Nalgonda

News June 21, 2024

ఈనెల 27న యాదాద్రి హుండీ లెక్కింపు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ‌ ఆదాయాన్ని ఈనెల 27న లెక్కించనున్నట్లు గురువారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపం హాల్ 2లో ఉదయం 7 గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లతో.. భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News June 20, 2024

NLG: వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడగింపు

image

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ స్పెషల్ కమీషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్లు అయిన జిల్లా కలెక్టర్లు తగుచర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ నెల 30తో ముగిస్తుండగా , గడువు తేదీని SEP 30 వరకు పొడిగించినట్లు తెలిపారు.

News June 20, 2024

NLG: 22న నల్గొండ జడ్పీ సమావేశం

image

ఈనెల 21న నిర్వహించాల్సిన నల్గొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 22న ఉదయం 10.30 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్ రెడ్డి తెలిపారు. 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్నందున జడ్పీ ఛైర్‌పర్సన్ ఆమోదం మేరకు 22న నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News June 20, 2024

నల్గొండ: ITI స్థానంలో ATC.. విదేశాల్లో జాబ్స్

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏడు ఐటీఐల స్థానంలో ఏటీసీ(అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్) లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ ఏటీసీలో ఆరు కోర్సులు ఉండనున్నాయి. ఏటీసీగా మార్చేందుకు ఒక్కోదానికి రూ.34 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 4వేల మందికి లబ్ధి చేకూరనుండగా ఈ కోర్సుల ద్వారా విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

News June 20, 2024

గంజాయి దందాకు అడ్డాగా మిర్యాలగూడ

image

మిర్యాలగూడ గంజాయి దందాకు అడ్డాగా మారింది. టెన్త్, ఇంటర్ చదువుతున్న యువకులు పార్టీల పేరుతో కలుసుకుంటూ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వ్యాపారులు 17 నుంచి 25 ఏళ్ల యువకులే టార్గెట్‌గా చేసుకుని దందా చేస్తున్నారు. మొదట అలవాటు చేసి తర్వాత పెడ్లర్లుగా మారుస్తున్నారు. యువత మత్తుకు బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని డీఎస్పీ రాజశేఖర రాజు చెప్పారు.

News June 20, 2024

అడుగంటుతున్న జలాశయాలు.. ఆందోళనలో అన్నదాతలు

image

సాగర్ జలాశయం పరిధిలో ఆయకట్టు
ప్రాంత రైతుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతేడాదీ జలాశయానికి ఆశించిన రీతిలో నీరు రాకపోవడంతో సాగర్ కుడి, ఎడమ కాలువ పరిధిలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రుతుపవనాలు సరైన సమయానికి వస్తాయని అధికారులు చెబుతున్నా.. వర్షాలు ముఖం చాటేస్తుండడంతో రైతులు టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 590 అడుగులకు 504.90 అడుగుల నీరు నిల్వ ఉంది. 

News June 20, 2024

నల్గొండ: భూముల విలువ పెరగనుంది..

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూముల విలువ పెరగనుంది. జిల్లాలో ఎక్కడ ఎంత ధర ఉండాలన్న దానిపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. అధికారులు వారంరోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం అత్యధికంగా బేబ్రాజ్ మాచారంలో ఎకరం రూ.1.65 కోట్లు ఉండగా, అత్యల్పంగ తుంగతుర్తిలోని అన్నారంలో ఎకరం రూ.3.30 లక్షలుగా ఉంది. ఇతర ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లో మాత్రం ధర విపరీతంగా ఉంది.

News June 20, 2024

రుణమాఫీపై 5,36,726 లక్షల మంది రైతుల ఆశలు

image

రైతుల పంట రుణాలను మాఫీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 5.36 లక్షల మంది రైతులు పంట రుణాలలు తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. AUG 15 నాటికి అర్హులందరికీ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీంతో 5,36,726 లక్షల మంది రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రుణమాఫీని ఒకేసారి చేస్తారా..? విడతల వారీగా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

News June 19, 2024

సికిల్ సెల్ అనీమియా.. సైలెంట్ కిల్లర్: డిఎంహెచ్వో

image

సికిల్ సెల్ అనీమియా అనేది సైలెంట్ కిల్లర్‌గా ఉంటుందని.. దీనిని గుర్తించి చికిత్స తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. NLG కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ప్రపంచ సికిల్ సెల్ రోజును పురస్కరించుకొని సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News June 19, 2024

యాదాద్రిలో సందడి చేసిన అనసూయ

image

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ప్రముఖ సినీ నటి, టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చక పండితులు వేద ఆశీర్వచనం అందించారు. స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఆమెతో సెల్ఫీలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు.