India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్సభ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి.
⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలింపు
⏵శాంతి భద్రతల ఆటంకం
⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం
⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ
⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం
⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు
⏵అసత్య వార్తలు వ్యాప్తి
నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు. 349 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. సూర్యాపేట జిల్లాలో 229 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, అక్కడ సజావుగా ఎన్నికలు జరిగేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెంకట్రావ్ తెలిపారు.
నల్గొండ పట్టణ సమీపంలోని
అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న గోదాములో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుకై ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చందన ఆదివారం తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు కు ఏర్పాటు చేసే టేబుళ్లు,బ్యారీకేడింగ్, ఏజెంట్లు బ్యారేడింగ్, భద్రత, తదితరాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపుకు రెండు రోజుల ముందు అధికారులకు ఇక్కడ బస ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఎన్నికల విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటుతో వలిగొండ వాసి మృతి చెందిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. మండల పరిధిలోని పహిల్వాన్ పురంకి చెందిన బొడ్డుపల్లి నరసింహ హైదరాబాద్లోని చంపాపేట్లో మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సాయంత్రం ఎన్నికల విధుల్లో ఉండగా గుండె నొప్పితో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేవరకొండ నియోజకవర్గంలో ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల విధులకు గైర్హాజరైన 48 మందిపైన ఆర్పీ ఆక్ట్ యు/ఎస్ 134 క్రింద కేసులు నమోదు అయినట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రోసెడింగ్ అధికారులు 48 మంది రిపోర్టు చేయాల్సి ఉండగా ఇంతవరకు రిపోర్ట్ చేయలేదు. దీంతో వారిపై చర్యలకు ఉపక్రమించారు.
నల్గొండ : ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై కేసులు నమోదు చేయాలని నల్గొండ కలెక్టర్ హరిచందన ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద కేసు బుక్ చేయాలని సూచించారు. పోలింగ్ విధులకు రిపోర్ట్ చేయని పీవో, ఏపీవో, ఇతర పోలింగ్ సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మిర్యాలగూడలో జరిగింది. ఎస్సై నరేష్ తెలిపిన ప్రకారం.. దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన మాలోతు వాగ్య తన ద్విచక్ర వాహనంపై కిరాణం సామాన్ల కోసం మిర్యాలగూడ వస్తున్నాడు. గూడూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి కుమారుడు, కూతురు ఉన్నారు. మృతిడి భార్య లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
భువనగిరికి చెందిన మూడేళ్ల కుమారుడు శ్రీయాన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. రెండు నిమిషాల్లో 55 దేశాలకు సంబంధించిన జెండాలను చూసి ఆ దేశం పేరు చెబుతున్నాడు. 12 రేఖా గణిత పటాలు, 12 రంగులు, 22 జంతువుల పేర్లు చకచకా చెప్పేస్తాడు. న్యూఢిల్లీలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ధ్రువపత్రంతో పాటు రికార్డు బుక్ను అందించారు.
నల్గొండలో భార్యాభర్తల మధ్య గొడవ హత్యకు దారి తీసింది. నల్గొండ వన్ టౌన్ సీఐ తెలిపిన సమాచారం మేరకు.. గుంటూరుకి చెందిన సయ్యద్ వలి (40) ఆరేళ్లుగా నల్గొండలో అడ్డా కూలిగా పనిచేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన హాజీ బేగంతో వివాహం జరిగింది. సయ్యద్ వలి మద్యం తాగుతుండడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సర్ది చెప్పడానికి వచ్చిన పెద్ద మనుషులు కర్రతో దాడి చేయడంతో వలి మరణించాడు.
ఓటేసే సమయంలో కొన్నిసార్లు అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా ఓటర్లపై ఏజెంట్లు సందేహం వ్యక్తం చేసి నకిలీ వ్యక్తని ఓటేయనివ్వరు. అప్పుడు పోలింగ్ అధికారికి రూ.2 చెల్లించి FORM-14లో పేరు, అడ్రెస్ రాసిచ్చి వారి ఐడెంటిటీని నిరూపించుకుని ఓటేయొచ్చు. దీంతోపాటు మీ ఓటు ఆల్రెడీ ఇంకెవరో వేశారంటే వెంటనే పోలింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేయాలి. టెండర్ ఓటును డిమాండ్ చేయొచ్చు. టెండర్ ఓటు పడితే రీపోలింగ్ కు అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.