Nalgonda

News July 3, 2024

ఉద్యోగాలకు నల్గొండలో రేపు ఇంటర్వూలు

image

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను వివిధ సబ్జెక్టులలో అతిథి అధ్యాపకుల నియామకానికి ఈనెల 4వ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ ఘనశ్యామ్ తెలిపారు. ఇవాళ జరగాల్సిన ఇంటర్వ్యూలను రేపటికి వాయిదా వేసినట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారంతా ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలలో జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలియజేశారు.

News July 3, 2024

నల్గొండ జిల్లాలో పర్యాటకం అభివృద్ధి

image

అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారులు ఇప్పటికే 12 ప్రాంతాలను గుర్తించారు. ఉమ్మడి నల్గొండ నుంచి గాజుబిడెం బ్యాక్‌ వాటర్‌లో బస, బోటింగ్, నెల్లికల్‌ ఎకోపార్క్‌లో సఫారీ, కంబాలపల్లి అడవుల్లో ట్రెక్కింగ్‌ ఉండనుంది. దీంతో స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు ఖజానాకు ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

News July 3, 2024

చండూరు: ఉద్యోగం ఇప్పిస్తానని కౌన్సిలర్ చీటింగ్..

image

చండూరు మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశారని ఆరోపిస్తూ చండూరుకు చెందిన నర్సింహ మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఓ కౌన్సిలర్.. చండూరు మునిసిపల్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని 2021లో రూ.రెండు లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై సురేష్ తెలిపారు.

News July 3, 2024

కొత్త చట్టాలతో బాధితులకు న్యాయం

image

దేశవ్యాప్తంగా జులై 1నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ వెల్లడించారు. తొలి రోజు కొత్త చట్టాల కింద జిల్లాలో ఏడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదయ్యాయని తెలిపారు. బాధితుడు ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈ – మెయిల్‌ ఇతర సామాజిక మాధ్యమాలు వేటి ద్వారానైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితులు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

News July 3, 2024

NLG: రెండు రోజులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

image

ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యాలయాలలో బుధ, గురువారాలు రెండు రోజులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఈ విషయమై జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఆదేశించారు.

News July 2, 2024

మంత్రి కోమటిరెడ్డికి కంచర్ల కౌంటర్

image

<<13545889>>మంత్రి కోమటిరెడ్డికి <<>>మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రి బీఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండలో రూ.100 కోట్లు పలికే భూమి ఉందా అని ఆయన ప్రశ్నించారు. మిగతా పార్టీ ఆఫీసులకు భూమి కేటాయించినట్లే బీఆర్ఎస్‌కి భూ కేటాయింపు జరిగిందన్నారు. పార్టీ ఆఫీసుకు సీసీఎల్‌ఏ అనుమతులు కూడా వచ్చాయన్నారు. నిబంధనల ప్రకారం డబ్బు కూడా చెల్లించామన్నారు.

News July 2, 2024

నాగార్జున సాగర్ జలాశయం సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు మంగళవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.00 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 121.7080 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.

News July 2, 2024

నాగార్జున సాగర్ జలాశయం సమాచారం

image

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు మంగళవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.00 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 121.7080 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.

News July 2, 2024

NLG: కొత్త చట్టం తొలి కేసు నమోదు

image

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త చట్టంలో తొలి కేసు సోమవారం నల్లగొండ వన్ టౌన్ స్టేషన్ పరిధిలో నమోదైంది. ఏబీవీపీ నాయకులు స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ముందస్తు పోలీసు అనుమతి లేకుండా ధర్నా చేయడంతో నూతన చట్టం 151 ప్రకారం కేసు నమోదు చేశారు. 151 నూతన చట్టం ప్రకారం వ్యక్తిగత పూచికత్తుపై వదిలి పెట్టినప్పటికీ సెక్షన్ మార్పు మినహా వ్యక్తి గత పూచికత్తుపై వదిలేశారు.

News July 2, 2024

NLG: సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులు కిటకిట

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలు, ముసురుతో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని పలు ఆసుపత్రులకు రోగులు తాకిడి పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి రోగాలతో ప్రజలు విలవిలాడుతున్నారు. వైద్యాధికారులు స్పందించి ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు, గ్రామీణులు కోరుతున్నారు.