India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనుమానాస్పద స్థితిలో ఐదవ తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన పెన్పహాడ్ మండలం దోసపాడు గురుకుల పాఠశాలలో జరిగింది. నూతనకల్ మండలం మాచనపల్లికి చెందిన సోమయ్య-నవ్య దంపతుల కూతురు సరస్వతి బీసీ వెల్ఫేర్ దోసపాడు గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతుంది. ఈరోజు ఉదయం మృతి చెందింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నల్గొండ జిల్లాలో 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలో అత్యధికంగా CTL మండలంలో 18.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా అనుములలో 0.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. SLGలో 15.5, NKPలో 15.1, మర్రిగూడ 6.9, గట్టుప్పల్ 4.5, KTGR 4.3, చింతపల్లి 3.5, CDR 3.3, NLG 2.8, మునుగోడు 2.6, తిప్పర్తి 2.3, గుండ్లపల్లి 2.2, గుర్రంపోడు 1.8 మీ.మీ వర్షం పడింది.

NLG: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను ఒకటికి రెండుసార్లు చదివి, ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు.

గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలకు సాధికారత కల్పించడంలో భాగంగా తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో రూపొందించిన “ఇంటింటా ఇన్నోవేషన్” గోడపత్రికను కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఆవిష్కర్తలు ఆగస్టు 3లోగా నూతన ఆవిష్కరణలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను సెల్ ఫోన్ నెంబర్ 9100678543 నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించాలని ఆయన అన్నారు.

10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. నల్గొండ డివిజన్లో 81, సూర్యాపేట డివిజన్లో 62 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPMకు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonlineను సంప్రదించవచ్చు. SHARE IT

రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి కసరత్తు చేస్తోంది. ఇందుకు ఉమ్మడి నల్గొండ సహకార సంఘాల పరిధిలో రూ.2 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతుల వివరాలను అధికారులు సేకరించారు. ఆయా బ్యాంకుల రికార్డుల ఆధారంగా అర్హులైన రైతుల వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. ఉమ్మడి జిల్లాలో 5.36 లక్షల మంది రైతులు పంట రుణమాఫీ పొందే అవకాశం ఉంది. దీంతో రైతుల సంతోషంలో ఉన్నారు.

నార్కట్పల్లి మండలం గోపాలయపల్లి గ్రామంలో శ్రీ వారిజాల వేణు గోపాలస్వామి వారి ఆలయంలో సోమవారం సుదర్శన యాగ సహిత రుద్రయాగం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి కసరత్తు చేస్తోంది. ఇందుకు ఉమ్మడి నల్గొండ సహకార సంఘాల పరిధిలో రూ.2 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతుల వివరాలను అధికారులు సేకరించారు. ఆయా బ్యాంకుల రికార్డుల ఆధారంగా అర్హులైన రైతుల వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. ఉమ్మడి జిల్లాలో 5.36 లక్షల మంది రైతులు పంట రుణమాఫీ పొందే అవకాశం ఉంది. దీంతో రైతుల సంతోషంలో ఉన్నారు.

బోడ కాకరను సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్లో ఏ కూరగాయలకు లేని ధర దీనికి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని కూరగాయల మార్కెట్లో కిలో బోడ కాకర రూ.460 వరకు ధర పలుకుతోంది. ఇందులో ఆరోగ్యానికి అవసరమయ్యే ఔషధ గుణాలు ఉంటాయి. ఏటా జులై, ఆగష్టు రెండు నెలలు మాత్రమే పడుతుండటంతో దీనికి డిమాండ్ ఉంటుంది.

ఓ యువకుడు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల, స్థానికుల వివరాలు.. వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామానికి శంకరయ్య- శ్యామల దంపతుల రెండో కుమారుడు శివ(20) ఇంటీ వద్దనే ఉంటూ వ్యవసాయ కూలీ పనులు చేస్తున్నాడు. రోజు పని దొరకకపోవడంతో ఆర్థిక సమస్యతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకున్నాడు. శివ తండ్రి గత ఏడాది భర్త, ఇప్పుడు కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి శ్యామల కన్నీరుమున్నీరవుతోంది.
Sorry, no posts matched your criteria.