Nalgonda

News June 27, 2024

మోత్కూర్‌లో రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి

image

మోత్కూర్ మండలం పాలడుగులో రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వలిగొండ మండలం ఎం.తుర్కపల్లికి చెందిన మాసంపల్లి పరశురాములు (40) భార్యాపిల్లలతో కొన్ని నెలల క్రితం మోత్కూర్ వచ్చి ఎస్బీఐ బ్యాంకు సమీపంలో మహారాణి లేడీస్ బట్టల షాపు నడుపుతున్నాడు.

News June 27, 2024

నల్గొండ: టవల్ ఆరేస్తుండగా కరెంట్ షాక్.. ఇద్దరు మృతి

image

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం ఓగోడులో తీవ్ర విషాదం జరిగింది. విద్యుద్ఘాతంతో వీరేందర్, జానయ్య అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దండెంపై టవల్ ఆరేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News June 27, 2024

మునగాల వద్ద రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి

image

మునగాల మండల సమీపంలోని మాధవరం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఎస్సై అంజిరెడ్డి వివరాలిలా.. బైక్, కారు ఢీకొన్న ఘటనలో తిమ్మారెడ్డి గూడెంకి చెందిన నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో HYDకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజిరెడ్డి తెలిపారు.

News June 27, 2024

ఢిల్లీలో ఎంపీలు రఘువీర్, చామల నిరసన

image

నీట్ ఎగ్జామ్‌లో జరిగిన అవకతవకలపై ఢిల్లీలో నల్గొండ, భువనగిరి ఎంపీలు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి నిరసన తెలిపారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News June 27, 2024

NLG: కట్టు తప్పుతున్న కొందరు పోలీసులు

image

జిల్లాలోని కొందరు పోలీసుల తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. వారి వ్యవహార శైలి మొత్తం పోలీసు శాఖకే మచ్చ తెస్తోంది. క్రమశిక్షణతో ఉండాల్సిన ఖాకీలు కట్టు తప్పుతున్నారు. అక్రమార్జనపై దృష్టి పెడుతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు పలు చోట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇది చాలదన్నట్లు ఇంకొందరు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల శాలిగౌరారంలో ఎస్ఐ మహిళపై అనుచితంగా ప్రవర్తించిన ఘటన తెలిసిందే.

News June 27, 2024

భువనగిరి: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన భువనగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో గురువారం చోటుచేసుకుంది. మృతుడు భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఉడత వెంకటేష్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 27, 2024

NLG: ఇక గ్రామ పంచాయతీల్లోనూ ప్రజావాణి

image

గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి నిర్ణయించారు. ప్రతి గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవల వేదిక (విలేజ్ టీం) ఇక్కడ వినతులు స్వీకరించనుంది. ప్రజావాణి నిర్వహణపై గ్రామంలో దండోరా వేయించడంతో పాటు కేబుల్ టీవీల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు.

News June 27, 2024

ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు

image

పుట్టుకతోనే అంధురాలు.. కానీ 6ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది నల్గొండకి చెందిన పాలబిందెల శ్రీపూజిత. చదువు పూర్తి చేసి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. 2022లో తొలి ప్రయత్నంలోనే నల్గొండ జిల్లా కోర్టులో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందింది. ఆ ఉద్యోగం చేస్తూనే.. గురుకుల లెక్చరర్‌ పరీక్షలకు సిద్ధమైంది. ఏప్రిల్‌లో వెల్లడైన గురుకుల ఫలితాల్లో ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించింది.

News June 27, 2024

జూలై 1 లోగా పూర్తి చేయాలి: కలెక్టర్ నారాయణ రెడ్డి

image

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులను జూలై 1 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి విద్యాశాఖ కార్యక్రమాలపై విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను అప్పజెప్పడం జరిగిందని అన్నారు.

News June 26, 2024

శాలిగౌరారం ఎస్‌ఐపై డీజీపీకి ఫిర్యాదు

image

శాలిగౌరారం ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్‌పై డీజీపీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. రిజిస్టర్ పోస్టు ద్వారా డీజీపీకి లేఖ పంపింది. ఫిర్యాదు చేయాడానికి స్టేషన్‌కి వెళితే తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించింది.
తాను ఇప్పటికే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌కు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహరం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.