Nalgonda

News June 25, 2024

NLG: డబ్బు రెట్టింపు చేస్తామని దగా

image

డబ్బు రెట్టింపు చేస్తామని ఓ వ్యక్తిని సొంత బంధువులే మోసం చేశారు. NLG మండలం చందనపల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు చారిని అతడి సమీప బంధువులు నమ్మించారు. ఇది నమ్మిన చారి వారికి మొదటగా రూ.2 లక్షలు ఇస్తే వారు రూ.4లక్షలు తిరిగి ఇచ్చారు. దీంతో ఆర్ఎంపీ వైద్యుడు వారికి రూ.33లక్షలు ఇవ్వగా.. రూ.66 లక్షలు ఇస్తామని చెప్పి రెండు అసలు నోట్ల మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి ఇచ్చారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News June 25, 2024

MLG: అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్

image

మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డిఎస్పి రాజశేఖర్ రాజు వివరాలు.. మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్‌కు చెందిన అశోక్ ఓ గిరిజన మహిళపై గత కొద్దిరోజులుగా భయపెట్టి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అంతే కాకుండా వీడియోలు తీసి ఆమె భర్తకు పంపిస్తానని బెదిరిస్తుండటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News June 25, 2024

హైదరాబాద్- విజయవాడ రహదారిని త్వరగా పూర్తి చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

image

ఢిల్లీలో కేంద్ర జాతీయ రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కారణంగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్- విజయవాడ ఆరు లైన్ల జాతీయ రహదారి పనులను పునర్ ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.

News June 25, 2024

BNGR: కుటుంబ కలహాలతో యువకుడు సూసైడ్

image

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామానికి చెందిన మహేష్ వ్యవసాయ కూలీల పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన మహేష్ తన వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొర్రెల కాపరులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News June 25, 2024

NLG: అర్హత ఉన్నా అందని గృహ జ్యోతి పథకం

image

నల్గొండ జిల్లాలో అర్హులందరికీ గృహ జ్యోతి పథకం అందట్లేదు. అర్హత ఉన్నా 200యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ దరఖాస్తుల్లో పొరపాట్లను చూపుతూ అధికారులు వేలాది మందిని గృహజ్యోతికి అనర్హులను చేశారు. ఉచిత విద్యుత్‌కు 2.80లక్షల దరఖాస్తులు చేయగా.. పొరపాట్లతో 2.07లక్షల మందికి వర్తింప చేస్తున్నారు. మొదట రేషన్, ఆధార్ ఆధారంగా దరఖాస్తు చేసుకోమనగా.. పేద, మధ్యతరగతి ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు.

News June 25, 2024

కేంద్రమంత్రి బండి సంజయ్‌తో కోమటిరెడ్డి భేటీ

image

జాతీయ రహదారుల మంజూరులో తెలంగాణకు అగ్రస్థానం లభించేలా ప్రత్యేక చొరవ చూపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. తెలంగాణ బిడ్డ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సోమవారం వారిని మర్యదపూర్వకంగా కలిసి సత్కరించారు. గత పదేండ్ల తెలంగాణ విధ్వంసాన్ని సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వానికి సహాయసహకారాలు అందించాలని కోరారు.

News June 24, 2024

నాగార్జునసాగర్‌లో వ్యక్తి దారుణ హత్య..

image

నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన రెహమాన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. పర్వతనేని నాగేశ్వరరావుకు చెందిన నూతన షాపింగ్ కాంప్లెక్స్‌లో రెహమాన్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అదే కాంప్లెక్స్‌లో శివ పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. రెహమాన్, శివ మధ్య గొడవ జరగగా శివ రెహమాన్ ను హత్య చేసి శవాన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లో పూడ్చి పరారైనట్లు తెలిపారు. 

News June 24, 2024

నల్గొండ: ఇంటర్ సెకండియర్‌ సప్లిమెంటరీ ఫలితాలిలా..

image

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్‌లో నల్గొండ జిల్లాలో 3,994 మంది హాజరవగా2,286 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 57.24గా ఉంది. సూర్యాపేట జిల్లాలో 2,364 మంది పరీక్ష రాయగా 1,448 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.25గా ఉంది. యాదాద్రి జిల్లాలో 1,835మందికి 1043 (56.84) మంది పాసయ్యారు.

News June 24, 2024

నల్గొండ: ఇంటర్ సెకండియర్‌ సప్లిమెంటరీ ఫలితాలిలా..

image

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్‌లో నల్గొండ జిల్లాలో 3,994 మంది హాజరవగా2,286 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 57.24గా ఉంది. సూర్యాపేట జిల్లాలో 2,364 మంది పరీక్ష రాయగా 1,448 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.25గా ఉంది. యాదాద్రి జిల్లాలో 1,835మందికి 1043 (56.84) మంది పాసయ్యారు.

News June 24, 2024

నల్గొండ: ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలిలా..

image

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్ లో నల్గొండ జిల్లాలో 7,459 మంది హాజరవగా 4,962 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 66.52గా ఉంది. సూర్యాపేట జిల్లాలో 4,565 మంది పరీక్ష రాయగా 2,712 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 59.41గా ఉంది. యాదాద్రి జిల్లాలో 3,007మందికి 1969 (65.48%) మంది పాసయ్యారు.