Nalgonda

News July 8, 2024

NLG: పలువురు సీఐలకు స్థానచలనం

image

జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ మల్టీ జోన్-2 ఐజీపీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. HYD సిటీలో వెయిటింగ్లో ఉన్న కొండల్రెడ్డిని SLG, NLGలో ఉన్న శ్రీనివాసరెడ్డిని ఐజీపీ కార్యాలయానికి, నల్లగొండ వన్ టౌన్ సీఐ సత్యనారాయణను సంగారెడ్డి వీఆర్‌కు, ఇంటలిజెన్స్‌లో ఉన్న రాజశేఖర్ రెడ్డిని నల్లగొండ వన్ టౌన్‌కు, HYD సిటీ వెయిటింగ్లో ఉన్న క్రాంతికుమార్‌ను NLG ట్రాఫిక్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News July 8, 2024

NLG: నిర్మించి రెండేళ్లు.. స్థానికంగా ఉండని అధ్యాపకులు!

image

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల నివాసం ఉండేందుకు ఏర్పాటు చేసిన స్టాఫ్ క్వార్టర్స్ నిరుపయోగంగా మారాయి. రూ. 6.66 కోట్లతో మొత్తం 16 క్వార్టర్స్‌ను నిర్మించారు. నిర్మాణాలు పూర్తై రెండేళ్లు కావొస్తున్నా అధ్యాపకులు ఇక్కడ ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. చాలా మంది అధ్యాపకులు నిత్యం HYD నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. అధ్యాపకులు స్థానికంగా ఉంటే చదువులు, పరిశోధనల పరంగా మరింత మేలు జరిగే అవకాశం ఉంది.

News July 8, 2024

మిర్యాలగూడలో రైలు కింద పడి ఆటో డ్రైవర్ సూసైడ్ 

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబ పోషణ భారమై ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై పవన్ కుమార్ రెడ్డి, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాద్రిపాలెం దుర్గా నగర్ కాలనీకి చెందిన నాగేంద్రబాబు(32) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆటోలు కొని ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక కుటుంబ పోషణ భారంగా మారి ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 8, 2024

నల్గొండ: పురుగు మందు తాగి యువకుడి సూసైడ్ 

image

పురుగుల మందు తాగి యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చివ్వెంల మం కుడకుడలో జరిగింది. ఎస్సై కనకరత్నం వివరాలిలా.. మహేశ్ (28)కు ఏడాది క్రితం గాయంవారిగూడేనికి చెందిన నాగలక్ష్మితో వివాహమైంది. గొడవలు రావడంతో 6 నెలల క్రితం విడిపోయారు. మద్యానికి బానిసైన మహేశ్‌ను తల్లి మందలించడంతో శనివారం రాత్రి పురుగు మందు తాగాడు. కుటుంబసభ్యులు SRPT ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదైంది. 

News July 8, 2024

నల్గొండ: నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు

image

నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో విద్యుద్ఘాతంతో ప్రజలు, పశువుల ప్రాణాలు పోతున్నాయి. మేతకు వెళ్లిన పశువులు, పొలం పనికి వెళ్లిన రైతులు కరెంట్ కాటుకు బలైన ఘటనలో ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు. కరెంట్ తీగలు కిందికి ఉండడం, కొన్నిచోట్ల కరెంటు తీగలు తెగిపడటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఉమ్మడి జిల్లాలో జనవరి నుంచి జులై వరకు విద్యుద్ఘాతంతో 81 పశువులు మరణించగా, 31 మంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు.

News July 8, 2024

ప్రైవేటు మందుల దుకాణాల్లో యదేచ్చగా దోపిడీ

image

ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా కొనసాగుతున్న కొన్ని మెడికల్ ఔషధ షాపుల్లో అధిక ధరలు వసూలు చేస్తూ రోగులను దోచుకుంటున్నారు. వీటిల్లో ఎక్కువ శాతం తక్కువ ధర ఉండే జనరిక్ మందులనే విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా డబ్బులు దండుకుంటున్న తనిఖీలు చేయాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News July 8, 2024

NLG: కాంట్రాక్టు ఏఎన్ఎంలు.. ఇక పోరుబాట!

image

22 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతూ, చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న తమను రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ యూరోపియన్ స్కీం ఏఎన్ఎంలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారా 2002లో రూ.3.550 వేతనంతో విధుల్లో చేరారు. ఉమ్మడి జిల్లాలో 73 మంది ఈసీ ఏఎన్ఎంలుగా కొనసాగుతున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News July 8, 2024

నేడు జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన

image

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కేతేపల్లి మండలం కొర్లపాడు గ్రామం (టోల్ ప్లాజా వద్ద), కనగల్ మండలం యేమిరెడ్డిగూడెంలో ట్రామా కేర్ సెంటర్లకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు మంత్రి హైదరాబాదుకు తిరుగు పయనమవుతారు.

News July 7, 2024

యాదాద్రి: విద్యుద్ఘాతంతో రైతు మృతి

image

విద్యుద్ఘాతంతో రైతు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా ముత్తిరెడ్డిగూడెంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన ఉద్ది శంకరయ్య పొలం దగ్గరికి వెళ్లాడు. వ్యవసాయ బావి వద్ద కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు. బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

News July 7, 2024

సూర్యాపేట: అన్నదమ్ములు గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై

image

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో గరిడేపల్లి మండలం వెలిదండకు చెందిన అన్నదమ్ములు సత్తాచాటారు. తుమ్మకొమ శ్యామ్ సుందర్ , రాము, దశరథ్ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యారు. శ్యామ్ సుందర్ మిర్యాలగూడ గురుకుల స్కూల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాము కోదాడలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దశరథ్ బాసరలో ట్రిపుల్ ఐటీ పూర్తి చేసుకొని గ్రూపు-1కి ప్రిపేర్ అయ్యారు.