India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే గ్రామ సర్పంచులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. త్వరలో మున్సిపాలిటీల పదవీ కాలం కూడా ముగియనున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఇన్ఛార్జిలతో నేనంటే నేను ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ పదవికి పోటీ చేస్తానని చెప్పుకుంటున్నారు. వేచి చూడాలి మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో..?

కులగణన తర్వాత స్థానిక ఎన్నికలుంటాయని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీల నేతలు ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పార్టీపరంగా సానుభూతిపరులెవరు? తమకు ఎవరు మద్దతిస్తారు..? తటస్థులు ఎంత మంది? అని విచారిస్తున్నారు. కుల సంఘాలను సంప్రదించడం ద్వారా ఎన్ని ఓట్లను రాబట్టుకోగలం..? అన్న లెక్కల్లో పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1740 జీపీలు ఉన్నాయి.

లేబర్ కార్డు కలిగిన 45 ఏళ్ల వయస్సు కలిగిన వారికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో 15 రోజుల ఉచిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రమేశ్ కుమార్ తెలిపారు. శిక్షణ సమయంలో రోజుకు రూ.300 ఉపకారవేతనంతో పాటు మధ్యాహ్నం భోజనం, టీ షర్ట్, బ్యాగ్, సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలవారు నల్గొండ ప్రకాశం బజార్ లోని న్యాక్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో ఇటీవల వరుసగా మరణాలు సంభవించాయి. అనారోగ్యంతో కొంతమంది, రోడ్డు ప్రమాదంలో మరికొందరు, వయసు మళ్లిన వారు వరుసగా మృత్యువాత పడ్డారు. గ్రామానికి కీడు దాపరించడంతోనే ఈ అనర్థాలు జరుగుతున్నాయని భావించిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కీడు పోవాలంటే సూర్యోదయానికి ముందే పిల్లా పెద్దలతో సహా ఊరంతా ఖాళీ చేసి సూర్యాస్తమయం వరకు బయట ఉండాలని నిర్ణయించారు.

రైలు కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన గురువారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం మండలం ఆల్వాలపాడు గ్రామానికి చెందిన చిర్ర శ్రవణ్ (16) అనే యువకుడిగా గుర్తించినట్లు తెలిపారు. ఆత్మహత్య కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని పాతర్ల పహాడ్, ఇస్తాలపురం, గట్టికల్ గ్రామాల్లో మద్యం అమ్మితే రూ.20 వేలు జరిమానా విధించనున్నట్లు గ్రామస్థులు హెచ్చరికలు జారీ చేశారు. జరిమానా వివరాలు ఫ్లెక్సీలో పొందుపరిచి గ్రామంలో ఏర్పాటు చేశారు. ఎవరైనా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందిస్తే వారికి రూ.2వేలు ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూరగాయల ధరలు ఇంకా దిగిరావట్లేదు. రెండు వారాలుగా కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కూరగాయలు కొనాలంటేనే సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. కొన్ని కూరగాయల ధరలు ఇప్పటికే కేజీ రూ.100కు పైగా పలుకుతున్నాయి. జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి కూరగాయల రేట్లు కళ్లెం వేయాలని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

మాడుగులపల్లి మండలం నారాయణపురం వద్ద దారుణ హత్య జరిగింది. ఆస్తి తగాదాలతో కొండయ్య (60) అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

∆} పలు శాఖల అధికారులతో సూర్యాపేట, నల్గొండ జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పర్యటన ∆} దేవరకొండలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} మట్టపల్లి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} నల్గొండలో మంత్రి వెంకటరెడ్డి పర్యటన ∆} నాగార్జునసాగర్ కొనసాగుతున్న వరద ఉద్ధృతి

నల్గొండ జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు 375 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 152 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని, వారం చివరి వరకు అన్ని కేంద్రాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలలో తేమ కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు, లారీలు, హమాలీల వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.