Nalgonda

News May 22, 2024

సూర్యాపేట: భార్యతో గొడవ.. ట్రాన్స్‌ఫార్మర్‌ పట్టుకుని సూసైడ్

image

భార్యతో గొడవ పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మోతె మండలం ఊర్లుగొండ గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొమరయ్య, రమా భార్యాభర్తలు. మే 15న భర్తతో గొడవ జరగ్గా పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంలో గ్రామశివారులో ట్రాన్స్‌ఫార్మర్‌ పట్టుకుని కొమరయ్య సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి భార్య రమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాదవేంద్ర రెడ్డి తెలిపారు.

News May 22, 2024

మిర్యాలగూడ బస్టాండ్‌లో డ్రైవర్‌పై మహిళల దాడి

image

బస్ ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రైవర్‌పై మహిళలు చేయి చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి MLG ఆర్టీసీ బస్టాండ్లో చోటు చేసుకుంది. DVK డిపోకు చెందిన బస్ అంగడిపేట వద్ద ఆపలేదు. దీంతో అక్కడున్న మహిళలు మరొక బస్సులో MLG బస్టాండ్‌కు చేరుకున్న ఆనంతరం ముందుగా వచ్చిన బస్సు డ్రైవర్‌ను బస్ ఎందుకు ఆపలేదని చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై డ్రైవర్, మహిళలు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. అనంతరం రాజీకొచ్చారు.

News May 22, 2024

నాగార్జునసాగర్: బుద్ధ పూర్ణిమకు ముస్తాబు

image

బుద్ధుని జయంతిని పురస్కరించుకొని ఈనెల 23న జరుపుకోనున్న బుద్ధ పూర్ణిమకు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని బుద్ధవనం ముస్తాబైంది. ఇందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బుద్ధవనంలోని మహాస్థూపంతో పాటు దారుల వెంట విద్యుత్ దీపాలను అలంకరించడంతో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

News May 22, 2024

NLG: మరోసారి ‘సన్న’గా తెరపైకి!

image

వరి విత్తనాల్లో సన్న రకాల సాగు మరోసారి తెర పైకి వచ్చింది. గతంలో సన్నాల సాగు చేయాలని చెప్పిన ప్రభుత్వం ఒక్క సీజన్‌కు మాట మార్చింది. ఇప్పుడు మళ్లీ సన్నాల సాగుకు ఊతం ఇచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాటి కష్టాలు, జరిగిన నష్టాల అనుభవంతో ఉన్న రైతులు సన్నాల సాగంటే భయపడుతున్నారు. రూ.500 బోనస్ రావాలంటే సాగు చేయక తప్పదని భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల సన్నాల సాగు చేస్తున్నారు.

News May 22, 2024

నల్గొండ: నేడు ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారుల సదస్సు

image

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనపై చర్చించడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ ఏవో, ఏడిఏతో పాటు ఉద్యాపన శాఖ అధికారులతో నల్గొండలోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై చర్చించి అందరి అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.

News May 22, 2024

NLG: MLC ఎన్నికలు.. పోల్ చిట్టీల్లో తప్పులు

image

పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా HNRలో పంపిణీ చేసిన పోల్‌ చిట్టీల్లో పోలింగ్‌ కేంద్రం చిరునామాలో తెలుగు, ఆంగ్లంలో రెండు వేర్వేరు చిరునామాలు అచ్చు వేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. దీంతో అసలు తాము ఏ కేంద్రంలో ఓటు వేయాలా అనే గందరగోళంలో ఉన్నారు. అధికారులు మాత్రం బూత్‌ల వారీగా ఓటర్ల జాబితా చూసి సంబంధిత పోలింగ్‌ కేంద్రానికి పోవాలని సూచిస్తున్నట్లు తెలిసింది.

News May 22, 2024

NLG: ఎమ్మెల్సీ ఓటర్లకు కలెక్టర్ సూచన

image

NLG- KMM- WGL శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లు ఓటు వేసే సందర్భంగా చేయదగినవి, చేయకూడని అంశాలపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వివరంగా తెలియజేశారు. ఓటర్లు వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా బ్యాలెట్ పేపర్ తో పాటు ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేయబడిన వైలెట్ స్కెచ్ పెన్ ను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.

News May 21, 2024

మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జి వీసీగా నవీన్ విఠల్‌

image

మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా ఐఏఎస్ అధికారి నవీన్ విఠల్‌ని ప్రభుత్వం నియమించింది. MGUలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను నూతన ఇన్‌ఛార్జి వీసీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రస్తుత వీసీ గోపాల్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ వీసీగా నవీన్ విఠల్‌ని ప్రభుత్వం నియమించింది.

News May 21, 2024

యాదాద్రి: చనిపోతూ ఆరుగురిని బతికించింది

image

తాను చనిపోతూ ఓ మహిళ ఆరుగురికి పునర్జన్మనిచ్చింది. వివరాలిలా.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూరుపేటలో అనారోగ్యం కారణంగా సుజాత మరణించింది. ఆమె అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో ఆమె మరో ఆరుగురికి పునర్జన్మనిచ్చినట్లైంది. తన గొప్ప మనస్సు చూసి ఆలేరువాసులు చలించిపోయారు.

News May 21, 2024

NLG: 21.50 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా

image

వానాకాలం వ్యవసాయ సీజన్ కు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు పంటల ప్రణాళికను ఇప్పటికే రూపొందించారు. మూడు జిల్లాల్లో మొత్తం 21.50లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. సీజన్ కు ముందే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణశాఖ పేర్కొనడంతో… అందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ సన్నద్ధమైంది.