India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా ఇక నుంచి మున్సిపల్ వార్డుల్లోనూ నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి నిర్ణయించారు. నేటి నుంచి ప్రతి గురువారం జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలతోపాటు , NLG, MLG, HLY, నందికొండ, DVK, CDR, CTL, NKL మున్సిపల్ పట్టణాల్లోని వార్డుల్లో సంబంధిత ఉద్యోగులు ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించనున్నారు.
వానాకాలం ప్రారంభమై నెల గడిచినా.. మూడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు అయింది. దీంతో పంటల సాగులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి పంటల సాగు సగటు 15 శాతానికి కూడా మించలేదు. గతేడాది ఇదే సమయానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 20 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. చాలా ప్రాంతాల్లో విత్తనాలు నాటిన తర్వాత వర్షం లేకపోవడంతో అవి ఎండిపోయే దశకు చేరాయి.
చౌటుప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి NHAI రూ.114.40 కోట్లు మంజూరు చేసింది. జాతీయ రహదారిపై 2.45 కిలోమీటర్ల పొడవు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లేదారి నుంచి వలిగొండ చౌరస్తా వరకు మట్టితో వంతెనను నిర్మిస్తారు. మధ్యలో ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు 200 మీటర్ల పొడవు మట్టి కట్ట కాకుండా సిమెంట్ పిల్లర్లతో ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు.
హాస్టల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సంక్షేమ హాస్టళ్ల వెల్ఫేర్ అధికారులు, కేజీబీవీ పాఠశాలలు, మోడల్ పాఠశాలల ప్రిన్సిపల్స్, సంబంధిత జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.
నల్గొండ జిల్లాలోని 31 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించిన సంగతి తెలిసిందే. కేతేపల్లి – D. నాగేశ్వరరావు, కొండమల్లేపల్లి – S. ద్వారక, మాడుగుల పల్లి – K. మహేందర్ కుమార్, మర్రిగూడ – D. యల్లయ్య, మిర్యాలగూడ – J. వెంకట్ రెడ్డి, మునుగోడు – K. మురళి, నకిరేకల్ – S. కిరణ్ కుమార్, నల్గొండ – G. గీత లక్ష్మి, నాంపల్లి – K. శ్రీనివాస్, నార్కెట్ పల్లి – V. రమేష్, నేరేడుగోమ్ము -నితిన్ కుమార్ ను కేటాయించారు.
నిడమానూరు – V. శ్రీనివాస రావు, పీఏ పల్లి – నాగమల్లేశ్వరరావు, పెద్దవూర – వెంకటయ్య, శాలిగౌరారం – రామారావు నాయక్, తిప్పర్తి – R. దస్రు, తిరుమలగిరి సాగర్ – R. కిరణ్ కుమార్, త్రిపురారం – V. లీల, వేములపల్లి – B. శ్రీనివాసరావు, కట్టంగూర్ – విజయేందర్ రెడ్డి, కనగల్ – V. శ్రీనివాస్, గుర్రంపోడు – V.వెంకటేశ్వర్లు, గుండ్రంపల్లి – M. వీరప్ప, దేవరకొండ – ఇందిరా, చిట్యాల – P. శ్రీనివాస్ కుమార్ ను కేటాయించారు.
HNRలోని ఎంపీపీ కాలనీకి చెందిన ఉదారి క్రాంతికుమార్, పార్వతికి ఒక కుమార్తె జ్యోత్స్న ఉంది. జ్యోత్స్న తల్లి పార్వతి ఆమె చిన్నతనంలోనే మృతిచెందగా, ఆటో డ్రైవర్గా జీవిస్తున్న తండ్రి క్రాంతికుమార్ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో 12 ఏళ్ల బాలిక జ్యోత్స్న అనాథగా మారింది. ఇదిలా ఉండగా, తండ్రి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో కాలనీ వాసుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.
నల్గొండ జిల్లాలోని 31 మండలాల్లో రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. రాష్ట్రంలో ఇవాళ జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ పదవీ కాలం ముగిసింది. పరిపాలనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లాలోని 31 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ విభాగాల అధిపతులతో ఆసుపత్రి పని తీరుపై సమీక్షించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద సేవలను పెంచాలని, అన్ని రకాల రోగులను ఆరోగ్యశ్రీ కింద చూడాలన్నారు.
వనమహోత్సవం కార్యక్రమం కింద ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో 66 లక్షల ఆరువేల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.
బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వనమహోత్సవం కింద నాటిన ప్రతి మొక్క బతకాలని, మొక్కలు నాటేందుకు సరైన స్థలాలను ఎంపిక చేయాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.