Nalgonda

News November 15, 2024

వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ త్రిపాఠి సమీక్ష

image

వైద్య ఆరోగ్యశాఖ తరఫున ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. గురువారం తన చాంబర్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రితో పాటు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఇమ్మునైజేషన్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.

News November 15, 2024

గ్రూప్-3 పరీక్షకు 88 కేంద్రాలు ఏర్పాటు: జేసీ శ్రీనివాస్

image

ఈనెల 17, 18 రెండు రోజులు గ్రూప్-3 పరీక్షలు ఉంటాయని, జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ పట్టణాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జేసీ శ్రీనివాస్ తెలిపారు. నల్గొండలో 60, మిర్యాలగూడలో 28, మొత్తం 88 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 28,353 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఆయన చెప్పారు. 17వ తేదీ పేపర్ -1 ఉదయం 10 గంటలకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.

News November 14, 2024

చండూరు అమ్మాయికి అమెరికా అందాల పోటీలో అవార్డు

image

చండూరుకి చెందిన ప్రవాస భారతీయురాలు బావండ్ల రిషితకు మిస్ ఫిలాంత్రఫీ యూనివర్స్ 2024-2025 అవార్డు లభించింది. ఈ నెల 11న అవార్డు అందుకున్నట్లు ఆమె తండ్రి మాణిక్యం తెలిపారు. బావంద్ల రామ లచ్చయ్య, సత్యమ్మ దంపతుల మూడో కుమారుడే బావండ్ల మాణిక్యం. 14 సంవత్సరాల క్రితం అమెరికాకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

News November 14, 2024

నల్లగొండ: రేపు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం

image

నవంబర్ 15 తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్ఎం M.రాజశేఖర్ గురువారం తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోనీ ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ఏమయినా సూచనలు, సలహాలు లేదా ఏవైనా సమస్యలను తెలియజేయడానికి పైన సూచించిన సమయంలో 08682 223307 నంబర్‌కు డయల్ చేయాలని కోరారు.

News November 14, 2024

నల్గొండ: వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా.. రామన్నగూడెం వాసి రాములు(59) తుంగతుర్తి శివారులో బైక్ ఢీకొట్టడంతో మృతిచెందారు. అటు రంగారెడ్డి జిల్లాకి చెందిన అభిలాశ్(24) చౌటుప్పల్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చనిపోయాడు. తిప్పర్తి (M) మల్లేవారిగూడానికి చెందిన కొండయ్య పొలం పనికి వెళ్తున్న క్రమంలో మిర్యాలగూడ వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో స్పాట్‌లో మృతిచెందాడు.

News November 14, 2024

నల్గొండలో గ్రూప్ -III పరీక్షకు 88 కేంద్రాలు

image

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ -III పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. నల్గొండ జిల్లాలో 28,353 మంది పరీక్ష రాస్తున్నరని వారి కోసం 88 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నేడు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

News November 13, 2024

BREAKING: నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్ 

image

రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని పలువురికి గాయాలైన ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ సహా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News November 13, 2024

సూర్యాపేట: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న టీచర్ SUSPEND

image

విద్యార్థినులతో, మహిళా ఉపాధ్యాయురాలితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిని DEO సస్పెండ్ చేశారు. ఆయన వివరాల ప్రకారం.. ఈనెల 8న సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెం పాఠశాలలో ఉమెన్ డెవలప్‌మెంట్ చైల్డ్ వెల్ఫేర్‌ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గణిత టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని 9, 10వ తరగతి విద్యార్థినులు, ఉపాధ్యాయురాలు తెలపడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News November 12, 2024

నల్గొండ: రైతన్నకు ‘మద్దతు’ ఏది?

image

ఆరుగాలం కష్టపడి పని చేసిన రైతులకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటివరకు NLG, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ధాన్యం క్వింటాకు రూ.2150 నుంచి 2300 వరకే చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. కొనుగోలు ప్రారంభంలో రూ.2500 పైచిలుకు చెల్లించి కొనుగోలు చేసిన మిల్లర్లు.. మార్కెట్లకు ధాన్యం పోటెత్తుతుండడంతో ధాన్యం ధరలు పూర్తిగా తగ్గించు కొనుగోలు చేస్తున్నారని రైతులకు తెలిపారు.

News November 12, 2024

NLG: స్టేట్ లెవెల్‌లో రాణిస్తున్న అక్కా చెల్లెళ్లు

image

సత్యం పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని నడిమి తండాకు చెందిన లావుడి హరి, నీలమ్మ కూతుర్లు గాయత్రి, ప్రియాంక బాస్కెట్ బాల్ పోటీల్లో రాణిస్తున్నారు. నవంబర్ 9 తేదీ మహబూబ్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అండర్ -19 స్టేట్ లెవెల్ బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచారు. మారుమూల తండా నుంచి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరచడం పట్ల కుటుంబ సభ్యులు, తండావాసులు హర్షం వ్యక్తం చేశారు.