Nalgonda

News July 31, 2024

ఆగస్టు 2న సాగర్‌ ఎడమ కాల్వకు నీరు విడుదల

image

ఎగువ నుంచి వరద ఉద్ధృతి ప్రాజెక్టులోకి వస్తుండటంతో నాగార్జునసాగర్‌ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు 1.79 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. నీటిమట్టం 518 అడుగులు, 145 టీఎంసీలుగా ఉంది. భారీ ఇన్‌ఫ్లోతో రోజూ 20 టీఎంసీలకు పైగా నీరు ప్రాజెక్టులోకి చేరనుంది. ప్రాజెక్టులోకి భారీ ఇన్‌ఫ్లో నేపథ్యంలో ఆగస్టు 2న ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు.

News July 31, 2024

రూ.503.89 కోట్ల రుణాలు మాఫీ: కలెక్టర్

image

రైతు రుణమాఫీలో భాగంగా జిల్లాలో 2వ విడత లక్షన్నర లోపు రుణాలున్న 43,130 రైతు కుటుంబాలకు సంబంధించిన 50,409 బ్యాంకు ఖాతాలలో రూ.503.89 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఉదయాదిత్య భవన్‌‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మొదటి విడత జిల్లాలో లక్ష లోపు రుణాలున్న 78,757 రైతు కుటుంబాలకు సంబంధించి 83,121 బ్యాంకు ఖాతాలలో రూ.481.63 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.

News July 30, 2024

ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ హర్షణీయం : జిల్లా కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు భారత సేవాశ్రమ సంఘం ఉచిత నోట్ పుస్తకాలను పంపిణీ చేయటం సంతోషకరమని నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన భారత సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ మండలంలోని కతాల్ గూడ ప్రాథమిక పాఠశాలలో నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి బిక్షపతి, మునీశ్వరానంద స్వామి, ఎంఈఓ కే.ఆరుంధతి తదితరులు పాల్గొన్నారు.

News July 30, 2024

సూర్యాపేటకు ఉప ఎన్నికలు రానున్నాయా.?

image

సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు రానున్నాయా.? తెలంగాణ శాసనసభ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం ఈ చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక్క స్థానం సూర్యాపేట నుంచి జగదీశ్ రెడ్డి గెలిచారు. ఓ హత్య కేసులో జగదీశ్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. అది నిరూపిస్తే రాజీనామా చేస్తానని జగదీశ్ రెడ్డి తెలిపారు.

News July 30, 2024

భువనగిరి: బోడ కాకరకాయ ధర రూ.400

image

బోడ కాకరకాయ మార్కెట్‌లో భలే గిరాకి ఉంది. సంవత్సరంలో కేవలం నెలన్నర మాత్రమే లభించే బోడ కాకరకాయల కోసం ప్రజలు ఎదురు చూస్తారు. సీజన్‌లో కనీసం ఒక్కసారైనా తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భువనగిరి కూరగాయల మార్కెట్‌లో కిలో బోడ కాకరకాయ ధర రూ.400 వరకు పలుకుతోంది. రసాయనాలు లేకుండా పండే బోడ కాకరకాయ ధర కోడి మాంసం కన్నా ఎక్కువగా ఉండటం విశేషం.

News July 30, 2024

మూసీకి జలకళ.. 642.5 అడుగులకు పెరిగిన నీటిమట్టం

image

నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద జలాశయంగా ఉన్న మూసీ రిజర్వాయర్ నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతోంది. మూసీ ఎగువ ప్రాంతాలైన రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు, ఎగువ కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల ద్వారా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ ఏడాది వానాకాలం ప్రారంభం నుంచే మూసీ ప్రాజెక్టు జలాశయం నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. సోమవారం రాత్రి వరకు 642.5 అడుగులకు పెరిగింది.

News July 30, 2024

UPDATE: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

image

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటిమట్టం 514.66 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 139 టీఎంసీలకు చేరింది. నాగార్జునసాగర్ ఇన్ ప్లో: 1,41,560 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 28,973 క్యూసెక్కులకు చేరుకుంది.

News July 30, 2024

NLG: 24 గంటల వైద్య సేవలు అందని ద్రాక్షేనా?

image

ఉమ్మడి జిల్లాలో పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటల వైద్య సేవలు ముచ్చటగానే మిగులుతున్నాయి. 24 గంటలు సేవలు అందించాల్సి ఉండగా వైద్యులు సిబ్బంది కొరత వల్ల సమయం కుదించారు. రోజు సాయంత్రం 6 గంటలకే ఆసుపత్రిని మూసి వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యవసర సమయంలో రోగులు పట్టణాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.

News July 30, 2024

NLG: మొదటి విడత కోసం 3వేల మంది ఎదురుచూపు

image

జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వేల మంది రైతులకు మొదటి విడత రుణమాఫీ కాలేదు. రాష్ట్ర అధికారుల సూచన మేరకు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌కు 3 వేల మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 1,800 మంది రైతుల ఆధార్ నంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోర్టల్లో నమోదు చేసి వారికి రుణమాఫీ ఎందుకు కాలేదో తెలియజేసి చేతులు దులుపుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

News July 30, 2024

పోచంపల్లి: దేవుడు కలలో కనిపించాడని.. జుట్టు పెంచేశాడు

image

పోచంపల్లి: 13 అడుగుల పొడవైన జుట్టుతో లక్ష్మణా‌చారి అందరినీ ఆకర్షిస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామానికి చెందిన గుండోజు లక్ష్మణా‌చారి(72) వీరభద్ర స్వామి తన 18వ ఏట వీరభద్ర స్వామి కలలో కనిపించాడు. దీంతో జుట్టు కత్తిరించుకోకుండా దేవుడికి అర్పించినట్లు లక్ష్మణాచారి తెలిపారు.