Nalgonda

News June 3, 2024

 SRPT: భర్త మృతి, చెరువులో దూకి భార్య సూసైడ్ 

image

భర్తపై బెంగతో భార్య చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోతె మండల పరిధిలోని పేదరాజుతండాలో ఆదివారం జరిగింది. ఏఎస్ఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. బానోతు రంగమ్మ(80) భర్త గత నెల 5వ తేదీన మృతి చెందారు. భర్తపై బెంగతో గ్రామ పరిధిలోని చెరువులో దూకి రంగమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు హంస్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 3, 2024

BREAKING: చిట్యాల వద్ద యాక్సిడెంట్

image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతోంది.

News June 3, 2024

NLG: ఎంపీ ఎన్నికల కౌంటింగ్ ఇలా..

image

నల్లగొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో అత్యధికంగా 324 పోలింగ్ బూత్‌లు ఉన్న దేవరకొండ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు 24 రౌండ్లలో పూర్తి కానుండగా మిర్యాలగూడ నియోజకవర్గంలో 264 బూత్‌లు ఉండగా 19 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలుండగా.. 22 రౌండ్లు పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది.

News June 3, 2024

NLG: గంటలోనే మొదటి రౌండ్ ఫలితం

image

ఎంపీ ఎన్నికల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా, గంటలోనే మొదటి రౌండ్ ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఒక్కో రౌండ్లో 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 24 రౌండ్లలో పూర్తి లెక్కింపు కానుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో పూర్తి ఫలితం వెలువడనుంది. అయితే ప్రతి టేబుల్‌కు ఆయా పార్టీలకు సంబంధించిన ఒక ఏజెంట్ను నియమించుకునేందుకు అనుమతిస్తారు.

News June 3, 2024

మిర్యాలగూడ రైల్వే పట్టాలపై మృతదేహం 

image

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు ఇచ్చారు. పోలీసులకు మృతుడికి సంబంధించిన ఎలాంటి సమాచారం లభించలేదు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చరికి తరలించారు.

News June 3, 2024

ఓట్ల లెక్కింపునకు సంసిద్ధం కావాలి : కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను వెంటనే పూర్తి చేసి ఓట్ల లెక్కింపుకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. జిల్లా ఎస్పీ చందనా దీప్తితో కలిసి ఆదివారం ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు పై జిల్లా అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులతో కో-ఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు.

News June 2, 2024

స్థానికులు దర్శించుకోవడానికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు

image

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని స్థానికులు దర్శించుకోవడానికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ప్రతి మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల 30 నిమిషాల వరకు స్థానికులు ఆధార్ కార్డుతో వచ్చినవారికి దర్శనం ఏర్పాటు కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు

News June 2, 2024

నల్గొండలో తెలంగాణ అవతరణ దినోత్సవం

image

నల్లగొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందన దీప్తికి గౌరవందనం సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన జెండాను ఎగరవేశారు.

News June 2, 2024

చేప పిల్లల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు: మత్య్సశాఖ

image

నీరు ఉన్న చెరువుల్లోనే ఉచిత చేప పిల్లలను వదిలామని, ఈ ప్రక్రియ మండల స్థాయి అధికారుల సమక్షంలో జరిగిందని మత్స్యశాఖ జిల్లా అధికారి వెంకయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పలు మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. నీరు లేని చెరువుల్లో చేప పిల్లలు వదల లేదని పేర్కొన్నారు. చేప పిల్లల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపారు. కలెక్టర్ ఆమోదంతో బిల్లుల చెల్లింపునకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు.

News June 2, 2024

నల్గొండ: CPAC సర్వే.. BRS గెలుపు!

image

వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో BRS గెలుస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. అలాగే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో BRS 11, BJP 2, కాంగ్రెస్, ఎంఐఎం చెరొకటి గెలుస్తాయని అంచనా వేసింది. భువనగిరిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, బీఆర్ఎస్‌కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని సీపాక్ తెలిపింది.