India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తుండటంతో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసినా మనం గెలుస్తున్నామా?.. మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది?.. మన పార్టీ హవా ఎలా ఉంది?అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడటం గమనార్హం.కాగా ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడలో చోటుచేసుకుంది. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని మిర్యాలగూడ వాసిగా స్థానికులు గుర్తించినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ట్రాక్టర్ బోల్తా పడి బాలుడు మృతి చెందిన ఘటన మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన అన్నం విష్ణువర్ధన్ తన తండ్రి ట్రాక్టర్ నడుపుతుండగా పక్కన కూర్చొన్నాడు. రేగట్టే గ్రామం వైపు వెళుతుండగా కోమటికుంట కట్టపై ట్రాక్టర్ అదుపు తప్పి పొలాల్లో బోల్తా పడిండి. ట్రాక్టర్ కిందపడిన విష్ణువర్ధన్ ఘటనా స్థలంలోనే మరణించాడు.
హుజూర్నగర్ మండలం గోపాలపురం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఎస్పీ Suryapet Facebook ప్రొఫైల్ను పోలిన రెండు నకిలీ facebook ప్రొఫైల్స్ను సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేశారు. వాటి నుంచి వచ్చే మెసేజ్లకు, రిక్వెస్ట్లకు స్పందించవద్దని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కోరారు. వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని, డబ్బులు పంపించవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేసారు. కేసు నమోదు చేసి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ బుధవారం తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. అనంతగిరి మండలంలో అమీనాబాద్లో ఓ పాడుబడ్డ ఇంట్లో ఐదుగురు క్షుద్రపూజలు చేస్తున్నట్లుగా గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కల్తీపాలను తయారు చేస్తూ విక్రయిస్తున్న వ్యక్తిని భువనగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పట్టణ పరిధిలోని ముఖ్తాపూర్కు చెందిన సన్న ప్రశాంత్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం ఎస్ఓటీ పోలీసులు పాలు విక్రయించే ఇంటికి వెళ్లి సోదా చేయగా.. 60 లీటర్ల కల్తీపాలు, 250ML హైడ్రోజన్ పెరాక్సైడ్, కిలో పాల పౌడర్ ప్యాకెట్ లభించినట్లు పోలీసులు తెలిపారు.
పాముకాటుతో యువకుడు మృతిచెందిన ఘటన తిరుమలగిరి (సాగర్) మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జువ్విచెట్టు తండాకు చెందిన సపావత్ శంకర్ HYDలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ పట్టభద్రుల ఉపఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడానికి స్వగ్రామం వచ్చారు. ఇంటి బయట వరండాలో నిద్రిస్తుండగా పాముకాటు వేసింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
నల్గొండ జిల్లా పెద్దఅడిశర్ల పల్లి మండలం నీలంనగర్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ- అంబులెన్స్ ఢీ కొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ- అంబులెన్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
WGL-KMM- NLG పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్ సోమవారం ముగిసింది. 1.27 లక్షల మంది పట్టభద్రులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. 4.63 లక్షల ఓట్లకు 3.36 ఓట్లు పోలయ్యాయి. నల్గొండలో 2021లో 77.68 ఓటింగ్ నమోదుకాగా 2024లో 73.29, సూర్యాపేటలో 2021లో 76.11 ఓటింగ్ నమోదు కాగా 2024లో 73.15, యాదాద్రిలో 2021లో 81.17 ఓటింగ్ నమోదు కాగా 2024లో 78.59 ఓటింగ్ నమోదయ్యింది.
Sorry, no posts matched your criteria.