India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

యువతిపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న శివాజీ రెడ్డిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి యువతి(24)పై అత్యాచారం జరిగింది. ప్రధాన నిందితుడైన గౌతంరెడ్డి మంగళవారం రాత్రి అరెస్టయ్యాడు. మరో నిందితుడైన శివాజీ రెడ్డి గుంటూరుకు పారిపోయాడు. గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. శివాజీ రెడ్డి స్వగ్రామం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని ఆరెగూడెం.

యువతిపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న శివాజీ రెడ్డిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి యువతి(24)పై అత్యాచారం జరిగింది. ప్రధాన నిందితుడైన గౌతంరెడ్డి మంగళవారం రాత్రి అరెస్టయ్యాడు. మరో నిందితుడైన శివాజీ రెడ్డి గుంటూరుకు పారిపోయాడు. గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. శివాజీ రెడ్డి స్వగ్రామం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని ఆరెగూడెం.

నాగార్జునసాగర్ జలాశయానికి భారీ ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయానికి 3,88,878 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా ఔట్ ఫ్లో 28,878 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 546 అడుగులుగా ఉంది. నీటి నిలువ సామర్థ్యం 312.50టీఎంసీలు కాగా, ప్రస్తుతం 201.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాలుగు రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది.

HYDలో సీఎం రేవంత్ రెడ్డితో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల సమావేశం ఇవాళ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి జిల్లా నుండి ఉపాధ్యాయులను ప్రత్యేక బస్సుల్లో తరలించేందుకు ఏర్పాటు చేసి CPL వ్యవసాయ మార్కెట్లో భోజన వసతి కల్పించారు. అయితే జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వేల మందికి ఇక్కడ ఒకే కౌంటర్ ద్వారా భోజనం వడ్డించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొని ఇబ్బందులు పడ్డారు.

నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో శుక్రవారం తెల్లవారుజామున మర్డర్ కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలోని రెబ్బ జానకమ్మ(72)అనే మహిళను ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎల్ఆర్ఎస్కు ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉండగా అందులో నందికొండ మినహా మిగతా మున్సిపాలిటీలలో ఎల్ఆర్ఎస్కు 2,05,494 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుకు రూ.వెయ్యి చొప్పున ఫీజు వసూలు చేశారు. దీంతో ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలోనే 20 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.

విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు సంబంధించిన ఫిర్యాదులు గణనీయంగా తగ్గాయని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. 2023 జనవరి-జూన్ మధ్య కాలంలో 5,83,672 ఫిర్యాదులు రాగా, ఈ ఏడాది ఇదే కాలవ్యవధిలో 3,97,934 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 31.82 శాతం ఫిర్యాదు తగ్గినట్టు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా 35949 ఫిర్యాదులు వచ్చాయి.

మిర్యాలగూడకి చెందిన అయేషా ప్రముఖ సంస్థంలో ఏడాదికి రూ.34లక్షల వేతనంతో సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఆమె నాగ్పూర్ ఐఐటీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతోంది. తండ్రి నుస్రత్ అలీ మిర్యాలగూడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కాగా తల్లి అజ్మత్ గృహిణీ. అయేషా ప్రాథమిక విద్య మిర్యాలగూడలో పూర్తి చేసింది. అయేషాను కుటుంబ సభ్యులు, బంధువులు అభినందించారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 544.60 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుండగా ప్రస్తుతం 198.04 టీఎంసీలు ఉంది. ఇన్ ఫ్లో: 3,27,969 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో: 30,747 క్యూసెక్కులుగా ఉంది.

నాగార్జునసాగర్ జలాశయానికి 3.69 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.65 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున ఇవాళ సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.