Nalgonda

News August 13, 2024

NLG: ఉద్యోగులకు ఇక అటెండెన్స్ యాప్.!

image

సెప్టెంబర్ 1 నుంచి జిల్లా మొదలుకొని గ్రామపంచాయతీ వరకు ఉద్యోగులకు అటెండెన్స్ యాప్‌ను నిర్వహించనున్నామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారులు సమ్మిళిత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా సమయానుకూలంగా పనిచేయాలని కోరారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ.పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ పాల్గొన్నారు.

News August 13, 2024

చౌటుప్పల్‌లో రోడ్డు ప్రమాదం..

image

యాదాద్రి: చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-డీసీఎం ఢీకొని ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News August 13, 2024

నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్లు మూసివేత

image

నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలిపేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం అన్ని గేట్లను మూసి వేశారు. నాగార్జునసాగర్‌ పూర్తి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 588.80 అడుగులుగా ఉంది. అదే విధంగా గరిష్ఠ నీటినిల్వ 312.50 టీఎంసీలు కాగా, ఇప్పుడు 305.46 టీఎంసీలు ఉన్నాయి.

News August 13, 2024

మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా NLG

image

“నేను గంజాయి వాడను” అనే నినాదంతో ఈ నెల 14 నుండి వారం రోజుల పాటు ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా NLGను తీర్చి దిద్దడంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన “మిషన్ పరివర్తన్” కార్యక్రమం కింద సోమవారం కలెక్టరేట్‌లో మీడియా ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

News August 12, 2024

NLG: రాబోయే రెండేళ్లలో SLBC పూర్తి: మంత్రి కోమటిరెడ్డి

image

నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ రక్కసిని కట్టడి చేయడంతో పాటు కరువుతో వ్యవసాయానికి దూరమైన 4 లక్షల ఎకరాలకు సాగునీరు హైదరాబాద్ నగర త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన SLBC టన్నెల్ పనులను రాబోయే 2ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి ఈరోజు ఒహయోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈఓ లాక్ హోంతో కలిసి సందర్శించారు.

News August 12, 2024

NLG: మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తి 3 రోజులు జైలు

image

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చిత్తలూరి సత్యనారాయణకు 3 రోజులు జైలు శిక్ష విధించారు. కోదాడ పట్టణ సిఐ రాము తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ‌కు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతుండగా వాహనాల తనిఖీలో పట్టు పడ్డాడని తెలిపారు. సదరు వ్యక్తి‌పై కేసు నమోదు చేసి న్యాయ స్థానంలో ప్రవేశ పెట్టగా 3 రోజులు జైలు శిక్ష పడినట్లు తెలిపారు.

News August 12, 2024

మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా NLG

image

“నేను గంజాయి వాడను” అనే నినాదంతో ఈ నెల 14 నుండి వారం రోజుల పాటు ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా NLGను తీర్చి దిద్దడంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన “మిషన్ పరివర్తన్” కార్యక్రమం కింద సోమవారం కలెక్టరేట్‌లో మీడియా ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

News August 12, 2024

చిలుకూరు: ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

image

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం చెన్నారి గూడెం గ్రామానికి చెందిన మాతంగి గురవయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఈరోజు ఉదయం ఓ రైతు పొలంలో పురుగు మందు పిచికారీ చేసి ట్రాక్టర్‌పై వస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడగా గురవయ్య మృతి చెందారు. ఆయన మృతితో చెన్నారిగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 12, 2024

మంత్రి పొన్నం ప్రభాకర్‌కి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వినతి పత్రం

image

మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 21 రూట్లలో బస్సులు నడపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కి MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వినతిపత్రం అందించారు. సోమవారం నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చించిన అనంతరం మంత్రిని కలిశారు. అన్ని మండల కేంద్రాలలో బస్టాండ్లను నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని, నియోజకవర్గ వ్యాప్తంగా పబ్లిక్ రవాణా కనెక్టివిటీ గురించి వివరించారు.

News August 12, 2024

సూర్యాపేట: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చిన యువకుడు సాగర్ ఎడమ కాల్వలో పడి గల్లంతైన ఘటన విధితమే. గరిడేపల్లి మండలం వెలిదండలో స్నానం కోసం నాగార్జునసాగర్ ఎడమ కాల్వ వద్దకు వెళ్లాడు. లక్షమల వెంకట్ (21) కాలుజారి కాల్వలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంకట్ ఆచూకి కోసం గజ ఈతగాళ్లతో రాత్రి వరకు గాలించగా ఈరోజు చిలుకూరు మండలంలోని పోలేని గూడెం గ్రామంలో సాగర్ ఎడమ కాలువలో వెంకట్ మృతదేహం లభ్యమైంది.