India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా అనిశెట్టి దుప్పలపల్లి కౌంటింగ్ కేంద్రంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావుతో కలిసి నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యాపేట నియోజక వర్గాల కౌంటింగ్ ను ప్రత్యేకంగా ఆ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.
నల్గొండ పార్లమెంట్ 17వ రౌండ్ ఫలితాలు వెలువడే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి 2,55,082 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఈ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి 3,78,649 ఓట్లు రాగా
బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 1,23,567 ఓట్లు వచ్చాయి.
బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి 1,04,457 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.
NLG, BNR లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. MLGలో తొలుత లెక్కింపు పూర్తవనుండగా.. ఆ తర్వాత వరుసగా SRPT, NLG, KDD, HNR, సాగర్ చివరగా DVK ఓట్ల లెక్కింపు పూర్తవనుంది. BNR లోక్సభ పరిధి ఇబ్రహీంపట్నంలో 343 పోలింగ్ స్టేషన్లుండగా .. ఇక్కడ 20 టేబుళ్లను, మునుగోడు, తుంగతుర్తి, BNR, NKL, ALR, జనగామలో 14 టేబుళ్లలో ఓట్లను లెక్కించనున్నారు. మొదట నల్గొండ, తర్వాత భువనగిరి ఎంపీ ఎవరో తేలనుంది.
నల్గొండ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు 24 రౌండ్స్ లో పూర్తి కానుంది. కౌంటింగ్ కోసం మొత్తం 8 హాల్స్ 122 టేబుల్ ఏర్పాటు చేశారు. 2061 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను ఉదయం 8 గంటల నుంచి లెక్కించనున్నారు. నల్లగొండ పార్లమెంట్ లో 74.02 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 17,25,465 మంది ఓటర్లకు గాను 12,77,137 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో భువనగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి క్యామ మల్లేశ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, BJP నుంచి బూర నర్సయ్య పోటీలో ఉన్నారు. కాగా భువనగిరి నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నట్లు స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు. చాలా సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని వెల్లడించాయి.
నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తీ <<13368558>>హిందూపూర్ వాటర్ ట్యాంక్లో <<>>మృతదేహం లభించిన ఘటనపై ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ట్విటర్ (ఎక్స్) వేదికగా నిప్పులు చెరిగారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని విమర్శించారు.
సూర్యాపేటకు చెందిన గోపగాని శ్రీనిఖ పాలిసెట్ (బైపీసీ స్ట్రీమ్)లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆమె 120 మార్కులకు 119.5 పొందారు. ఆమె తండ్రి గోపగాని సోమయ్య సూర్యాపేటలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం సహకారం, సూచనలతోనే ర్యాంక్ సాధ్యమైందని శ్రీనిఖ తెలిపింది. ఆమెను పలువురు అభినందించారు.
పది రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి మున్సిపల్ వాటర్ ట్యాంకులో శవమై తేలాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండలోని 28వ వార్డు హనుమాన్ నగర్ కాలనీకి చెందిన ఆవుల వంశీకృష్ణ యాదవ్(26)గత నెల 24న ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. అతడి కోసం కుటుంబ సభ్యులు చాలా చోట్ల వెతికారు. ఈరోజు పట్టణంలోని 12వ వార్డులో గల హిందూపూర్ మున్సిపల్ వాటర్ ట్యాంకులో శవమై కనిపించాడు.
పది రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకులో శవమై తేలాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండలోని 28వ వార్డు హనుమాన్ నగర్ కాలనీకి చెందిన ఆవుల వంశీకృష్ణ యాదవ్(26)గత నెల 24న ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. అతడి కోసం కుటుంబ సభ్యులు చాలా చోట్ల వెతికారు. ఈరోజు పట్టణంలోని 12వ వార్డులో గల హిందూపూర్ మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకులో శవమై కనిపించాడు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో నల్గొండ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డి, BJP నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటీలో ఉన్నారు. కాగా నల్గొండ నుంచి కాంగ్రెస్ గెలుస్తుందని దాదాపు అన్ని సర్వేల్లో వెల్లడైంది. భారీ మెజార్టీ వస్తోందని హస్తం పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మీరేమంటారు.
Sorry, no posts matched your criteria.