India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది నేరుగా పంట పొలాలకు వద్దకు వెళ్లి సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. కొన్నిచోట్ల సర్వర్ సమస్యలు తలెత్తినా నమోదు చేయాలని సర్కార్ ఆదేశించింది. ఆగస్టు నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని గడవు విధించింది. ఈ మేరకు ప్రస్తుతం పత్తి, కంది, జీలుగ, వరి తదితర పంటల లెక్క తేల్చుతున్నారు.
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసిన అనంతరం యాదాద్రి జిల్లాలో అన్ని రకాల కేటగిరీల్లో కలిపి 687 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. కాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ డీఎస్సీ ద్వారా కేవలం 277 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎస్జీటీలు 128, ఎస్ఏలు 130, ఎల్ పీలు 19 వరకు ఉన్నాయి.
కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో అనే చర్చ మొదలైంది. మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి, DVK ఎమ్మెల్యే బాలునాయక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీలో చేరే సమయంలో తనకు హామీ ఇచ్చారని సన్నిహితుల వద్ద రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. బాలునాయక్ కూడా ఉత్తమ్, జానారెడ్డి ద్వారా ప్రయత్నిస్తున్నారు.
నల్గొండ జిల్లాలోని రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ మూసీ. కాగా ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 637 అడుగుల నీరు ఉంది. మూసి ప్రాజెక్ట్ కాల్వల ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని NKL, NLG, MLG, SRPT నియోజకవర్గంలోని 40 వేల పైచిలుకు భూమి సాగు అవుతుంది. మూసీ నీటి విడుదలపై ప్రాజెక్ట్ అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో మూసి నీళ్లు వస్తాయా…? రావా…? అని ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు.
పొలం దున్నుతుండగా డ్రైవర్ పక్కన కూర్చున్న ఓ బాలుడు ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన ఘటన రామన్నపేట మండలం మునిపంపులలో జరిగింది. గ్రామానికి చెందిన వనం గణేష్ (7) అనే బాలుడు తన బాబాయ్ ట్రాక్టర్తో పొలం దున్నుతుండగా తన బాబాయ్ పక్కన కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద జారి పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
NLGజిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ధరణి సమస్యలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక చొరవ తీసుకుని 13 రోజుల వ్యవధిలోనే 2,120 దరఖాస్తులు పరిష్కరించింది. పెండింగ్లో 21,693 దరఖాస్తులు ఉన్నాయి. ఇందులో తహసిల్దార్ల పరిధిలో 11,155, ఆర్డీవోల పరిధిలో 6,122 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.
రేపటి నుంచి నూతన చట్టాలు అమలులోకి రానున్నాయి. ఈ చట్టాల ద్వారా సత్వర న్యాయం అందే అవకాశం ఉంటుంది. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, బెదిరింపులు, చోరీ కేసుల్లో కఠిన శిక్షలు అమలవుతాయి. జడ్జిలు కేసులను రెండు వాయిదాలకు మించి ఎక్కువ రోజులు పొడిగించడానికి వీలుండదు. పోలీస్ శాఖకు పూర్తి అధికారాలు ఉండడంతో కేసు త్వరగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నల్గొండ జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణి జులై 8 నుంచి ప్రతి సోమవారం యథాతథంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చి ఫిర్యాదులు సమర్పించాలనుకునే ఫిర్యాదుదారులు మొదట సంబంధిత మండలాల్లో ఫిర్యాదులు సమర్పించాలన్నారు. అక్కడ 15 రోజులైనా పరిష్కారం కానీ వారు జిల్లా స్థాయికి రావాలన్నారు.
సోమవారం నుంచి నల్గొండ జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం తెలిపారు. ఈ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చి ఫిర్యాదులు సమర్పించాలనుకొనే ఫిర్యాదుదారులు సంబంధిత మండలాలలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలోనే ఫిర్యాదులు సమర్పించాలని స్పష్టం చేశారు.
ధరణి పెండింగ్ సమస్యలను త్వరలో పరిష్కస్తామని, క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, సీసీఎల్ఎ ఇన్ఛార్జి నవీన్ మిట్టల్కు తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో ధరణి సమస్యలు, పరిష్కారాలపై రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సిసిఎల్ఎ ఇంచార్జ్ నవీన్ మిట్టల్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
Sorry, no posts matched your criteria.