకార వేతనం పొందవచ్చన్నారు. telangana epass.cgg.gov.inలో దరఖాస్తు తీసుకోవాలని సూచించారు.

News July 9, 2024

NLG: గ్రూప్ 2 ఉచిత గ్రాండ్ టెస్టులు

image

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన tgpsc గ్రూప్-2 ఉచిత గ్రాండ్ టెస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.విజయ్కుమార్ తెలిపారు. ఈ నెలలో మొత్తం 4 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.

News July 9, 2024

నల్గొండ: డ్రోన్‌తో ఎరువుల పిచికారీ

image

రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన మంగినపల్లి నర్సిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో “డ్రోన్ వ్యవసాయ రసాయన పిచికారి” యంత్రాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని విద్యగా ఎంచుకోవడం దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

News July 9, 2024

నల్గొండ: హర్షసాయి పేరుతో ఘరానా మోసం

image

యూట్యూబర్ హర్షసాయి పేరు చెప్పి సైబర్ మోసానికి పాల్పడిన ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. డిండి మండలం జయ్రతండాకు చెందిన హనుమంత్ NGKL జిల్లాలో ఇటుక బట్టి వ్యాపారం చేస్తున్నాడు. మే14న హర్షసాయి పేరులో ఫోన్‌ చేసి సాయం చేస్తానని నమ్మించాడు. కొంత డబ్బు చెల్లించాలనగా నమ్మిన బాధితుడు పలు దఫాలుగా రూ.54,500 పంపాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశాడు.