Nalgonda

News June 29, 2024

యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం: జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

image

వచ్చే సోమవారం నుంచి నల్గొండ జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చి ఫిర్యాదులు సమర్పించాలనుకొనే ఫిర్యాదు దారులు సంబంధిత మండలాలలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలోనే ఫిర్యాదులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

News June 29, 2024

నంబర్ ప్లేట్లు ట్యాంపర్ చేస్తే కేసు: SP శరత్ చంద్ర పవార్ 

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారం రోజుల్లో నంబర్ ప్లేట్లు లేని 1,769 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ పాల్పడే నేరస్థులు నంబర్ ప్లేట్లు లేని వాహనాలు ఉపయోగిస్తున్నారని తెలిపారు. నంబర్ ప్లేట్లు ట్యాంపర్ చేస్తే వారిపై చీటింగ్ కేసులు నమోదు చేస్తామన్నారు.

News June 29, 2024

మోతిలాల్ నాయక్‌కు మద్దతుగా నల్గొండలో భారీ ర్యాలీ

image

OU లీడర్ మోతిలాల్ నాయక్ నిరుద్యోగుల సమస్యలపై నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ నల్గొండ కేంద్ర గ్రంథాలయం నుంచి క్లాక్ టవర్ వరకు నిరుద్యోగులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రూప్ 2, 3లలో పోస్టులు పెంచి పరీక్షలను డిసెంబర్‌లో నిర్వహించాలని నినాదాలు చేశారు. DSC పోస్టుల పెంపుతో పాటు పరీక్షకు టైం ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ తక్షణమే స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

News June 29, 2024

ఉత్తమంగా నల్గొండ మహిళా కాలేజీ

image

నల్గొండ మహిళా డిగ్రీ కళాశాలలో చేరేందుకు ఉమ్మడి జిల్లాలోని విద్యార్థినులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏకైక మహిళా కాలేజీ కావడం, అత్యుత్తమ బోధన అందిస్తుండడంతో ఇక్కడ ఎక్కువగా అడ్మిషన్స్ జరుతున్నాయి. కాగా ఈ కాలేజీ 1972లో కేవలం 9 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. నేడు 3వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. ఈ కాలేజీకి గతేడాది న్యాక్ ఏ గ్రేడ్ లభించింది.

News June 29, 2024

NLG: ప్రాదేశిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే!

image

ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రాదేశిక ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీకాలం కొద్ది రోజులే ఉండటంతో ఇంతలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. జులై 4న జిల్లా, మండల పరిషత్ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్ల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వారిని కొనసాగిస్తారా? లేక ప్రత్యేక అధికారులకు బాధ్యతను అప్పగిస్తారా అనే విషయం సందిగ్ధంగా మారింది.

News June 29, 2024

నల్గొండ జిల్లాలో పడిపోతున్న బీఆర్‌ఎస్..!

image

బీఆర్‌ఎస్ బలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంతకంతకూ పడిపోతోంది. ఐదేళ్ల క్రితం జరిగిన సర్పంచ్, MPTC, ZPTCఎన్నికల్లో అత్యధికం BRS కైవసం చేసుకుంది. పురపాలిక ఎన్నికల్లోనూ 19 పురపాలికల్లో అన్నింట్లోనూ ఆ పార్టీకి చెందిన వారే ఛైర్మన్‌లుగా గెలిచారు. 3 ZPలను సైతం కైవసం చేసుకుంది. ప్రస్తుతం కేవలం SRPT, NKL, పోచంపల్లి, చండూరులో మాత్రమే BRS‌కుచెందిన వారు ఛైర్మన్‌లుగా ఉండగా..మిగతా చోట్లా కాంగ్రెస్‌ వారు ఉన్నారు.

News June 29, 2024

సూర్యాపేట: అబార్షన్ ఘటనలో ఏడుగురిపై కేసు

image

చివ్వెంల మండలం ఎంజీనగర్‌ తండాకు చెందిన 7 నెలల గర్భిణి సుహాసిని మృతికి కారకులైన ఆమె భర్త హరిసింగ్‌తోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. మూడో కాన్పులో గర్భణి అయిన ఆమెకు భర్త లింగనిర్ధారణ పరీక్షలు చేయించి.. పుట్టబోయేది ఆడబిడ్డగా తెలుసుకొని హుజూర్‌నగర్‌ కమల ఆసుపత్రిలో గర్భవిచ్ఛిత్తి చేయించాడు. దీంతో చికిత్స వికటించి ఆమె మృతి చెందింది.

News June 29, 2024

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి, ధరణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా సమస్యలకు పరిష్కరం దొరుకుతుందన్నారు. శుక్రవారం ఆయన చందంపేట తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 266 ఫిర్యాదులు స్వీకరించినట్లు తహశీల్దార్ శ్రీనివాస్ తెలిపారు.

News June 28, 2024

ఉప్పల్‌లో నల్గొండ జిల్లా నిరుద్యోగి సూసైడ్

image

ఉద్యోగం రాకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD ఉప్పల్ PS పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి వాసి వెంకట రాముడు(21) HYDకు ఉద్యోగం కోసం వచ్చాడు. ఎంత తిరిగినా జాబ్ రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో రామాంతాపూర్‌లోని తన బావమరిది సాయికిరణ్ ఇంటికి వచ్చి తండ్రికి ఫోన్ చేశాడు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపి చనిపోయాడు.

News June 28, 2024

నల్గొండ ఎస్పీని కలిసిన ట్రాన్స్ జెండర్స్

image

నల్గొండ జిల్లా ఎస్పీ శరద్ చంద్ర పవార్‌ను ట్రాన్స్ జెండర్స్ కలిశారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు నందిని మాట్లాడారు. ‘నల్గొండలోని శ్రీనగర్ కాలనీ రోడ్ నంబర్ 8లో గుంటన్నర స్థలం కొన్నాం. ఆ స్థలంలో ఇల్లు కట్టుకుందామంటే స్థానికులు అడ్డుకుంటున్నారు’ అని చెప్పారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరామన్నారు.