Nalgonda

News July 27, 2024

భువనగిరి: లేడీస్‌ టాయిలెట్‌‌లో దుండగుడు.. దేహశుద్ధి

image

భువనగిరి బస్టాండ్‌లో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళల మరుగుదొడ్ల స్లాబ్ పైకి ఎక్కి తొంగి చూశాడు. టాయిలెట్‌కు వెళ్లిన మహిళా కండక్టర్ అతడిని గమనించి, స్థానికులను అప్రమత్తం చేసింది. దుండగుడిని కిందకు లాగిన స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

News July 27, 2024

నల్గొండ: పెరుగుతున్న సర్పంచుల ఆశావహులు

image

గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధమయ్యారు. నల్గొండ జిల్లాలో 844, యాదాద్రి జిల్లాలో 421, సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలున్నాయి. తాజా మాజీ సర్పంచులతోపాటు గత ఎన్నికల్లో ఓడిపోయిన వారు సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు.

News July 27, 2024

నాగార్జున సాగర్‌కు పెరుగుతున్న వరద ప్రవాహం

image

నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 52,199 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 6,282 క్యూసెక్కులు ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 506.60 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312.04టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 125.97 టీఎంసీలుగా ఉంది.

News July 27, 2024

ప్రభుత్వ చౌక ధర దుకాణాలకు బియ్యం సరఫరా

image

జిల్లాలో అన్ని ప్రభుత్వ చౌకధర దుకాణాలకు ఆగస్టు నెల కోటా బియ్యాన్ని ఈనెల 31 వరకు సరఫరా చేయాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. పట్టణంలోని మండల గోదాంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అన్ని చౌకధర దుకాణాల్లో కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలన్నారు. ఆగస్టు నెలకు జిల్లాకు 6836.36 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించారన్నారు.

News July 27, 2024

NLG: రూ.1.50 లక్షలకు పంట రుణపరిమితి పెంపు

image

ఉమ్మడి జిల్లాలోని సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాల పరిమితిని రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచినట్లు డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నల్గొండ డీసీసీబీ బ్యాంకులో మేనేజ్ మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. తీర్మానం జీవోలు జారీ చేయగా వాటిని డీసీసీబీ ఛైర్మన్ అధికారులతో కలిసి విడుదల చేశారు. నాబార్డు డీడీఎం సత్యనారాయణ, డీసీఓలు తదితరులు పాల్గొన్నారు.

News July 27, 2024

NLG: గుత్తేదారులు ముందుకు రావట్లే !

image

ఉమ్మడి జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం పుట్టిన విషయం తెలిసిందే. జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు టెండర్లను ఆహ్వానించారు.. ఈ నెల 10 నుంచి 23 వరకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఒక్కరు కూడా టెండర్లు వేసేందుకు ముందుకురాలేదు.

News July 27, 2024

నల్గొండ, సూర్యాపేటను మించిన యాదాద్రి జిల్లా 

image

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. మరోవైపు NLG, SRPT, యాదాద్రి జిల్లాల్లోని ప్రజల్లో సగటు భూమి యాదాద్రిలోనే అత్యధికం కావడం విశేషం. మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలో ప్రజల తలసరి ఆదాయం క్రమంగా పెరుగుతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2024లో వెల్లడించింది.

News July 27, 2024

NLG: ఆయకట్టులో చిగురిస్తున్న ఆశలు!

image

నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది జలకళను సంతరించుకుంది. సాగర్ ఎగువన ఉన్న ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాల నుంచి శ్రీశైలానికి వరద వస్తోంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 860.40 అడుగులుగా ఉంది. రెండు రోజుల్లో శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

News July 26, 2024

నల్గొండ: కూలీలతో కలిసి నాటు వేసిన ఎమ్మెల్యే 

image

విమర్శలు, ప్రతీ విమర్శలు, నియోజకవర్గ అభివృద్ధి పనులంటూ బిజీగా ఉండే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూలీలతో మమేకయ్యారు. వారితో కలిసి నాటు వేశారు. రుణమాఫీ అయిందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తమతో కలిసి నాట్లు వేయడం సంతోషంగా ఉందని కూలీలు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని బీఎల్ఆర్ తెలిపారు.

News July 26, 2024

చిన్నారులపై పెరిగిన లైంగిక వేధింపులు: ఎంపీ చామల

image

దేశంలో చిన్నారులపై లైంగిక వేధింపులు పెరిగాయని లోక్‌సభ భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారుల సంక్షేమంలో 176 దేశాల్లో 113వ స్థానంలో భారత్
నిలవడం శోచనీయమని పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించగా, దీనిపై కేంద్రమంత్రి అన్నపూర్ణ
దేవి స్పందిస్తూ మిషన్ వాత్సల్య యోజన ద్వారా దేశంలో చిన్నారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు.