India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో అంగన్వాడీలు పని ఒత్తిడికి గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారం అందించేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు మాత్రం శ్రమకు తగిన వేతనం లభించడం లేదు. చాలీచాలని జీతాలతో కాలం గడుపుతున్నారు. పని భారం తగ్గించాలని కోరుతున్నారు.
భానుడి ప్రతాపానికి బీర్లకు డిమాండ్ పెరిగిపోయింది. దాదాపు ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల బీర్లు లేవు అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. డిమాండ్కు తగ్గట్టుగా బీరు ఉత్పత్తి కాకపోవడంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు వైన్ షాపుల ముందు నో బీర్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక మద్యం ప్రియులు బీర్లను తాగి ఉపశమనం పొందాలనుకున్నా వారికి నిరాశే కలుగుతుంది.
నల్గొండ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. చందంపేట మండలం తెల్దేవరపల్లిలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వేములపల్లి మండలం బుగ్గబాయిగూడెం , మాడ్గులపల్లి, నాంపల్లి, తిప్పర్తి మండలంలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. కట్టంగూర్, చందంపేట, పీఏపల్లి మండలం కోదాండాపురం, నిడమనూరు, హాలియా, ఇబ్రహీంపేట, కనగల్ తదితర మండలాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎన్నికలంటే ఓ పండగ! దాదాపు ఇరవై రోజుల పాటు నిత్యం నాయకుల మాటల పోరు ర్యాలీలూ, సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది. కానీ,ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రచార హోరు కనిపించకపోగా.. మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో కనిపిస్తున్న ఊర్లలో ఎన్నికల ఊపు కనిపించడం లేదు.
2019 ఎన్నికల్లో నల్గొండ MP స్థానంలో ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టారు. 2018లో ఆ లోక్సభ పరిధిలోని SRPT, KDD, HNR, MLG, సాగర్, NLG, DVK అసెంబ్లీ స్థానాలు BRS విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో SRPT మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఈ క్రమంలో ఈ నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పాత ఒరవడికి కట్టుబడి భిన్నమైన తీర్పు ఇస్తారా అనే భావన వ్యక్తం అవుతోంది.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మూడోరోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. దీంతో మూడు రోజుల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 11కు చేరింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఇప్పటికే నామినేషన్ వేయగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి రేపు నామినేషన్ వేస్తారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.
అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియలలో వ్యవసాయ బావిలో పడి జల్లా రామకృష్ణ అనే వ్యక్తి శనివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణ పొలం దగ్గర వ్యవసాయ మోటారు చూడటానికి వెళ్లాడు. బావిలో నీరు తాగేందుకు దిగగా కాలుజారి నీళ్లలో పడ్డాడు. ఈత రాకపోవడంతో మృతి చెందాడు. భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.
లోక్ సభ ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడుతోంది. జనంలోకి వెళ్లేందుకు అభ్యర్థులకు వారం రోజులే మిగిలి ఉంది. దీంతో పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. పోలింగ్ కు 48 గంటల ముందే ప్రచారం ముగియనున్నందున ఈ లోపు ఎక్కడెక్కడ అయితే ముఖ్యమైన సమావేశాలు నిర్వహించాలనే దానిపై ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి.
ఇంటర్ ఫలితాల్లో తప్పడంతో విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన హుజూర్నగర్లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విద్యార్థి (17) ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఏప్రిల్ 29న ఎలుకల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి, మెరుగైన వైద్యం ఖమ్మం.. అక్కడి హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.
భువనగిరి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి నాలుగు లక్షల ఓట్ల మెజార్టీ వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నాంపల్లిలో శనివారం రాత్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామలతో కలిసి జనగర్జన ర్యాలీ నిర్వహించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.