Nalgonda

News June 21, 2024

చెన్నైలోని ఐఐటీలో సీటు సాధించిన పేదింటి విద్యార్థిని

image

చివ్వెంల మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని గుగులోత్ భాగ్య శ్రీ ఐఐటి చెన్నై‌లో సీటు సాధించింది. 2022లో భాగ్యశ్రీ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీటు సాధించింది. పేద కుటుంబంలో పుట్టి కష్ట పడి చదివి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భాగ్యశ్రీని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

News June 21, 2024

NLG: నంబర్ ప్లేట్లు లేని వాహనదారులపై కేసు నమోదు: SP

image

జిల్లాలో వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా నడపవద్దని, ప్రతి రోజూ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనల విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయబడుతాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 551 వాహనాలను పట్టుబడి చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News June 21, 2024

యాదాద్రి: తుమ్మలగూడెం చెరువులో మృతదేహం లభ్యం

image

రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం (తుమ్మల గూడెం) చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు జాలర్లు, వలల సహాయంతో మృతదేహాన్ని బయటకి తీశారు. మృతుడు బ్లూ కలర్ చొక్కా, ధరించి ఉన్నాడు, వయసు సుమారు 35 నుండి 45 సంవత్సరాలు ఉంటుందని స్థానికులు తెలిపారు. హత్యా.? ఆత్మహత్యా.? అని చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 21, 2024

నాగార్జునసాగర్ నీటి నిల్వ సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి మట్టం రోజు రోజుకూ తగ్గుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.40 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 122.3596 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయానికి ఇన్ఫో నిల్ ఉండగా, ఔట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు.

News June 21, 2024

చౌటుప్పల్ వద్ద ఫ్లైఓవర్ 

image

నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి నుండి చౌటుప్పల్ ప్రజలకు తొందర్లోనే ట్రాఫిక్ అలాగే ప్రమాదాల నుంచి ఉపశమనం కలగనుంది. 375 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నిర్మాణానికి వచ్చేనెలలో శంకుస్థాపన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా హైవేకి ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు ని చదును చేసి ఫ్లైఓవర్ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

News June 21, 2024

NLG: జిల్లాలో భూముల విలువ పెంపు!

image

భూముల విలువలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2022లో పెంచిన భూముల రేట్లను మళ్లీ ఇప్పుడు ఆగస్టు 1 నుంచి పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు, ప్రభుత్వం మార్కెట్ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. జిల్లాలో పొటెన్షియల్ ఏరియాను బట్టి ఏ మేరకు భూముల విలువ పెంచవచ్చనే దానిపై భూముల విలువకు సంబంధించిన కమిటీ నిర్ణయాలు తీసుకోనుంది.

News June 21, 2024

NLG: ఉమ్మడి జిల్లాలో డిగ్రీ డీలా..!

image

ఉమ్మడి జిల్లాలో డిగ్రీ కాలేజీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. డిగ్రీ సంప్రదాయ కోర్సుల్లో అడ్మిషన్ తీసుకునేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు . ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన ఈ కాలేజీలు నేడు వెలవెలబోతున్నాయి. MG యూనివర్సిటీ పరిధిలో 62 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో 24 వేల సీట్లు ఉన్నాయి. 2 విడతల్లో దోస్త్ ద్వారా ప్రవేశాల ప్రక్రియ నిర్వహించినా 16 శాతం కూడా అడ్మిషన్లు దాటలేదు.

News June 21, 2024

నల్గొండ: ఏదీ.. రుణ ప్రణాళిక ?

image

వానాకాలం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా బ్యాంకర్లు , అధికారులు ప్రత్యేక ఆర్థిక సంవత్సరంలో వానాకాలం , యాసంగి సీజన్లకు కలిసి పలు రంగాలకు ఇవ్వాల్సిన ఆర్థిక రుణ ప్రణాళిక ఇంకా చేయలేదు. దీంతో సాగు పనులకు అవసరమయ్యే పెట్టుబడుల కోసం అన్నదాతలు ప్రైవేట్ అప్పులకు షావుకారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో రైతులు రుణ ప్రణాళిక విడుదల చేయాలని కోరుకుంటున్నారు.

News June 21, 2024

దామరచర్లలో ఉరి వేసుకుని యువతి సూసైడ్

image

ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దామరచర్లలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. కొత్తగూడెంకు చెందిన దొడ్డా సురేశ్ యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ పాల్వంచకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 21, 2024

మోటకొండురు మండల యువతికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

image

మోటకొండూరు మండలం అమ్మనబోలుకు చెందిన సంధ్య టీజీ పీఈసెట్‌లో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించి ప్రతిభకు పేదరకం అడ్డుకాదని నిరూపించింది. గురువారం విడుదలైన ఫలితాల్లో ఆమె మొదటి స్థానం సాధించింది. భవిష్యత్‌లో పోలీస్ ఉద్యోగం సాధిస్తానని ఆమె చెబుతోంది. ఆమెను తల్లిదండ్రులు, గ్రామస్థులు, వ్యాయామ ఉపాధ్యాయుులు అభినందించారు.