Nalgonda

News June 28, 2024

ఆర్అండ్బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

image

ఆర్అండ్బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా రోడ్లు, బ్రిడ్జి పనుల పురోగతిపై చర్చించారు. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ హైవేపై వున్న రామక్రిష్ణాపురం, సింగన్నగూడెం, కొండమడుగుతో పాటు విజయవాడ హైవేలోని అండర్ పాస్‌లను పూర్తిచేయాలన్నారు. 

News June 28, 2024

విషమంగా మోతిలాల్ నాయక్ ఆరోగ్యం

image

గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరహార దీక్ష కొనసాగిస్తున్న సూర్యాపేట జిల్లాకు చెందిన విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయక్ ఆరోగ్య పరిస్థితిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ఐదు రోజుల క్రితం మోతిలాల్ నిరుద్యోగుల సమస్యలపై ఆమరణ నిరహార దీక్ష ప్రారంభించిన విషయం విదితమే. పలువురు ప్రముఖులు మోతిలాల్‌కు ఇప్పటికే మద్దతు తెలిపారు. కాగా గ్రూప్ 2,3 పోస్టులు పెంచాలని మోతీలాల్ నాయక్ డిమాండ్ చేస్తున్నారు.

News June 28, 2024

NLG: పంచాయతీ కార్మికుల వేతన వెతలు

image

గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. నెల నెలా సరిగ్గా వేతనాలు అందక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 1,740 గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ పారిశుద్ధ్య కార్మికులతోపాటు ట్రాక్టర్ డ్రైవర్లు, వాటర్ మెన్లు, ఇతర సిబ్బంది మొత్తం 2578 మంది పని చేస్తున్నారు. ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు.

News June 28, 2024

సూర్యాపేట: వ్యక్తిపై 50 కోతుల దాడి, తీవ్ర గాయాలు

image

మఠంపల్లి మండల పరిధిలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై సుమారుగా 50 కోతులు మూకుమ్మడిగా దాడి చేయగా వ్యక్తి తీవ్ర గాయాలై ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.

News June 28, 2024

నల్గొండ: DCCB ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా దయాకర్ రెడ్డి

image

నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ (DCCB) ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఏసీ రెడ్డి దయాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాసం నేడు నెగ్గింది. దీంతో కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకునే వరకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న దయాకర్ రెడ్డిని ఛైర్మన్‌గా నియమించారు. మరో రెండు, మూడు రోజుల్లో కుంభం శ్రీనివాస్ రెడ్డిని ఛైర్మన్‌గా ఎన్నుకోనున్నారు.

News June 28, 2024

NLG: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

image

నల్గొండలోని NG కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. ఉపేందర్ తెలిపారు. తెలుగు-2, వాణిజ్యశాస్త్రం-3, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-3′ కంప్యూటర్ సైన్స్\అప్లికేషన్స్-6, డాటా సైన్స్-1 గణితశాస్త్రం-2, స్టాటస్టిక్స్-1, బయోటెక్నాలజీ-1 సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News June 28, 2024

నల్గొండ: మహిళా సంఘాలకు మీ సేవ కేంద్రాలు!

image

స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో స్త్రీ శక్తి క్యాంటీన్లను మహిళా సంఘాలకు అప్పగించిన ప్రభుత్వం.. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో మీ సేవ కేంద్రాలను కూడా మహిళా సంఘాలకు అప్పగించనుంది. దీంతో నల్గొండ జిల్లాలోని 33 మండలాల పరిధిలో 103 మీ సేవ కేంద్రాలను మంజూరు చేసింది. వీటిని గ్రామ మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించనుంది.

News June 28, 2024

సూర్యాపేట జిల్లాలో మరో ఎత్తిపోతల పథకం!

image

సూర్యాపేట జిల్లాలో మరో సాగునీటి ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకోనుంది. ఈ పథకం ద్వారా 10,233 ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులు సర్వే పనులు చేపట్టారు. చింతలపాలెం మండలం బుగ్గమాదారం వద్ద ఎత్తిపోతల నిర్మాణానికి రూ.415.5 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు.

News June 28, 2024

NLG: జీరో బిల్లు, గ్యాస్ రాయితీ కోసం ఎదురుచూపు!

image

ఉమ్మడి జిల్లాలో జీరో విద్యుత్ బిల్లు, గ్యాస్ రాయితీకి లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. చాలామందికి రూ.500 గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వర్తించడం లేదు. SRPT జిల్లాలో 1,49,887, నల్గొండ జిల్లాలో 1,91,053, యాదాద్రి జిల్లాలో 1,26,431 మంది లబ్ధిదారులు గృహజ్యోతి లబ్ధి పొందుతున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో సుమారు 40 వేల మంది లబ్ధిదారులు గృహజ్యోతి, జీరో బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.

News June 28, 2024

తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

image

ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జండగే రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నేడు వారు మోత్కూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి పెండింగ్ దరఖాస్తులను, ధరణి రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ధరణి మాడ్యూల్ సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వారి వెంట తహసీల్దార్ డి.రాంప్రసాద్, రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.