Nalgonda

News July 6, 2024

సింగపూర్‌లో కోదాడ యువకుడి మృతి

image

సింగపూర్‌లో తెలుగు యువకుడు మృతి చెందాడు. వివరాలిలా. కోదాడకి చెందిన చౌడవరపు పవన్ సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. పవన్ మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

News July 6, 2024

నల్గొండ: విద్యార్థులను కరిచిన ఎలుకలు

image

డిండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జులై 2న 16 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని, పాఠశాలలో ఎలుకలు కరవడంపై ప్రిన్సిపల్ సంబంధం లేని సమాధానం చెబుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News July 6, 2024

నల్గొండ: విద్యార్థులను కరిచిన ఎలుకలు

image

డిండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జులై 2న 16 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని, పాఠశాలలో ఎలుకలు కరవడంపై ప్రిన్సిపల్ సంబంధం లేని సమాధానం చెబుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News July 6, 2024

సూర్యాపేట: బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతి 

image

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎర్ర పహాడ్ స్టేజి సమీపంలో 365వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. పెదనేమిలకి చెందిన తన్నీరు సత్తయ్య మృతి చెందాడు. బైక్‌పై సూర్యాపేట నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో నిద్రమత్తులో డివైడర్‌ని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సత్తయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

News July 6, 2024

మిర్యాలగూడలో సాంకేతిక లోపంతో నిలిచిన రైలు

image

మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ సుమారు గంటపాటు నిలిచిపోయింది. చక్రంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రైలును నిలిపేశారు. సిబ్బంది సమస్యను గుర్తించి మరమ్మతులు చేపట్టారు.

News July 6, 2024

నల్గొండ: విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి

image

విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి చెందిన ఘటన మాడుగులపల్లి మండలం పాములపహాడ్ గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్రి రేణుక (38) శుక్రవారం ఇంటి ఆవరణలో శుభ్రం చేస్తోంది. తెగిపడిన కరెంట్ వైర్ తగిలి షాక్‌కు గురైంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 

News July 6, 2024

బీబీనగర్ – నడికుడి మధ్య రెండో లైన్

image

బీబీనగర్- నడికుడి మధ్య రెండో రైల్వే లైన్ పనులకు మోక్షం లభించింది. ఈ రైల్వే లైన్ పనులను ఆగస్టులో ప్రారంభించనున్నారు. ఈ మార్గం డబ్లింగ్ పనుల కోసం మూడు దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. 230 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం రూ.2,853.23 కోట్లను కేంద్ర రైల్వే శాఖ కేటాయించింది.

News July 6, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాలో హర్రర్ గ్యాంగ్

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రమాదకరమైన హర్రర్ గ్యాంగ్ పార్థి ముఠా చోరీలు పెరిగాయి. హైవే వెంట, పట్టణాల్లో వీరి ఆగడాలు ఎక్కువయ్యాయి. శుక్రవారం పెద్ద అంబర్ పేట్ శివారులో ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. కట్టంగూర్ వద్ద రహదారి వెంబడి మే 18న జరిగిన హత్య తామే చేసినట్లు వారు ఒప్పుకున్నారు. శుక్రవారం ఉదయం పోలీసులకు దొరికే ముందు కూడా చౌటుప్పల్‌లో ఓ ఇంట్లో కత్తులతో బెదిరించి బంగారం ఎత్తుకెళ్లారు.

News July 6, 2024

సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలి : కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వైద్యులను ఆదేశించారు. నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న పానగల్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని మందులను, అటెండెన్స్ రిజిస్టర్ ను, సౌకర్యాలను, ఔట్ పేషెంట్ ,ఇన్ పేషెంట్ రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్, వార్డులను ఆయన పరిశీలించారు.

News July 5, 2024

NLG: జిల్లాలో జలశక్తి అభియాన్ పనులు భేష్

image

నల్గొండ జిల్లాలో జలశక్తి అభియాన్ పనులు బాగుండడం పట్ల కేంద్ర జల శక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ వేద వీర్ ఆర్య సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ పనుల పరిశీలన నిమిత్తం మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర జల శక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ బృందం శాస్త్రవేత్త దివాకర్ మహంతాతో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సి. నారాయణరెడ్డితో సమావేశమయ్యారు.