India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అందరి సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. ప్రపంచ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో మాదకద్రవ్యాలకు యువత బానిసై జీవితాలను కోల్పోతున్న తరుణంలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
భార్య మృతికి కారణమైన భర్తను భువనగిరి ప్రధాన అసిస్టెంట్ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. నిందితుడికి ఐదేళ్ల శిక్షతోపాటు 2వేల జరిమాన విధిస్తూ జడ్జి వి.మాధవిలత మంగళవారం తీర్పు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లికి చెందిన వెంకటేశ్కు రాయగిరికి చెందిన శారదతో కొంతకాలం వివాహమైంది. అదనపు కట్నం కోసం వేధించగా మనస్తాపంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.
జిల్లాలో మళ్లీ క్రైమ్ రేట్ పెరుగుతుంది. హత్యలు, దొంగతనాలు జాతీయ రహదారిపై దోపిడీలతో కొంతకాలంగా ప్రజలు భద్రత గాల్లో దీపంలా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. పట్టపగలే దొంగతనాలు జరుగుతున్నా.. రాత్రిపూట జాతీయ రహదారిపై దోపిడీలు జరుగుతున్నా పోలీసులు కనీస చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల NKP మండలం ఏపీ లింగోటం వద్ద, చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద దారి దోపిడీలు జరిగాయి.
మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి స్వయం సహాయక సంఘాలు చెల్లించిన రుణాలకు వడ్డీని తిరిగి వారి ఖాతాలో జమ చేసింది. అందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.273.55 కోట్లను మహిళా సంఘాల ఖాతాల్లో వేశారు. అతివలు ఆర్థికంగా ఎదగడానికి స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా ఏటా ప్రణాళిక ప్రకారం రుణాలు అందిస్తుంది.
ఉమ్మడి జిల్లాలో రాను రాను చిరుధాన్యాల సాగు తగ్గిపోతున్నది. కందులు మినహా ఇతర పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. సాగు లాభదాయకంగా ఉన్నా సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడం, మార్కెట్లలోనూ మద్దతు లేకపోవడం తదితర కారణాల వల్ల రైతులు వీటివైపు మొగ్గు చూపడం లేదని తెలుస్తుంది. ప్రస్తుత రబీ సీజన్లో ఉమ్మడి జిల్లాలో కందులు 3940, ఇతర పప్పు దినుసులు 1578 ఎకరాల్లో మాత్రమే సాగు చేనున్నట్లు అధికారులు తెలిపారు.
బోర్వెల్ లారీ పైనుంచి పడి కార్మికుడు మృతి చెందిన ఘటన మిర్యాలగూడలో జరిగింది. ఎస్సై నరేష్ వివరాల ప్రకారం.. చత్తీస్గఢ్కు చెందిన బోటి రామ్ భగేల్ చింతపల్లిలో నివాసం ఉంటూ బోర్వెల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బోర్ వేయడానికి వెళ్తుండగా లారీ పైనుంచి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అన్న భువనేశ్వర్ భగేల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నకిలి బంగారంతో రూ.53.89 లక్షల రుణం తీసుకున్న ఏడుగురు నిందితులను, సహకరించిన గోల్డ్ అప్రజయిర్ను హుజూర్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్డుకు రిమాండ్ చేశారు. సీఐ చరమంద రాజు తెలిపిన వివరాలిలా.. నేరేడుచర్ల మండలం వైకుంఠపురానికి రాజేశ్ మిర్యాలగూడలో బంగారం దుకాణాన్ని పెట్టాడు. నష్టం రావడంతో అప్పులు తీర్చేందుకు నకిలీ ఆభరణాలు తయారు చేయించి మిత్రులతో కలిసి భారీ మొత్తంలో లోన్ తీసుకున్నాడు.
ఢిల్లీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. తెలంగాణ బిడ్డ కేంద్ర మంత్రిగా పదవి చేపట్టిన సందర్భంగా పార్టీలకు అతీతంగా సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సత్కరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రిని వారు కోరారు.
నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు మంగళవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.30 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 122.1967 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్లో 800 క్యూసెక్కులుగా ఉంది.
పొడి దుక్కుల్లో విత్తనాలు వేసిన రైతుల ఆశలు మొలకెత్తుతున్నాయి. మొలిచిన పత్తి మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. సోమవారం 16 మండలాల్లో 2.0 మి.మీ వర్షం కురిసింది. 4 రోజులుగా నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో పంటల సాగుకు అనుకూలమైన వర్షం పడటంతో పత్తి విత్తనాలు వేసిన రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ వ్యవసాయ శాఖ అంచనా మేర 2 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు.
Sorry, no posts matched your criteria.