Nalgonda

News August 8, 2024

రుణ మంజూరులో జాప్యం.. రైతన్నలకు ఇక్కట్లు

image

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదనే చందంగా ఉంది జిల్లాలో బ్యాంక్ అధికారుల తీరు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.50 లక్షల లోపు రైతు మాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే బ్యాంక్ అధికారులు రుణమాఫీ అయిన రైతులకు తిరిగి వెంటనే నూతన రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ రైతులకు నూతన రుణాలు అందించడంలో జిల్లాలోని పలు బ్యాంకుల అధికారులు తీవ్ర జాప్యం చేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News August 8, 2024

NLG: కృష్ణమ్మ పరవళ్లు.. పర్యాటకుల సందడి

image

నాగార్జునసాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఆ మనోహర దృశ్యాన్ని సెల్ఫోన్లలో బంధించడంతో పాటు సెల్ఫీలు దిగారు. కొత్త బ్రిడ్జి దగ్గర నుంచి శివాలయం వెంట విద్యుదుత్పత్తి కేంద్రం వరకు పర్యాటకులు బారులుతీరి ప్రకృతి అందాలను తిలకిస్తూ గడిపారు. కాగా సాగర్ జలాశయానికి బుధవారం రాత్రి 9 గంటలకు 3,51,844 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.

News August 8, 2024

‘విద్యార్థులు, టీచర్స్ హాజరు నివేదిక అందజేయాలి’

image

పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తి అనుగుణంగా ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు అందరూ సహకరించాలని, ఉపాధ్యాయులు, విద్యార్థుల రోజువారి హాజరు మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ తెలియజేశారు. బుధవారం కలెక్టరేట్లో మండల విద్యాధికారులు, కోఆర్డినేటర్లు, మండల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రెండో దశ ఏకరూప దుస్తులు విద్యార్థులకు వారం రోజులలో అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News August 7, 2024

నల్గొండ: గుండె పోటుతో మృతి.. నేత్రదానం 

image

ఎర్రబెల్లికి చెందిన కోడి శ్రీరాములు గుండెపోటుతో మరణించగా లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సభ్యులు సంప్రదించగా కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించారు. వైద్యులు డా.హరనాథ్, డా.పుల్లారావు ఈ నేత్రదాన కార్యక్రమం నిర్వహించారు. తాను మృతి చెంది అంధులకు చూపును ప్రసాదించాడని శ్రీరాములును పలువురు ప్రశంసించారు. 

News August 7, 2024

సాగర్ డ్యామ్ సందర్శించిన రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్

image

రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ, CCAL నవీన్ మిట్టల్ నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్యాంను సందర్శించారు. సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి  పారుతున్న నీటిని, సాగర్ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, సీసీఎల్ఏ కార్యాలయ అధికారి లచ్చిరెడ్డి, ధరణి కమిటీ రాష్ట్ర సభ్యులు భూమి సునీల్, డీఎఫ్ఓ రాజశేఖర్ ఉన్నారు.

News August 7, 2024

దరఖాస్తులకు మరో రెండు రోజులు గడువు!

image

నేతన్న బీమా పథకానికి ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌళిశాఖ ఏడీ ఎస్.ద్వారక్ ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత, మర మగ్గాలు వాటి అనుబంధ కార్మికులు 18 నుంచి 59 ఏళ్లలోపు వారు పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఈ పథకంలో నమోదైన కార్మికులు ఏదైనా కారణంతో మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా వస్తుందని తెలిపారు.

News August 6, 2024

నాగార్జున సాగర్‌కు ప్రత్యేక బస్సులు

image

నాగార్జునసాగర్ గేట్లు తెరవడంతో ప్రాజెక్ట్‌ అందాలను చూసేందుకు వెళ్లే పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ MGBS బస్టాండ్ నుంచి నేరుగా సాగర్‌కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ సర్వీసులు ఉదయం 5, 6.45, 7.15, 7.30, 8, 9.45, 10.45 గంటలకు.. తర్వాత మధ్యాహ్నం 2.30, సాయంత్రం 5, 5.40 గంటలకు డీలక్స్ బస్సులు MGBS బస్టేషన్ నుంచి నేరుగా సాగర్‌కు వెళ్తాయని అధికారులు తెలిపారు.

News August 6, 2024

జయశంకర్ సార్ ఆశయాలకు తెలంగాణ కట్టుబడి ఉంది: ఎంపీ చామల

image

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలను తెలంగాణ ప్రజలు స్మరించుకుంటారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని వారి సేవలను ఎంపీ గుర్తు చేసుకున్నారు, తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం తపించి, రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అన్నారు.

News August 6, 2024

SRPT: ఒకేసారి అన్నా చెల్లికి ప్రభుత్వ ఉద్యోగాలు

image

అన్నా చెల్లెలు ఒకే సారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులతో పాటు బంధువులను ఆనందోత్సవాలతో ముంచారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సమ్మెట విజయ్‌ కుమార్‌, రేణుక ఎల్లమ్మల కుమారుడు రాహుల్‌ గౌడ్‌, కుమార్తె ఐశ్వర్య ఉన్నారు. వీరు ఇటీవల వెలువడిన ఫలితాలలో రాహుల్ పంచాయతీ రాజ్‌లో ఏఈఈ, ఐశ్వర్య పబ్లిక్ హెల్త్‌లో ఏఈఈ ఉద్యోగం పొందారు.

News August 6, 2024

రెండు పంటలకు సాగునీరు : కలెక్టర్

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది పూర్తిస్థాయిలో 2 పంటలకు సాగునీరు అందిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి రిజర్వాయర్ నీటి సామర్థ్యానికి చేరువలో ఉన్నందున సోమవారం ఆయన ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను తెరిచి సాగునీటిని దిగువకు వదిలివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 584 అడుగుల మేర నీరు ఉందని, 14 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.