India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతిచెందిన ఘటన అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ట్రాక్టర్ రాయిని ఢీకొట్టడంతో డ్రైవర్ లక్ష్మీనారాయణ కింద పడ్డాడు. దీంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లక్ష్మీనారాయణ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బాలబాలికల నిష్పత్తిలో వ్యత్యాసం క్రమంగా పెరుగుతోంది. ఎంసీహెచ్ (మదర్, చైల్డ్ హెల్త్) కిట్ల పంపిణీ ద్వారా సేకరించిన లెక్కల ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా బాలబాలికల నిష్పత్తి సమానంగా లేదు. నల్గొండ జిల్లాలో వెయ్యి మంది బాలురకు 924 మంది బాలికలు, సూర్యాపేటలో 897, యాదాద్రిలో 911 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
నల్గొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా మల్టీజోన్ పరిధిలో 129 మందికి పదోన్నతి లభించింది. 4 రోజుల క్రితం విద్యాశాఖ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టింది. సీనియారిటీ జాబితా ప్రకారం జిల్లాలో 129 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు వచ్చాయి. జిల్లా లో ఖాళీగా ఉన్న 109 పోస్టులకు 87 పోస్టులను జిల్లా నుంచి పదోన్నతులు పొందిన వారికి కేటాయించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని 83 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ అయ్యాయి. పదోన్నతులు ఉత్తర్వులు పొందిన 83 మందిలో 82 మంది గురువారం విధుల్లో చేరారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు విధుల్లో చేరలేదు. జిల్లాలోని 75 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి లభించగా ఇందులో 53 మంది ఎస్ఏలకు జిల్లా పరిధిలోనే పోస్టింగులు దక్కాయి.
హైదరాబాద్ – విజయవాడ హైవేపై దారి దోపిడీలు, హత్యలు, దొంగతనాల సంఖ్య పెరుగుతోంది. రెండు నెలల కాలంలో పలు దోపిడీలు, దొంగతనాలు జరగడంతో రాత్రిపూట ఈ దారిలో ప్రయాణించే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. చౌటుప్పల్లో గతంలో ఇలాంటి ఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. తాజాగా ఏపీ లింగోటం వద్ద లారీని ఆపి డ్రైవర్ ను తాళ్లతో కట్టి నగదు చోరీ చేశారు. గత నెల 18న ఎరసానిగూడెం వద్ద లారీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తన ప్రియురాలి కుమార్తెను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 11న నల్గొండ జిల్లా ఐలాపురంలో 22 నెలల చిన్నారిని హత్య చేసిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డి వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. నవ్య శ్రీ తన ఇద్దరి కుమార్తెలతో కలిసి అరవింద్ రెడ్డితో ఐలాపురంలో నివాసం ఉంటోంది.
గొర్రెల యూనిట్ల కోసం డీడీలు చెల్లించిన లబ్దిదారులు డీడీల వాపస్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని నల్గొండ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న వెంటనే డబ్బులు బ్యాంకు ద్వారా వారి ఖాతాల్లో జమ చేయిస్తామని తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ అనుమతితో 800 మంది లబ్ధిదారులకు డీడీ డబ్బులు జమ చేసే ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు.
పుట్టుకతోనే పోలియో సోకినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా పారా వాలీబాల్ నేషనల్ టీంలో చోటు సాధించాడు రాగుల నరేష్ యాదవ్. ఆయన మేళ్లచెరువు మం. కందిబండ వాసి. 2014, 2015లో 5వ జాతీయ స్థాయి క్రీడల్లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2015, 16, 17లో బెస్ట్ స్పోర్ట్స్ మెన్ అవార్డులను గెలుచుకున్నాడు. తాజాగా చైనాలో జరిగిన క్రీడల్లో టీం రెండో స్థానంలో నిలపడంలో కీలకమయ్యాడు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న ఎడమకాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు మహర్దశ పట్టనుంది. సాగర్ ప్రాజెక్టులో భాగంగా ఎడమ కాల్వ పరిధిలోని ఎగువ భూములకు నీరందించేందుకు 1970లో ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను ప్రారంభించింది. లక్ష ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో ఉమ్మడి జిల్లా పరిధిలో సాగర్ నుంచి నడిగూడెం వరకు పలు దఫాలుగా మొత్తం 54 లిఫ్టులను ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లు ఫీజులు తల్లిదండ్రులకు పెనుభారంగా మారుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు నానాటికీ పెరుగుతున్నాయి. దీనికి తోడు యూనిఫాం, షూస్, బెల్టులు, పుస్తకాల ఫీజుల పేరిట ప్రైవేటు స్కూళ్లు నిలువు దోపిడీ చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇవే కాకుండా మధ్యమధ్యలో ఈవెంట్లు, వేడుకల కోసం చిన్నారులకు ప్రత్యేక దుస్తులకు, క్యాస్టూమ్స్కు మరికొంత మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Sorry, no posts matched your criteria.