India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్లగొండ జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న 96 టీచర్ల పోస్టులు, 381 ఆయాల పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుందని జిల్లా సంక్షేమ అధికారి సక్కుబాయి తెలిపారు.
చోరీకి వెళ్లిన ఇద్దరు దొంగలు పోలీసులకు చిక్కిన ఘటన పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం జరిగింది. చౌటుప్పల్ సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాలు.. మల్కాజిగిరిలో నివాసముంటున్న పవన్ (24), MBNR జిల్లా జడ్చర్ల మండలం పెద్దఅడవిరాళ్లకు చెందిన బరిగల శివకుమార్(23)లు పాత నేరస్థులు. చౌటుప్పల్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా కత్తులతో దాడి చేసేందుకు యత్నించారు. విచారించగా చోరీ చేసేందుకు వెళ్తున్నట్లు ఒప్పుకున్నారు.
మునగాల సమీపంలో శనివారం రాత్రి యాక్సిడెంట్ జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని స్కూటీపై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా.. బాపట్లకు చెందిన వెంకటకృష్ణ, పవన్ స్కూటీపై వెళుతుండగా మునగాల మం. మాధవరం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. క్షతగాత్రుడు పవన్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆమలు చేయనున్న రైతు భరోసాను ఒక్కో రైతుకు 10 ఎకరాల వరకు పరిమితం చేయాలని జిల్లాలోని మెజారిటీ రైతులు అభిప్రాయపడ్డారు. ఒక రైతుకు అంతకుమించి భూమి ఉన్నా రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతేకాదు వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా అమలు చేయాలని, రియల్ఎస్టేట్ వెంచర్లు, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
కోదాడకి చెందిన చౌడవరపు పవన్ అనే యువకుడు సింగపూర్ బీచ్లో శనివారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. కోదాడలో ఉన్న తల్లిదండ్రులు పవన్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు. యువకుడి తండ్రి శ్రీనివాసరావు కోదాడలో నూనె వ్యాపారం చేస్తున్నారు. రెండు నెలల్లో రెండో కుమారుడు అమెరికా వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఈ ఘటన జరిగింది.
తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ కోసం ప్రతి పౌర్ణమికి ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్ఎం రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెల పౌర్ణమికి రద్దీని బట్టి ప్రత్యేక బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. అరుణాచలం వెళ్లే భక్తులకు ఏపీలోని కాణిపాకం, తమిళనాడు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుందన్నారు.
టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ థియరీ పరీక్షలు ఆగస్టు 4న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. ఆగస్టు 4న ఆదివారం ఎడ్యుకేషనల్ సైకాలజీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జనరల్ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్ పరీక్ష 3.30 నుంచి 4:30 వరకు జరుగుతాయని తెలిపారు.
ఉమ్మడి నల్గొండలో విస్తరించి ఉన్న నల్లమలలో రెండేళ్లలో జంతువులు గణనీయంగా వృద్ధి చెందినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ అటవీ డివిజన్ పరిధిలో పెద్దపులి సంచారాన్ని నిర్ధారించడంతో పాటు అరుదైన జాతికి చెందిన రాబందు సైతం ఇక్కడ కనిపించడంతో వాటి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా నల్గొండ పరిధిలో ఉన్న డివిజన్లో నాగార్జున సాగర్, కంబాళపల్లి, దేవరకొండ రేంజ్లున్నాయి.
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో రానున్న 3 రోజులపాటు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, జీపీ ప్రత్యేక అధికారులతో గ్రామాలలో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. GP ఆవరణతో పాటు, ఇతర ప్రభుత్వ సంస్థలు, రహదారులకు ఇరువైపులా పిచ్చి మొక్కలు లేకుండా తొలగించాలన్నారు.
గరిడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి శనివారం ఓ దొంగ పరారైయ్యాడు. వ్యవసాయ మోటార్ల చోరీ కేసులో అదుపులోకి తీసుకోని విచారిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి చాకచక్యంగా పరారైనట్టు తెలుస్తోంది. కేసులో పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో ఉంచారు. పరారీ అయిన అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఎస్పీ సీరియస్ అయినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.