India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తమిళనాడులో రాష్ట్రంలో ఏర్పడ్డ ఫెంగల్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై పడింది. మహబూబ్ నగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ వెదర్ ఏర్పడింది. దీంతో అధికారులు ఈ జిల్లాలలోని ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిడమనూరు మోడల్ స్కూల్లో విద్యార్థినుల పట్ల సోషల్ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఏడవ తరగతి విద్యార్థిని ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు.

సైబర్ నేరగాళ్ల వలలో పడి సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.7.31 లక్షలు పోగొట్టుకున్న ఘటన నల్లగొండ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన బండారు రమాదేవికి ఇటీవల ముంబై పోలీస్ అధికారులమంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె దశలవారీగా రూ.7. 31 లక్షలు ఫోన్ పే ద్వారా చెల్లించింది. ఆ తర్వాత ఆ నంబర్కు రమాదేవి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ మేరకు బాధితురాలు నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈనెల 29 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జిల్లాలో వివిధ రకాల చేయూత, ఆసరా ( వృద్ధాప్య, వికలాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళల పెన్షన్లు) పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెన్షన్లు పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేస్తామని.. పింఛన్దారులు పెన్షన్ మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుంచి తీసుకోవాలని సూచించారు.

MGU కామర్స్ విభాగం అధ్యాపకుడు డా కొసనోజు రవిచంద్ర తెలంగాణలోని నూతనంగా ఏర్పాటైన నాలుగు యూనివర్సిటీల్లో మొట్టమొదటి పోస్ట్ డాక్టోరల్ రీసర్చ్ స్కాలర్ గా చేరడంతో పాటు ఐసీఎస్ఎస్ఆర్ 2024-25 ఫెలోషిప్ కు ఎంపికయ్యారు. రవిచంద్ర తన పీజీ ఎంజీయూలోనే అభ్యసించి, తన గురువు కామర్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. కౌత శ్రీదేవి పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు.

జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళను డిసెంబర్ 5లోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. గురువారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఇలా త్రిపాటితో రివ్యూ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థుల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ అన్నారు. ఇవాళ ఐడిఓసి సమావేశ మందిరం నందు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫ్రీ పోస్ట్ మెట్రిక్యులేషన్ హాస్టల్స్ సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వసతి గృహాల సంక్షేమ అధికారులు స్థానికంగా ఉంటూ సమస్యలు లేకుండా పరిష్కరించాలని అన్నారు.

ఈ నెల 28 (గురువారం) నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని మహాత్మా గాంధీ యూనివర్సిటీ సీఈవో డా.జి.ఉపేందర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎటువంటి వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. డిగ్రీ పరీక్షలకు విద్యార్థులంతా హాజరుకావాలని కోరారు.

నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్, గుడిపల్లిలను మండల ప్రజాపరిషత్లుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది . కొత్తగా ఈ మండలాలకు ప్రజాపరిషత్ ఆఫీసులు ఏర్పాటు అవుతాయి. త్వరలోనే ఎంపీడీవో, ఎంపీవో, ఇతర సిబ్బంది నియామకం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే జడ్పిటిసి, ఎంపీటీసీ, ఎంపీపీలు రానున్నారు.

మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. నల్గొండ రీజీయన్లో 102 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT
Sorry, no posts matched your criteria.