India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒక వైపు పార్లమెంట్ ఎన్నికల హోరు కొనసాగుతుండగా.. ఇప్పుడు NLG – WGL-KMM పట్టభద్రుల MLC ఎన్నిక హడావుడి కూడా మొదలైంది. ఈ నెల 27న జరిగే MLC ఎన్నిక పోలింగ్ జరగనుంది. 2 నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)ను ప్రకటించగా, బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా వరంగల్కు చెందిన ఏనుగు రాకేష్ రెడ్డి ని ప్రకటించింది. బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.
లోక్సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. కాగా 2021లో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం 1,83,167 ఓట్లు అవసరం కాగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50శాతానికి మించి రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో పల్లా గెలిచారు.
నల్గొండ జిల్లా షీ టీం బృందాలు మహిళా రక్షణలో ముందుంటూ ఎలాంటి ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ రక్షణ కల్పిస్తుందని జిల్లా ఎస్పీ స్పందన దీప్తి తెలిపారు. మహిళలను, యువతులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా షీ టీం బృందాలు అన్ని ప్రాంతాలలో డేగ కళ్ళతో పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. మహిళలు, యువతులు, బాలికలను ఎవరైనా లైంగికంగా వేధించిన, ఈవ్ టీజింగ్ పాల్పడిన కఠిన చర్యలు తప్పవన్నారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉపఎన్నిక స్థానానికి శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, రెవిన్యూ అదనపు కలెక్టర్ ములుగు జిల్లా, సిహెచ్. మహేందర్కి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
2021లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో 5,05,565 మంది ఓటర్లు ఉండగా.. ఇటీవల ఎన్నికల సంఘం వెలువరించిన ఓటరు తుది జాబితా ప్రకారం 4,61,786 మంది ఓటర్లుగా నమోదయ్యారు. గతంలో పోల్చితే ఓటర్ల సంఖ్య తగ్గింది. పట్టభద్రులు ఓటు నమోదుపై ఆసక్తి చూపకపోవటమే దీనికి కారణం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా ఎన్నికలు జరిగే ప్రతిసారీ పట్టభద్రులు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.
నల్గొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలోని తిప్పలమ్మ గూడెం గ్రామానికి చెందిన రైతు వడదెబ్బతో గురువారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిని వివరాలు.. తోట జాన్ రెడ్డి వ్యవసాయ పనుల ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరారు. ఎండదెబ్బతో తీవ్ర అలసటకు గురై మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
గెలిచినా.. ఓడినా నిరుద్యోగుల పక్షాన నిలబడతానని NLG- KMM-WGL స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ అన్నారు. నల్లగొండలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 12 క్రిమినల్ కేసులు, చంచల్ గూడ జైలు జీవితం గడిపిన తాను విద్యార్థుల కోసం ఐదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశానని నిరుద్యోగులు తమకు మద్దతుగా నిలబడతానన్నారు. తనను గెలిపిస్తే అసెంబ్లీలో నిరుద్యోగుల పక్షాన ప్రశ్నించే గొంతుకనవుతానన్నారు.
కల్లు అమ్మి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువకుడు చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించిన ఘటన మండలంలోని శాకాజిపురంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉడుతల గోపి (30) గీత కార్మికుడిగా జీవనం కొనసాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం కల్లు అమ్మి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి వ్యవసాయ క్షేత్రం వద్ద చెట్టుకు ఉరి వేసుకొని వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు.
సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కు సంబంధించి NSP క్వార్టర్కు అధికారులు వేసిన సీల్ను 48గంటల్లో తొలగించాలని గురువారం హైకోర్టు అధికారులను ఆదేశించింది. సాగర్ హిల్ కాలనీలోని EE 19 క్వార్టరు మాజీ ఎమ్మెల్యే భగత్ క్యాంప్ ఆఫీస్గా అలాట్ చేయించుకున్నారు. గతేడాది NOVలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భగత్ ఓటమి చెందినప్పటికీ క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేయకపోవడంతో NSP అధికారులు సీల్ వేసిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.