Nalgonda

News May 29, 2024

NLG: ట్రాక్టర్ బోల్తా పడి బాలుడి మృతి

image

ట్రాక్టర్ బోల్తా పడి బాలుడు మృతి చెందిన ఘటన మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన అన్నం విష్ణువర్ధన్ తన తండ్రి ట్రాక్టర్ నడుపుతుండగా పక్కన కూర్చొన్నాడు. రేగట్టే గ్రామం వైపు వెళుతుండగా కోమటికుంట కట్టపై ట్రాక్టర్ అదుపు తప్పి పొలాల్లో బోల్తా పడిండి. ట్రాక్టర్ కిందపడిన విష్ణువర్ధన్ ఘటనా స్థలంలోనే మరణించాడు.

News May 29, 2024

సూర్యాపేట: ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి

image

హుజూర్‌నగర్ మండలం గోపాలపురం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 29, 2024

Suryapet SP పేరుమీద ఫేక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్

image

ఎస్పీ Suryapet Facebook ప్రొఫైల్‌ను పోలిన రెండు నకిలీ facebook ప్రొఫైల్స్‌ను సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేశారు. వాటి నుంచి వచ్చే మెసేజ్‌లకు, రిక్వెస్ట్‌లకు స్పందించవద్దని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కోరారు. వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని, డబ్బులు పంపించవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేసారు. కేసు నమోదు చేసి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ బుధవారం తెలిపారు.

News May 29, 2024

సూర్యాపేట జిల్లాలో క్షుద్రపూజల కలకలం

image

సూర్యాపేట జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. అనంతగిరి మండలంలో అమీనాబాద్‌లో ఓ పాడుబడ్డ ఇంట్లో ఐదుగురు క్షుద్రపూజలు చేస్తున్నట్లుగా గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

News May 29, 2024

యాదాద్రి: కల్తీ పాల తయారీదారు అరెస్టు

image

కల్తీపాలను తయారు చేస్తూ విక్రయిస్తున్న వ్యక్తిని భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పట్టణ పరిధిలోని ముఖ్తాపూర్‌కు చెందిన సన్న ప్రశాంత్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం ఎస్ఓటీ పోలీసులు పాలు విక్రయించే ఇంటికి వెళ్లి సోదా చేయగా.. 60 లీటర్ల కల్తీపాలు, 250ML హైడ్రోజన్ పెరాక్సైడ్, కిలో పాల పౌడర్ ప్యాకెట్ లభించినట్లు పోలీసులు తెలిపారు.

News May 29, 2024

NLG: ఎమ్మెల్సీ ఓటింగ్ కోసం వచ్చి.. పాముకాటుతో మృతి!

image

పాముకాటుతో యువకుడు మృతిచెందిన ఘటన తిరుమలగిరి (సాగర్) మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జువ్విచెట్టు తండాకు చెందిన సపావత్ శంకర్ HYDలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ పట్టభద్రుల ఉపఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడానికి స్వగ్రామం వచ్చారు. ఇంటి బయట వరండాలో నిద్రిస్తుండగా పాముకాటు వేసింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

News May 29, 2024

నల్గొండ:లారీ, అంబులెన్స్ ఢీ.. రెండు వాహనాలు దగ్ధం

image

నల్గొండ జిల్లా పెద్దఅడిశర్ల పల్లి మండలం నీలంనగర్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ- అంబులెన్స్ ఢీ కొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ- అంబులెన్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 29, 2024

నల్గొండ: 1.27 లక్షల మంది ఓటు వేయలేదు!

image

WGL-KMM- NLG పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్ సోమవారం ముగిసింది. 1.27 లక్షల మంది పట్టభద్రులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 4.63 లక్షల ఓట్లకు 3.36 ఓట్లు పోలయ్యాయి. నల్గొండలో 2021లో 77.68 ఓటింగ్ నమోదుకాగా 2024లో 73.29, సూర్యాపేటలో 2021లో 76.11 ఓటింగ్ నమోదు కాగా 2024లో 73.15, యాదాద్రిలో 2021లో 81.17 ఓటింగ్ నమోదు కాగా 2024లో 78.59 ఓటింగ్ నమోదయ్యింది.

News May 29, 2024

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు: కలెక్టర్ వెంకట్రావు

image

జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ పార్లమెంట్, శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం సూచనల మేరకు ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడకూడా వేడుకల్లో కోడ్ వైలేషన్ కాకుండా చూడాలన్నారు.

News May 29, 2024

జూన్ 1లోపే పూర్తి చేయాలి: వికాస్ రాజ్

image

జూన్ 4న నిర్వహించనున్న ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అన్ని జిల్లాలలో ఏర్పాట్లను జూన్ 1లోపే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుపై మంగళవారం ఆయన HYD నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు , ఎస్పీలు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.