Nalgonda

News March 18, 2024

భువనగిరి శివారులో వ్యక్తి మృతదేహం లభ్యం

image

భువనగిరి పట్టణ శివారులోని హుస్నాబాద్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు పట్టణ ఎస్సై సురేష్ తెలిపారు. కాలిపోయి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారని మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటాయన్నారు. కాలిపోయి ఉండటంతో ఎవరైనా హత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 18, 2024

భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బిక్షమయ్య గౌడ్..?

image

భువనగిరి పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఖరారైనట్లు తెలుస్తోంది. BNG, NLG స్థానాలను బీసీ, ఓసీలకు కేటాయించాలని బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో గౌడ సామాజికవర్గం ఓట్లు ఉన్నందున BNG సీటును అదే సామాజికవర్గానికి చెందిన బిక్షమయ్య గౌడ్‌కు కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

News March 18, 2024

నల్లగొండ: విద్యార్థులు ఆర్టీసీని సద్వినియోగం చేసుకోవాలి

image

నేటి నుండి ప్రారంభమవుతున్న పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సు ప్రయాణం సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజినల్ మేనేజర్ ఎస్. శ్రీదేవి తెలిపారు. వ్యాలిడిటీ కలిగిన బస్సు పాస్ ఉండి రూట్ తో సంబంధం లేకుండా హాల్ టికెట్ పై ఉన్న పరీక్ష కేంద్రానికి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, కాంబినేషన్ టికెటుతో ఎక్ ప్రెస్ బస్సులోనూ ప్రయాణం చేయవచ్చని తెలిపారు.

News March 18, 2024

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: కలెక్టర్ హరిచందన

image

టెలివిజన్ ఛానళ్లు, వార్త పత్రికల్లో ప్రభుత్వ పథకాలపై ప్రకటన నిలిపివేయాలని నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోస్టర్లు, కరపత్రాలపై పబ్లిషర్‌, ప్రింటర్‌ పేరు, ఫోన్‌ నంబర్‌తో సహా ప్రచురించాలని, ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులు ప్రచురణకర్త ద్వారా డిక్లరేషన్‌ తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలో ఉల్లంగిస్తే ప్రజాప్రతినిధ్య చట్టం–1951 కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 18, 2024

యాదగిరిగుట్ట: ఒకేరోజు అత్తాకోడలు మృతి

image

అత్త మృతిని తట్టుకోలేక కోడలు గుండెపోటుతో కుప్పకూలింది. యాదగిరిగుట్ట మండలం గొల్లగుడిసెకి చెందిన చుక్కల భారతమ్మ(65) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందింది. అత్త మృతదేహాన్ని చూసిన కోడలు మంగమ్మ(26) రోదిస్తూనే పడిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. వెంటనే భువనగిరి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒకేరోజు అత్తాకోడళ్ల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

News March 18, 2024

NLG: నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. సెంటర్ల వద్ద 144 సెక్షన్‌

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి నుంటి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. నల్గొండ జిల్లాలో మొత్తం 109 పరీక్ష కేంద్రాల్లో 19,715 మంది, సూర్యాపేటలోని 76 సెంటర్లలో 12,133 మంది, యాదాద్రిలో 51 సెంటర్లలో 9130 మంది పరీక్ష రాయనున్నారు. దీంతో సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ అమలుతోపాటు పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని డీఈఓ బిక్షపతి సూచించారు.

News March 18, 2024

లోక్ సభ ఎన్నికలపై కలెక్టర్, ఎస్పీ ప్రెస్ మీట్

image

లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. ఆదివారం ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ పై జిల్లా ఎస్పీ చందనా దీప్తితో కలిసి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 14 లక్షల 90 వేల 431 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు.

News March 17, 2024

ప్రజావాణి రద్దుకు ప్రజలు సహకరించాలి: కలెక్టర్

image

పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, అలాగే పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు, వచ్చే జూన్ 6 వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదన్నారు.

News March 17, 2024

జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక ప్రాంతాలు: ఎస్పీ చందనా దీప్తి

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ పకడ్బందీగా అమలు చేస్తామని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యం అన్నారు. జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక ప్రాంతాలు, 439 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని తెలిపారు.
అక్కడ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. అవసరమైన ప్రతీ చోటా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

News March 17, 2024

NLG: మోగిన నగారా… గెలుపు కోసం పార్టీల వ్యూహాలు

image

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. పోలింగ్ కు సుమారు రెండు నెలల సమయం ఉండటంతో ప్రధాన పార్టీల్లో ప్రచారం, అభ్యర్థి చేసే ఖర్చుపై కొంత చర్చ సాగుతోంది. రెండు సెట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేలా అధికార పార్టీ ఓవైపు పావులు కదుపుతుండగా.. మరో వైపు బిఆర్ఎస్, బిజెపిలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.