Nalgonda

News July 17, 2024

వలిగొండ: పోలీసులపై దాడి.. నిందితులు అరెస్ట్

image

పోలీసులపై దాడికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించిన ఘటన వలిగొండ మండలం అరూర్‌లో జరిగింది. ఎస్సై మహేందర్ వివరాలిలా.. వలిగొండ ఠాణాకు చెందిన పోలీసులు నిరంజన్, శ్రీనివాస్ సోమవారం రాత్రి బ్లూకోట్ విధులు నిర్వహిస్తుండగా.. రోడ్డుపై నిల్చున్న ఓ ఐదుగురిని ఇంటికి వెళ్ళమని చెప్పారు. దీంతో వారు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

News July 17, 2024

600 మంది విద్యార్థినీలకు ఒకటే మరుగుదొడ్డి!

image

నల్గొండ జిల్లాలోని సర్కారు పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ముఖ్యంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో 1250 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 600 మంది విద్యార్థినీలు, 15 మంది మహిళా టీచర్లు ఉన్నారు. వీరందరికీ ఒకటే మరుగుదొడ్డి ఉండడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

News July 17, 2024

జిల్లాలో వర్షపాత వివరాలు

image

నల్గొండ జిల్లాలో 6.0 మిల్లీమీటర్ల  వర్షపాతం నమోదైంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నేరడుగొమ్ములో 32.0 మి.మీ, అత్యల్పంగా హాలియాలో 0.1 మి.మీ వర్షపాతం నమోదయింది. చందంపేట 28.1, దామరచర్ల 23.8, త్రిపురారం 16.8, నార్కట్పల్లి 12.2, గుండ్లపల్లి 11.8, దేవరకొండ 11.5,కొండమల్లేపల్లి 8.3, కట్టంగూర్ 7.0, నల్గొండ 5.3, తిప్పర్తిలో 4.9 మీమీ వర్షం కురిసింది.

News July 17, 2024

దంపతుల మధ్య గొడవ.. భార్య ఆత్మహత్య

image

గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. SI రాజు వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా తునికినూతల గ్రామానికి చెందిన వడ్త్యా శ్రీని, పద్మజల దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు. నగరానికి కొన్నేళ్లక్రితం వచ్చి నాదర్‌గుల్‌లో నివాసం ఉంటున్నారు. సోమవారం శ్రీని, పద్మజ మధ్య డబ్బుల విషయమై గొడవ జరిగింది. దీంతో పద్మజ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

News July 17, 2024

NLG: రూ.2లక్షల రుణమాఫీ.. రూ.7500 కోట్ల అవసరం..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ. 2లక్షల రుణమాఫీపై అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టారు. జిల్లాలో మొత్తం 5.36లక్షల మంది రైతులు ఉండగా సుమారు రూ.7500 కోట్ల వరకు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో రుణమాఫీ రూ.500 కోట్లు కానున్నట్లు సీఈవో శంకర్‌రావు పేర్కొన్నారు. దీనిపై 19న జరిగే పాలకవర్గం సమావేశంలో నిర్ణయం తీసుకుంటారన్నారు.

News July 17, 2024

మంత్రి కోమటిరెడ్డి తొలి ఏకాదశి శుభాకాంక్షలు

image

జిల్లా ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తొలకరితో తోడుగా వచ్చే తొలిఏకాదశి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను తీసుకువస్తుందన్నారు. అలాగే ముస్లిం సోదరులకు మొహర్రం పండుగా శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు గుర్తుగా జరుపుకునే పండగ మొహర్రం అన్నారు. లౌకికవాద స్ఫూర్తికి మొహర్రం తార్కాణంగా నిలుస్తుందన్నారు.

News July 17, 2024

19 నుంచి మిర్యాలగూడ స్టాప్‌ ఎత్తివేత

image

విశాఖ, చైన్నె, నారాయణాద్రి రైళ్లకు మిర్యాలగూడలో ఈనెల 19నుంచి స్టాప్‌ను ఎత్తివేస్తూ రైల్వే అధికారులు ఆదేశాలిచ్చారు. కోవిడ్‌ సమయంలో ఈ రైళ్లకు స్టాప్‌ ఎత్తివేయగా EX MP ఉత్తమ్‌, EX MLA భాస్కర్‌రావు మిర్యాలగూడలో రైళ్లను నిలపాలంటూ అధికారులకు విన్నవించారు. గత ఏడాది జులై నుంచి ఆయా రైళ్లు నిలిచేలా అనుమతించారు. ఆదేశాలిచ్చేటప్పుడే ఏడాది పాటు రైళ్లు నిలుపుతామని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం ఏడాది పూర్తయింది.

News July 16, 2024

నల్గొండ: పంచాయతీ సెక్రటరీ సస్పెండ్

image

చండూరు మండలం ఇడికూడ పంచాయతీ సెక్రటరీ సైదులు సస్పెండ్ అయ్యారు. గతంలో ఆయన చండూరు మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్న సమయంలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో కలెక్టర్ సైదులును సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

News July 16, 2024

NLG: 5.36 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ!

image

రైతు రుణమాఫీకి ప్రభుత్వం ఎట్టకేలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను బ్యాంకర్లకు అప్పగించింది. రూ.2లక్షల వరకు రుణం మాఫీ కానుండగా, ఆగస్టు 15వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తిచేయనుంది.  ఉమ్మడి జిల్లాలో దాదాపు 5.36 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News July 16, 2024

బీఈడీ పూర్వ విద్యార్థులకు వన్ టైం ఛాన్స్

image

MG యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పూర్వ విద్యార్థులకు వన్ టైం చాన్స్ ద్వారా పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కంట్రోలర్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. 2011 – 12 నుంచి సంవత్సరం వారీగా అభ్యసించినవారు, 2014- 15 నుంచి 2020 వరకు సెమిస్టర్ విధానంలో చదివిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను వారు అభ్యసించిన కళాశాలలో ఈ నెల 30లోగా అందజేయాలన్నారు.