India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యాంటి నార్కోటిక్ బ్యూరో ఇన్ఛార్జిగా పని చేస్తున్న శరత్చంద్ర పవార్ను నల్గొండ జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఈయన ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ అల్లుడు. 2016 ఐపీఎస్ బ్యాచ్లో ఎంపికై మొదటిసారి ములుగు జిల్లా ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా, HYD సెంట్రల్ జోన్ ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం ఉంది. అటు సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్ సింగ్ను నియమించింది.
పోచంపల్లి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉపాధి సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ PSSR లక్ష్మి తెలిపారు. సంస్థలో 6 నెలల కాల పరిమితితో కూడిన ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ సర్వీస్, కంప్యూటర్ హార్డ్వేర్ , సెల్ ఫోన్ తదితర కోర్సులు ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
నల్గొండ జిల్లా ఎస్పీగా శరత్చంద్ర పవార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న చందనదీప్తీ బదిలీపై సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా వెళ్లనున్నారు. అటూ సూర్యాపేట ఎస్పీగా సన్ ప్రీత్సింగ్ బదిలీపై రానున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న రాహుల్ హెగ్డే HYD ట్రాఫిక్ డీసీపీగా బదిలీపై వెళ్లనున్నారు.
నల్గొండ జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను వాడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 12 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 6 కిలోల గంజాయి, రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయిని ఏపీ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.
సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో తుమ్మలపల్లి గ్రామస్థులు దర్నా చేపట్టారు. ఇసుక ట్రాక్టర్ ఢీకొని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఖమ్మం- సూర్యాపేట హైవేపై బైటాయించి ఆందోళన చేస్తున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ధనవంతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం వేసిన నకిలీ నక్సల్స్ ముఠాను గుడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద మూడు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదివారం తన కార్యాలయంలో దేవరకొండ డీఎస్పీ గిరిబాబుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
సూర్యాపేట జిల్లా మోతె మండలంలో రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. SI యాదవేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఉపేందర్(32) మామిళ్లగూడెం నుంచి తుమ్మలపల్లికి వెళ్తున్నాడు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బైక్ను ఢీకొంది. ఈప్రమాదంలో ఉపేందర్ తల ట్రాక్టర్ ఇంజిన్కు తగిలి ఛిద్రమైంది. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కేసు నమోదైంది
కోదాడ నుంచి ఖమ్మం వెళ్లేందుకు బస్టాండులో గంటల తరబడి వేచి ఉన్న ప్రయాణికులు బస్సులు రాకపోవడంతో విసుగు చెంది వేరే బస్సులు బస్టాండ్లోకి రాకుండా ఆందోళన చేశారు. బస్సుల సంఖ్య ఎందుకు పెంచడం లేదంటూ అధికారులను నిలదీశారు. అవసరమైతే మీకు డబ్బులు చెల్లిస్తాం.. బస్సులు పంపించండి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆర్టీసీ డీఎంకు ఫోన్ చేయగా 10 నిమిషాల్లో బస్సు వేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు.
పోచంపల్లి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉపాధి సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ PSSR లక్ష్మి తెలిపారు. సంస్థలో 6 నెలల కాల పరిమితితో కూడిన ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ సర్వీస్, కంప్యూటర్ హార్డ్వేర్ , సెల్ ఫోన్ తదితర కోర్సులు ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామం పరిధిలోని వ్యవసాయ పొలం దగ్గర విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి మండవ నాగేశ్వరరావు( 40) అక్కడికక్కడే మృతి చెందారు. గరిడేపల్లి మండలం తాల్ల మల్కాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు నేరేడుచర్ల మండలం ముకుందపురం సబ్ స్టేషన్లో విద్యుత్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తూ నేరేడుచర్ల పట్టణంలో నివసిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.