Nalgonda

News June 2, 2024

బంగారంతో చిన్న సైజులో T-20 ప్రపంచకప్ 

image

ఈనెల 2 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ స్వర్ణకారుడు బంగారంతో సూక్ష్మసైజులో T-20 ప్రపంచకప్‌ను రూపొందించి అబ్బురపరిచాడు. భువనగిరికి చెందిన చొల్లేటి శ్రీనివాసచారి బంగారం, వెండితో సూక్ష్మసైజులో వివిధ రకాల వస్తువులు తయారు చేయడంలో ప్రావీణ్యుడు. గతంలో క్రికెట్ స్టేడియం, పార్లమెంట్ భవనం, పీసా టవర్, హరితహారం, ICC కప్, బంగారు బతుకమ్మ, వరల్డ్ కప్ తయారు చేశాడు.

News June 2, 2024

ఓట్ల లెక్కింపు ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలి: కలెక్టర్

image

NLG- KMM- WGL శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి, NLG- KMM- WGL శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అన్నారు. శనివారం ఉదయాదిత్య భవన్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన 12 జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఏఆర్ఓలకు ఓట్ల లెక్కింపు పై ఏర్పాటుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

News June 1, 2024

చాణక్య X SURVEY: నల్గొండ, భువనగిరి కాంగ్రెస్‌దే..!

image

నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్‌దే అని చాణక్య X సర్వే తేల్చి చెప్పింది. నల్గొండలో BRS నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ రఘువీర్ రెడ్డి, BJP నుంచి సైదిరెడ్డి రెడ్డి పోటీ చేశారు. ఇక భువనగిరిలో BRS నుంచి క్యామ మల్లేశ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్, BJP నుంచి బూర నర్సయ్య పోటీలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారని సర్వే అంచనా వేసింది.

News June 1, 2024

AARA SURVEY: నల్గొండ, భువనగిరి కాంగ్రెస్‌దే..!

image

నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్‌దే అని ఆరా మస్తాన్ సర్వే తేల్చి చెప్పింది. నల్గొండలో BRS నుంచి కంచర్ల కృష్ణరెడ్డి, కాంగ్రెస్ కందూరు రఘువీర్ రెడ్డి, BJP నుంచి సైదిరెడ్డి రెడ్డి పోటీ చేశారు. ఇక భవనగిరిలో BRS నుంచి క్యామ మల్లేశ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్, BJP నుంచి బూర నర్సయ్య పోటీలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారని సర్వే అంచనా వేసింది.

News June 1, 2024

BREAKING: నకిరేకల్ యువతి ఆత్మహత్య

image

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన సంగీత(24) తన సోదరుడితో కలిసి HYD వచ్చింది. మేడ్చల్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉంటూ గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని చనిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు.

News June 1, 2024

NLG: చెరువుల్లో నీరే లేదు.. చేప పిల్లలు పోశారట!

image

గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా నల్గొండ జిల్లాలో రిజర్వాయర్లు చెరువులు, కుంటల్లో నీరు చేరలేదు. చెరువులు కుంటల్లో నీరు లేకున్నా చేప పిల్లలు వదిలినట్లు కాంట్రాక్టర్లు మాయాజాలం ప్రదర్శించడంపై పలువురు మండిపడుతున్నారు. ఇదే విషయమై రూ.6 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి సిఫార్సులు పంపారట. దీనిపై మత్స్య సహకార సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

News June 1, 2024

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో డ్రెస్ కోడ్ అమలు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నట్లు ఈవో భాస్కర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పక సంప్రదాయ దుస్తులు ధరించాలని తెలిపారు. మహిళలు చీర, చుడీదార్, పురుషులు దోతి, తెల్ల లుంగీ, షర్ట్ ధరించవచ్చని సూచించారు.

News June 1, 2024

నల్గొండ: రక్తంతో ఎమ్మెల్యే చిత్రపటం

image

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై అభిమానాన్ని ఓ యువకుడు వినూత్నంగా చాటుకున్నాడు. ఆయన పుట్టినరోజు సంబర్భంగా తన రక్తపు చుక్కలతో వీరేశం చిత్రపటాన్ని వేయించి అభిమానం తెలియజేశాడు నార్కెట్‌పల్లి మండలం ఏపి లింగోటం గ్రామానికి చెందిన కొరివి శివరాం. ప్రాణమున్నంత వరకు ఆయన వెంట నడుస్తానని శివరాం చెబుతున్నాడు.

News June 1, 2024

నల్గొండ: పంచాయతీ ఎన్నికలకు ఆశావహుల ఎదురుచూపు

image

గ్రామస్థాయి నేతలు పంచాయతీ ఎన్నికల సమరం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ జూన్లో ఎన్నికలు ఉంటాయనే ఉద్దేశంతో పోటీకి ఆయా పార్టీల నేతలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే ఎన్నికలు మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఎప్పుడు జరుగుతాయోనని ఆరా తీస్తున్నారు. గతంలో ఉన్న అభ్యర్థులతో పాటు కొత్త వారు కూడా పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 1,740 జీపీలలో ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల చర్చే ఉంది.

News June 1, 2024

NLG: వడదెబ్బతో ఇద్దరు మృతి

image

జిల్లాలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. మునుగోడు మండలం ఊకోండి గ్రామానికి చెందిన కమ్మలపల్లి మమత (30), రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో నివాసం ఉంటున్న భీమవరానికి చెందిన కర్రీ రాజు (40) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. జిల్లాలో మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల పైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.